Friday, March 26, 2021

కామదహనం ఫాల్గుణ శుద్ధ చతుర్దశి 2021 March 27

సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిన తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి , భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని , గర్వాన్ని అణిచాడు. ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసినదనీ శివుడు భార్యాహీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు. భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని తానిక అమరుడినని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు , జనులు , ఋషులను బాధించసాగాడు.
పర్వతరాజు హిమవంతుడు , మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేస్తారు. వారి తపానికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా *" నీవే మాకు పుత్రికగా రావాలి! "* అని కోరతారు. సరెనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది. శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు. హిమవంతుని పుత్రికయైన హైమావతి చిన్ననాటి నుండే అపరశివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది. హిమాలయాలలో తపములోనున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది. కానీ తపములోనున్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.


*యాలలు:*
*అంబికాదేవి యంతాలో హరుని సాన్నిధ్యముకే తెంచి*
*సంబరమున ప్రాణేశునిజూచి యో మౌనులారా !*
*చాల భక్తి గలిగి మ్రొక్కేనూ*
*దినదినా మీరితి గౌరి దేవి పూజజేసి పోంగ ఘనుడు*
*శంబుడి సుమంతైననూ ఓ మౌనులారా !*
*కానడు బ్రహ్మానందమువలనా*


ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు , నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు. అప్పుడు అందరూ కలిసి పార్వతీశివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడుదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు. నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివునకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి బాటలు వేయమని ఆదేశిస్తాడు. శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞవలన చేసేది లేక సరేనంటాడు.

*గద్యం:*
*అమరాధిపునిజేరి యానారదుండి*
*విమలుడీవిధమెల్ల వినిపించగాను*
*మంచిదని పృత్రారి మన్మథున్జూచి*
*యెంచి సహాయము లిడి బ్రతిమాలి*
*కాలకంఠునిజేరి కాచుకోనియుండి*
*బాలపార్వతి మీద భ్రమనొందజేయు*
*మనుచు సురపతి పయన మంపేటివేళ*
*కనుగొని కాముని కాంత యిట్లనియె.*

తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన మన్మథుడి భార్య రతీదేవి మన్మథుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు.


*మ. రతియిటెంతయు జెప్పినన్ వినక* *మూర్ఖంబొంది యామన్మధుం*
*డతిగర్వించి వసంత మధవునిలో నావేళతా* *వేళ్ళుచున్*
*శితికంఠున్ని* *పుడేమహామహిమచే స్త్రీలోలునింజేసి యా*
*వ్రతనేమంబున భంగపుత్తునని యా ప్రాంతంబునం జేరినన్*

వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మథుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు. ఆ బాణాలవలన శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపరచినది ఎవరు అని కృద్ధుడై అన్ని దిక్కులా పరికించిచూడగా ఓ మూలన భయపడుతూ కనబడతాడు మన్మథుడు. వెంటనే రుద్రుడై మూడోకన్నును తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.

*ద్వి. విరహకంటకుడట్లు వేగానజూచి*
*హరమూర్తినిటలాక్ష మదిదెర్వగాను*
*ప్రళయానలముబట్టి పారేటివేళ*
*బలువైనకాముండు భస్మమైపోయె*
*పసలేకరతిదేవి పడిమూర్చబోయె*
*కుసుమ శరుడు భీతి గొని పారిపాయె*

*ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు.* ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు. తెల్లవారి హోళిపండుగగా , కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు. అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోళి అని అంటారు.


*( వ్యాసంలో జతపరచిన ద్విపద మరియు గద్యాలు శ్రీ ముద్దు బాలంభట్టు గారిచే రచింపబడిన శ్రీ మంథని శివపురాణం లోనివి )*

Thursday, March 25, 2021

who wrote Guru Slokam? what is the history behind guru Slokam?

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం

"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

అయితే... ఈ శ్లోకం ఎందులోది?
ఏ సందర్భంలోది?
ఎవరు వ్రాశారు?
వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? 

ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.
కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు *"ప్రారబ్ధం భోగతో నస్యేత్"* అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం....
----------------- 

సర్వే జనా సుఖినో భవంతు.

స్త్రీ రూపంలో వినాయకుడు Lord Ganesha like Women way

ఆంజనేయునిలాగానే వినాయకుడు కూడా ఘోటక బ్రహ్మచారి అని ఒక నమ్మకం. అయితే చాలా సందర్బాలో ఆయనకు ధర్మపత్నిగా వేర్వేరు దేవతల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఉత్తరాదిలో ఆయనను సిద్ధి, బుద్ధి అనే దేవతా సమేతంగా ఆరాధించడం కనిపిస్తుంది. అక్కడక్కడా వృద్ధి అనే మరో దేవత పేరు కూడా గణపతి ధర్మపత్నిగా వినిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే లక్ష్మీ లేదా సరస్వతీదేవి వినాయకునికి తోడుగా కనిపిస్తారు. కానీ చాలా అరుదుగా వినాయకి అనే సహచరి పేరు కూడా వినిపిస్తుంది. ఆ విశేషాలు...

వేల ఏళ్ల క్రిందటే!

గణేశుని స్త్రీ రూపం అయిన వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో లభించిన క్రీస్తుపూర్వం నాటి ఒక వినాయకి టెర్రకోట ప్రతిమను ఇందుకు ఉదాహరణగా చెబుతూ ఉంటారు. వినాయకికి సంబంధించి ప్రత్యేక ఆలయాలు లేనప్పటికీ సుచీంద్రం, చెరియనాడ్‌ వంటి ప్రాచీన ఆలయాలలోని గోడల మీద వినాయకి శిల్పాలు కనిపిస్తాయి.

పురాణాలలో ప్రస్తావన

వినాయకి గురంచి జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేనప్పటికీ, పురాణాలలో మాత్రం ఈమె ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. స్కాంద, మత్స్య, వాయు, లింగ పురాణాలలో వినాయకి గురించి కబుర్లు వినిపిస్తాయి. కొన్ని కథల ప్రకారం వినాయకి తొమ్మిదిమంది మాతృకలలో ఒకరు. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె 64మంది యోగినిలలో ఒకరు. వినాయకికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, స్పష్టమైన కథనం మాత్రం అంధకాసురుని వధ సందర్భంగా వినిపిస్తుంది.

అంధకాసురుని వధ

పరమేశ్వరుడు ఒకనొకప్పుడు లోకకంటకుడైన అంధకాసురుడు అనే రాక్షసుని వధించడానికి బయల్దేరాడు. కానీ అంధకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంది. అదేమిటంటే... అతని రక్తం నేల మీద పడగానే, ప్రతి ఒక్క రక్తపు బొట్టు నుంచి ఒకో అంధకాసురుడు ఉద్భవిస్తాడు. అలా అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా చూడటానికి ప్రతి ఒక్క దేవతా నుంచీ స్త్రీ స్వరూపాలు వెలికివచ్చాయట. అలా వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీ తత్వమే వినాయకి.

ఆరాధన

గజానని, గణేశని, విఘ్నేశ్వరి... ఇలా వినాయకికి వివిధ పేర్లు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఆమెకూ వినాయకునికీ మధ్య స్పష్టమైన సంబంధం చెప్పనప్పటికీ, ఆమె రూపం మాత్రం అచ్చు వినాయకునిలాగే ఉండటం విశేషం. పరశు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి రూపమే ప్రాచీన శిల్పాలలో కనిపిస్తుంది. వినాయకిని విఘ్నాలకు అధినేత్రిగా భావిస్తారు. స్త్రీ దేవతలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిలోని పురుష తత్వం, స్త్రీ తత్వం ఉన్నట్లే... ప్రతి దేవతకీ తప్పకుండా స్త్రీ స్వరూపాన్ని ఆపాదించడం మన తత్వంలోనే ఉంది. ఎందుకంటే, ఈ రెండు గుణాలూ కలిస్తేనే పరిపూర్ణత అని మనకు తెలుసు. మరి ఆ గణేశుని స్త్రీ స్వరూపంగా వినాయనికి ఆరాధించడంలో వింతేముంది.

ఓం గం గణపతయే నమః

history & what is horoscope? జన్మపత్రిక 'జాతకం' అంటే ఏమిటి?

జాత అంటే పుట్టుక... పుట్టుకతో వచ్చినది కావున జాతకం అంటారు. ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆశ కల్గుతూ ఉంటుంది. భవిష్యత్తు లో తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖ సంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. 
ఆ సుఖవంతమైన జీవితాన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్ర విషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలని, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్న కోరిక ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది, అదే జ్యోతిష శాస్త్రం.

జ్యోతిషశాస్త్రం ద్వారా జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను ఆధారంగా వేయబడే అంశా చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు పలుకుతారు. జ్యోతిషమనే మహా సముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది. అటువంటి జాతకచక్రము వేయటానికి ముందు మన రాశి, నక్షత్రములను తెలుసుకోవటం ఎలాగో తెలుసుకుందాము. వ్యక్తి జన్మించిన తేది, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, జన్మించిన ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గుణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.

జాతక చక్ర ఫలితానికి 'గణితం' ప్రధానమైనది. జన్మ వివరాలు, సమయము మొదలగునవి సరైనవి కాక తప్పుడు వివరాలు కానీ, స్కూల్ సర్టిఫికేట్ ఆధారంతో చెప్పేవి పండితునికి చెబితే ఫలితాలు తప్పుతాయి. సదరు వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పుగా వస్తాయి. సరైన భవిష్యత్తును తెలుసుకోవలనుకుంటే పుట్టిన వివరాలు సరైనవి అయి ఉండాలి. మానవుని జీవితంలో జాతక చక్రము ఎంతో అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జాతకం మన జీవిత రేఖను తెలియజేస్తుంది. గ్రహ స్థితిని అనుసరించి మనం తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి కాపాడబడి ఉపశమనం పొందగలము. ఉదా : వర్షం నుండి రక్షణ కలిగించే గొడుగు వలె.

ప్రతి తల్లిదండ్రులకు సంతానం కలిగిన మరుక్షణంలో కలిగే ప్రధాన సందేహం పుట్టిన వారి జాతకం ఎలా ఉన్నది, ఏ పేరు పెట్టాలి, ఏ అక్షరాలు పేరుకు అనుకూలంగా ఉంటాయి, జాతకంలో ఏవైనా దోషాలున్నాయా, ఉంటే వాటి నివారణకు ఏం చేయాలి అని, ఇలా చాలా సందేహాలు మనసులో మెదులుతుంటాయి. సంతానం యొక్క జన్మ నక్షత్రం, రాశి, జన్మనామం, పేరుకు తగిన అక్షరాలు, జనన కాల దోషాలు మొదలగు వివరాలు జాతకం ద్వారా తెలుస్తాయి. 

పిల్లల జాతకం తెలుసుకోవటమే కాకుండా, వారి పేరుకు తగిన అక్షరాలు, జాతక దోషాలు, నక్షత్ర, తిథి సంబంధమైన దోషాల వివరాలు అందిస్తుంది. పూర్వకాలంలో శిశువు జన్మించిన వెంటనే అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని ద్వారా శిశువు యొక్క తాత్కాలిక జాతకచక్రం గణన చేయించి మంచి, చెడులు తెలుసుకునే వారు. కొన్ని దేశాల్లో శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే పేరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నందున, అప్పుడే పుట్టిన పిల్లల జాతకవివరాలు తెలుసుకోవటానికి జ్యోతిషం ఉపయోగ పడుతుంది. జాతక చక్రముతో పాటు, ఘాత చక్రం, అదృష్ట అంశములు, దశాంతర్దశ పట్టికలు మొదలైనవన్నీ తెలుస్తాయి.

జన్మ పత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి :- శిశువు జన్మించిన 10 రోజుల తర్వాత అంటే పురుడు అయ్యాక జన్మ పత్రిక వ్రాయించు కోవాలి. జాతకం వ్రాయించు కోవడానికి జ్యోతిష పండితుని వద్దకు వెళ్లేముందు "స్వయంపాకం" , పండ్లు తీసుకొని వెళ్ళాలి. జాతకం వ్రాయించు కున్నాక వారికి దక్షిణ ఇచ్చి జాతక వివారాలను తెలుసుకోవాలి. ఒక వేళ ఎవరికైన నక్షత్ర పాద శాంతి ఏర్పడినచో శిశువు పుట్టిన తేదీ నుండి 27 రోజుల లోపు జప, శాంతి కార్యక్రమం జరిపించుకోవాలి. శాంతి అనేది శిశువు జన్మించిన నక్షత్ర పాద దోషమే కాకుండా ప్రేగులు మేడలో వేసుకుని పుట్టినా, కాళ్ళు ముందుగా బయటకు వచ్చినా, శిశువు తలిదండ్రుల లేదా తోబుట్టువుల నక్షత్రంలో పుట్టిన శిశువునకు శాంతి ఏర్పడుతుంది కావున దాని నివారణార్ధం శాంతి జరిపించుకోవాలి.  

        "కర్మాచరణలో మానవుడికి పూర్తి స్వేచ్చ ఉన్నది.
        ఆ స్వేచ్చే లేకుంటే కర్మలేదు, కర్మ లేకుంటే జన్మలేదు".

వేదాలలో చెప్పబడిన శాస్త్రములన్నింటిలో జ్యోతిష శాస్త్రం ప్రధానమైనది. వ్యక్తి గత జాతకం ద్వారా శారీరక, మానసిక స్థితి గతులను, గతజన్మ కర్మ ఫలితాల ఆధారంగా ప్రస్తుత జన్మలో మంచి, చెడులను తెలుపుతూ దానిని సరిదిద్దుకునే అవకాశం శాస్త్రం కల్పించింది. సత్కర్యాచరణ ద్వారా మనకున్న ఇబ్బందులను దూరం చేసుకోవచ్చును అని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. సమస్యలు వచ్చాక అవి తీవ్ర స్థాయికి చేరాక జ్యోతిషుని సంప్రదించేకంటే, అన్ని వేళల్లో జ్యోతిష్కుని సంప్రదిస్తూ ఉండాలి.

హరివరాసనం చరిత్ర

అయ్యప్ప పూజ చివరిలో *"హరివరాసనం"* లేదా *"శ్రీ హరిహరాత్మజాష్టకం"* గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు.
ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు.

ఈ స్తోత్రాన్ని *"కుంబకుడి కులతూర్ అయ్యర్"* రచించాడు.
1955 సంవత్సరంలో *స్వామి విమోచనానంద* ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో *వి. ఆర్. గోపాలమీనన్* అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు.
అప్పట్లో *"ఈశ్వరన్ నంబూద్రి"* అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత *గోపాలమీనన్* శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన *ఈశ్వరన్ నంబూద్రి* ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో *"హరివరాసనం"* స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క దీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది.

శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, *"స్వామి శరణు"* అని కూడా చెప్పుకోవద్దని చెబుతారు.


*ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.*

*హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం* *ఆరాధ్యపాదుకం*
*అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం* *నర్తనాలసం*
*అరుణభాసురం* *భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం* *సుప్రభాంచితం*
*ప్రణవమనీద్రం* *కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*తురగవాహనం సుందరాననం - వరగధాయుధం* *వేదవర్ణితం*
*గురుకృపాకరం* *కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం*
*త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం*
*ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం*
*కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం* *సాధుజీవనం*
*శృతిమనోహరం* *గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

Saturday, March 20, 2021

Yadagirigutta Lakshmi Narasimha Swami Telangana

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము 

ఇది నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.

స్థల పురాణం:
ఆలయ ముఖ ద్వారం:
ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపని గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.

తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. 

ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో ల క్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.

చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలొ ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబందించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో వున్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడ అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏంకావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారికి “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి
కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. 

యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము:
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. రాయ్ గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు కలవు పాత నరసింహస్వామి ఆలయము యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి.

పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు వెలసి తరువాత కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళినారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.
విజయవాడ - హైదరాబాదు రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. ఇక్కడి విశేషము ఏమంటే కొండమీద పుష్కరిణిలో స్నానంచేసి, నియమంగా ఒక మండలం రోజులు స్వామికి ప్రదక్షిణలు చేస్తే సర్వబాధలు తొలగి ప్రశాంతతను పొందగలరని గట్టి నమ్మకం. స్వామివారు 16 రోజులకు స్వప్న సాక్షాత్కారంలో దీక్షా పరులయిన భక్తుల సమస్యలకు పరిష్కారం సూచించునని కూడ చెప్పుకుంటారు. 

స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ తదియ నుండి ప్రారంభమై ద్వాదశి వరకు కోలాహలంగా జరుగుతాయి. 

చూడదగినవి:
శివాలయము, సంస్కృత కళాశాల, అద్దాల మంటపం, పాంచరాత్ర పద్ధతిని అర్చనాదుల్లో శిక్షణ యిచ్చే పాఠశాలలు ముఖ్యములు. 


ఈ ప్రాంతాల్లో ఇంకా చూడదగినవి: 
బీదర్‌లో కోట, మాణిక్యనగర్, హుమ్నాబాదు సమీపంలో ఉన్నది - ఒక గొప్ప మహనీయుని సమాధి - పెద్ద నగరంలాగా భవనాలు, సత్రాలు నిర్మించబడ్డాయి. చూడదగిన ప్రదేశం.

Saturday, March 6, 2021

RESILIENT LOVE

An ode to single special mothers

With teary eyes, she endures the pain,
Of childbirth; of bringing a life into the world,
For the culmination of Womanhood, shall be her gain,
When a mother sits with her newborn; in her arms curled.

Little did she know the Providential Plan,
Of putting the mettle of her Motherhood to test,
For her ward couldn’t do, what most kids can,
Like an awkward expression of Divine jest.

But the resilient mother had made her choice,
Not to lament, but to fight,
To be her debile child’s emphatic voice,
As it was her life’s only light.

The obligation was upon her, sans her man,
While others saw only her child’s debilities,
Only she could see the things her child can,
Truly accomplish with its reminiscent abilities.

With love for her ward in every sinew,
She empowers it for what the future would hold,
And apprehensions of her own, she would subdue,
The stories of such mothers should never go untold.

-- Vijay K Nair

Thursday, October 15, 2020

Hinduism

Devotee : "Swamiji, who is the founder of Christianity?"

Swami Chinmayananda : "Jesus"

Devotee : "Who is the founder of Islam?"

Swami Chinmayananda : "Mohammed".

Devotee : "Who is the founder of Hinduism?"

Swami Chinmayananda : "................."

Devotee : "What Swamiji, your religion doesn't have a founder?"

Swami Chinmayananda :

"There is no one particular founder for Hinduism as its not an outcome of one personality's knowledge.

Let me put the same question to you. Who is the founder of Chemistry? Physics?

You cannot answer, because these are sciences which had contributions from plenty of scientists.

In Hinduism, our Rishis were the scientists".

Devotee : "..."

Swami Chinmayananda :

"If you ask a Christian to give book on Christianity, he gives you Bible.

If you ask a Muslim to give book on Islam, he gives you Quran.

But if you ask me to give book on Hinduism, I will say, "Welcome to my Library!"

More precisely, it is सनातन धर्म (Sanatan Dharma) with no precise comparable term in English and that is why most of the world is unable to understand the concept. They need to learn some Sanskrit and some of the ancient history of Bharat to understand this.

Closest rough translation in English would be Eternal Character / Properties. It is neither Hindu nor religion. It is an ever evolving science of the character and properties of Universe including lessons for mankind on how to live a complete life aligned to the principles of Universe.

Hence, most of our ग्रंथ (granthas, NOT scriptures, closest translation "volumes") like Vedas, Upanishads, Aranyaks, Brahmanas, have no author, for, the Rishis saw these, not as their creation, but revelations of nature through them, ever evolving.

They also do not have a date for they have evolved over millennia and keep evolving. Date is applied to static things or things with short duration. How does one apply dates to eternal and ever evolving.

And in this sense, every human on earth, irrespective of his/her belief or religion, whether they agree or not, is a Sanatani....

Be proud of being a Sanatani (eternal). 🙏🏼🙏🏼🙏🏼🚩🚩

Sunday, September 13, 2020

Importance of 108 in Hinduism

As per Vedic science, the universe is made up of 108 elements. And why 108 is auspicious for Hindus let us understand there are many reasons. 

The Vedic cosmology believes diameter of Sun is 108.7 that of the earth. 

The distance between earth and sun is 108 times the sun. 

The distance between earth and moon is 108 times the diameter of the moon.

Our eyes can see up to 3 dimensions but sages could perceive with their yogic powers beyond these real metaphysical dimensions. 
Power of 1= 1; Power of 2= 4; Power of 3= 27. And 1x4x27 = 108. This way our eyes perceive matter.

Shiva Purana records 108 karanas in Tandava (Cosmic dance) as employed in Yoga, Vedic martial Arts part of Dhanurvidya, Kalaripayattu and Kung Fu.

Sri yantra, is made of Marmas which are intersection of three lines. There are 54 such intersections, each having (masculine) Purusha - consciousness and (feminine) Prakriti - matter, qualities. Thus, there are 54×2=108 points. Sri yantra is made up of 54 pentagons and each angle of pentagon is 108 degrees.

The Atman or the human consciousness goes through 108 stages on its journey post death.

In Vedic astrology, there are 12 houses and 9 planets. 12 times 9 equals 108.

Tantra estimates, in 1 minute, a healthy human breathes 15 times, in 1 hour 900 times, and in 12 hours 10800 times. The average number of breaths per day is 21,600, of which 10,800 are solar energy, and 10,800 are lunar energy.

A Mala (Vedic rosary) is a string of 108 beads.

There are 27 Nakshatras (constellations) in our galaxy, each one them has 4 padas / Charan (directions), 27 x 4 = 108, which encompasses the whole galaxy.

Shrimad Bhagavatam has 108000 Shlokas.

54 letters in the Sanskrit alphabet. Each has masculine and feminine. 54 x 2 = 108.

Saturday, September 5, 2020

ఆదిత్య_హృదయ_పఠనం

#ఆదిత్య_హృదయ_పఠనం #సర్వకార్య_సిద్ధికీ_మూలం

"ఆదిత్య హృదయం" స్తోత్రమును శ్రీ రామచంద్రునకు అగస్త్య మహర్షి ఉపదేశించినది. ఈ స్తోత్రాన్ని రోజూ సూర్య నమస్కారం చేస్తూ.. మూడుసార్లు పఠిస్తే అనారోగ్యాలు, ఈతిబాధలుండవు. విజయాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది.

"రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్|
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం||

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః|
జ్యోరిర్గణానాం పతయే దినాధిపతయే నమః||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల్మేవచ|
యానికృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభః||

విజయ లబ్ధికై ఈ స్తోత్ర పారాయణము ఉపకరిస్తుందని పండితుల వాక్కు. రామాయణంలో రాముడిని కార్యోన్ముఖుడిని చేసేందుకు ఆదిత్య హృదయాన్ని సప్త రుషుల్లో ఒకరైన అగస్త్యుడు ఉపదేశించారు. రామాయణంలోని యుద్ధకాండ. లంకలోకి అడుగుపెట్టిన రాముని ఎదుర్కొనేందుకు, రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చినవారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు.

ఒకపక్క వారితో యుద్ధం చేస్తున్న ఆయన శరీరం అలసిపోతోంది. అంతకుమించి తన కళ్లెదుట జరుగుతున్న మారణహోమాన్ని చూసి మనసు చలించిపోతోంది. దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది. దీన్ని గమనించిన అగస్త్య మహాముని.. ఆదిత్యునిని ప్రార్థించమని చెప్తారు. ఆయనను ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందని.. అంతులేని విజయాలు పొందవచ్చునని సూచిస్తాడు. అలా చెప్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని లోకానికి అందించారు.. అగస్త్య ముని.

ఈ ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలుంటాయి. 

మొదటి ఆరు శ్లోకాలు ఆదిత్య పూజ కోసం. 
ఏడో శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఆదిత్య ప్రశస్తి వుంటుంది. 
15వ శ్లోకం నుంచి 21 వరకు ఆదిత్యుని ప్రార్థన, 
22వ శ్లోకం నుంచి 27వరకు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించి వర్ణన వుంటుంది. 
ఇదంతా విన్న రాముల వారు కార్యోన్ముఖులు కావడాన్ని 29,30 శ్లోకాల ద్వారా గమనించవచ్చు.

రాముల వారికే విజయాన్ని, శుభాన్ని ఇచ్చిన ఈ ఆదిత్య హృదయాన్ని రోజువారీగా పఠించిన వారికి విశేష ఫలితాలుంటాయి. అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, అనారోగ్యాలు ఏర్పడినా... ఎలాంటి ఒడిదొడుకులలోనైనా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకి చేరుస్తుంది. శత్రువినాశనం కావాలన్నా, దారిద్ర్యం దూరమవ్వాలన్నా, మనోవాంఛలు తీరాలన్నా ఆదిత్య హృదయం తారకమంత్రంలా పనిచేస్తుంది.

మూడుసార్లు కనుక ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఈ సంగ్రామంలో విజయం సాధిస్తావు.. అంటూ సాక్షాత్తూ అగస్త్య మహర్షే 26వ శ్లోకంలో పేర్కొంటారు. కాబట్టి అవసరాన్నీ, అవకాశాన్నీ బట్టి ఎన్నిసార్లయినా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా నిలిచి ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెప్తున్నారు.


ఓం శ్రీ ఆదిత్యాయ నమః

Wednesday, September 2, 2020

ముత్తయిదువ లక్షణాలు Pearl properties

*ముత్తయిదువ లక్షణాలు*

మొత్తం అయిదు అలంకారాలు ఉన్న 
స్త్రీని ముత్తైదువ అంటారు.అవి..

1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు
2) చేతులకి గాజులు
3) మెడలో మంగళసూత్రం
4) తలలో పువ్వులు
చివరగా
5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..

1) మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:

కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..

ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..
ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. 

అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. 

ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.
గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది. 

అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

 ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు.

గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..

మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు. 

ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని.పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి. 

అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది

మూడవది మెడలో మంగళసూత్రం.

దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. 
అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.
ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.

ఇక నాల్గవది తలలో పూవులు.

వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.కలయసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.

ఇక అయిదవది. చివరిది. నొసటన సింధూరం.

పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.
ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!

అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు.

 జై సనాతన ధర్మం.

Monday, August 10, 2020

New Education Policy 2020

* Cabinet has approved the New Education Policy 2020 *.
Education policy has been changed after 34 years. The notable things about the new education policy are as follows:

---- * 5 Years Fundamental * ----
1. Nursery @ 4 Years
2. Jr KG @ 5 Years
3. Sr KG @ 6 Years
4. Std 1st @ 7 Years
5. Std 2nd @ 8 Years

---- * 3 Years Preparatory * ----
6. Std 3rd @ 9 Years
7. Std 4th @ 10 Years
8. Std 5th @ 11 Years

----- * 3 Years Middle * ----
9. Std 6th @ 12 Years
10.Std 7th @ 13 Years
11. Std 8th @ 14 Years

---- * 4 Years Secondary * ----
12. Std 9th @ 15 Years
13. Std SSC @ 16 Years
14. Std FYJC @ 17Years
15. STD SYJC @ 18 Years

Important things:

---- There will be board in 12th class only.
4 years of college degree. 10th Board Expiry.
MPhil will also be closed.
(In institutions like JNU, 45 to 50 years old students stay there for many years and MPhil, all these debauched leftist ideologues will now be removed from the institute ..)
---- Now students up to 5th will be taught in mother language, local language and national language only. The rest of the subjects, even if they are English, will be taught as a subject.
 
---- Now * just have to take board exams in 12th standard *. Whereas before it was mandatory to take the 10th board examination, which would not happen now.

---- Examination will be done in the semester from 9th to 12th class. * Schooling will be taught under the 5 + 3 + 3 + 4 formula * (see table above).

---- College degree will be 3 and 4 years old. That is, a certificate will be given on the first year of graduation, diploma on the second year, degree in the third year *.

---- 3 year degree is for those students who do not have to take higher education. At the same time, students doing higher education * will have to do a 4-year degree. Students doing 4 years degree will be able to do MA in one year *.

--- Now students will not have to do MPhil. * Rather MA students will now be able to do PHD * directly.

---- Students will be able to do other courses in between. * Gross enrollment ratio will be 50 percent by 2035 in higher education *. At the same time, under the new education policy, if a student wants to do another course in the middle of one course, then he can take a second course by taking a break from the first course for a limited time.

---- Many reforms have also been made in higher education. Improvements include graded academic, administrative and * financial autonomy etc. Apart from this, * e-courses will be started in regional languages. Virtual Labs * will be developed. A National Educational Scientific Forum (NETF) will be started. Please tell that there are 45 thousand colleges in the country.

---- There will be uniform rules for all government, private, deemed institutions.
According to this rule, new academic session can be started and all students and parents carefully read this message.

Saturday, August 8, 2020

*అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు*

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని *[ Ego ]* నింపాయి.

ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి  'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!" అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను... కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. 

అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు. 

మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు.  శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది.  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది. 

ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని  వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది. 

 *అంతే !* మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు  ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' *ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!"* అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!  *"ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది"* అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది.

మనం పెంచుకొనే అహంభావం *[ Ego ]* అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది.  స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం. 

మీరు గమనించారా ? 
'' *అహంభావం* '' అనే పదం లోంచి *' అహం '* తీసేస్తే మిగిలేది *' భావం '* అంటే  ' అర్థం ' *అర్థమైతే అనర్థం జరగదు.
 శుబోధయం

How can one get 10K visitors on a blog daily, and in how much time?

I have known about regular posting for years but just couldn't keep up. I saw a drop in traffic if I stopped posting fresh content and if I did post like clock work the traffic would keep climbing and climbing. Those periods where I did not post set back my traffic rise and made it harder to get the momentum back.

At the moment I am posting every second day on my Tips4pc blog and the momentum is picking up fast. I expect to get the traffic up to 20,000 visits per day very soon.

The other side of the coin here is to publish content like a madman and build traffic like that. Not really a good idea because there is no doubt that you sacrifice reader engagement when you post too often. No one has time to comment on your articles and get involved in any way. That's why I like to publish every two days. That's 48 hours of limelight and promotion for each article.

Researched Content

Always make sure your content has the correct information for your readers. For example if you have a how to article, and your instructions turn out to be completely wrong, your reputation will be damaged. If you continually do this your website will not be successful and your traffic will not build up. Don't be lazy, do your homework!

In order to get 10,000 website visitors per day, you need to have well researched content that will make your human visitor happy. We all know that we need quality content to succeed in this blogging game, so don't risk your business by publishing junk that is not fully researched!

Information in Need

If you see a whole or a gap in the information you find during the research phase, then fill it. But with a little SEO, you can really grab the traffic you need.

Websites can have 1000 articles but still not get the traffic like I do. It is not the quantity of content that gets the free traffic from the search engines, it is the right content that gets the traffic. For example on one of my websites, I had 54 articles published and was getting 1,000 visits a day. On my Tips4pc website I had around 700 articles when I started getting to the 10,000 visits a day range. Well how did I get 1,000 visits a day from 54 articles? I researched the keywords I used and promoted them. After all it was a smaller website and easier to choose the best content to promote.

Teach People

The information you need can be found for just about any topic but it is how you deliver it that sets you apart. We have all heard the saying “Keep it simple stupid”. Well this applies when you are trying to teach people. Why show off and make things sounds technically difficult? Try and explain your steps and information in an easy to understand way.

Often when people are typing into the search engines, they are usually looking to solve a problem. When they land on your website, you might have the right information, but they might not understand. You need to step back and put yourself in other people's shoes. Forget about the knowledge you have and think about the knowledge they have and how they can understand your article.

#SharedAGoodContent

Guided Meditation Series




Chinmaya International Foundation (CIF) brings you Guided Meditation Series, online weekly sessions based on Kaivalya Upanishad with Pujya Swami Swaroopananda, Global Head of Chinmaya Mission. This online series will be conducted in English over twenty consecutive Saturdays from 19th September 2020 to 30th January 2021 at 9:00 to 10:00 AM CST | 3:00 to 4:00 PM BST | 7:30 to 8:30 PM IST (LIVE).

Text: Kaivalya Upanishad

Kaivalya Upanishad is one of the famous Upanishads delineating the knowledge of the Reality with considerable emphasis on the methodology of meditation; both saakaara (with form) and niraakaara (formless). The Upanishad points out faith, devotion, and meditation as the means for realizing one's identity with the Supreme. The Upanishadic wisdom is given as a dialogue between Lord Brahma, the teacher, and the Vedic sage Ashvalaayana, the student. The Upanishad’s approach is direct and endearing.

Meditation

Meditation is the effortless abidance in the Self. The efforts were undertaken to gain this abidance also go by the name meditation. In this Guided Meditation Series, Pujya Swami Swaroopananda will share with seekers the preparatory steps as well as the actual process of meditation that will take the seekers into the realms of effortless abidance. Meditation is one of the most important spiritual practices and the doorway to the Supreme. Modern science is slowly discovering its value in the overall physical and mental health too. It is the most powerful technique to change one's perspective towards life enabling a positive outlook and is a sure remedy for the stress and anxiety of daily life.

Highlights

  • Rare blessing to learn the art of meditation from Pujya Swami Swaroopananda, Global Head of Chinmaya Mission
  • The session series focuses on learning meditation through the most authentic source, the Upanishads, and specifically, the Kaivalya Upanishad.
  • Offers guided contemplation exercises for inner transformation
  • Each study class includes discourse (30 min), guided meditation (15 min), and Q&A (15 min).
  • Language of communication: English
  • Time: Every Saturday at 9:00 to 10:00 AM CST | 3:00 to 4:00 PM BST | 7:30 to 8:30 PM IST (LIVE).
  • Starting date: 19th September 2020 (Saturday). Ending date: 30th January 2021 (Saturday).
  • Videos will be available for viewing to all registered participants until February 2021.

Pujya Swami Swaroopananda

In an era rife with skepticism and confusion about matters spiritual, Swami Swaroopananda is a rare voice that blends authenticity with accessibility; theory with self-practice; logic with heart. As a child, he heard many religious stories from his grandmother, tales from the great Indian epics and the lives of saints, and verses from the Guru Granth Sahib. These stories suddenly came to life, acquiring new meaning and depth, when as an adolescent he encountered the preeminent Master of Vedanta, Swami Chinmayananda. His heart completely moved and inspired, in 1984 Swami Swaroopananda gave up his family's thriving business to undergo intensive training under Pujya Gurudev Swami Chinmayananda and Pujya Guruji Swami Tejomayananda at Sandeepany Sadhanalaya, Mumbai. He was initiated into the monastic order in 1992. Since then, he has touched thousands of lives across the world, and his tremendous work in bringing out the essential wisdom and underlying unity of all religions has garnered him a place among the vanguards of self-development philosophy. He was formerly the Regional Head of Chinmaya Mission Australia, United Kingdom, Middle East, Africa, and the Far East, and presently Chancellor of the Chinmaya Vishwavidyapeeth Trust (University for Sanskrit and Indic Traditions) and Chairman of the Chinmaya International Residential School in Coimbatore, South India. In January 2017, Swami Swaroopananda was bestowed by Swami Tejomayananda the privilege to serve as the Global Head of Chinmaya Mission.

Register @ https://chinfo.org/home/event/guided-meditation-series/46

Wednesday, July 29, 2020

Why Should I feel Bad. When Girl Rejects Love!

Once, there was this guy, who was in love with a girl. She wasn’t the most beautiful and gorgeous but for him, she was everything. He used to dream about her, about spending the rest of their life with her. His friends told him, “why do you dream so much about her when you don’t even know if she loves you or not? First, tell her your feelings, and get to know if she likes you or not”.

He felt that was the right way. The girl knew from the beginning, that this guy loves her. One day when he proposed, she rejected him. His friends thought he would take alcohol, drugs, etc, and ruin his life. To their surprise, he was not depressed.

When they asked him how was it that he is not sad, he replied, “‘why should I feel bad? I lost one who never loved me and she lost the one who really loved and cared for her.”


Moral: True Love is Hard to Get. Love is all about giving to another person without the greed of gaining anything in return if another person rejects it, it's him/her who will be losing the most important thing in life. So never feel dejected.

Sunday, July 26, 2020

Kashmiri Honey - 100% Pure

PRE ORDER NOW
No Fancy packaging, No brand labels, Just pure product directly from Kashmir delivered to your Homes.
We are providing 100% pure Kashmiri Honey. There are no added coloring agents or preservatives.
Purity Guaranteed
The product will be delivered in 12-15 Days CONTACT FOR DISCOUNT -  Rs. 1,399.00

Sale pri
Shipping calculated at checkout.
Quantity: 500GRMS

Elephant Set Size: 5",4",3"

Rs. 5,999.00

Sale price
Rs. 2,999.00 
Shipping calculated at checkout.
Often considered as a symbol of good omen, this Papier Mache is an excellent possession to have and a wishful present to offer for the celebration of an achievement, starting a new life journey, or moving into a new house.
Papier-mâché brings together the pragmatic, who gives shape to the base object, and the philosopher, who paints it with his imagination. Intricately designed by skilled hands, with fine strokes and beautifully captured chinar leaves, this crafted piece of a duck of paper Mache is your treat for many things. You can use it as a dry fruit bowl to serve your guests, gift it to someone special or use it simply as a décor material for your office or home to catch the eyesight even from the farthest corner. Its beautiful artwork speaks of the skill and hard work of those who have affected their eyes to preserve the art and produce it to the world from the space of heaven itself. Papier-mâché brings together the pragmatic, who gives shape to the base object, and the philosopher, who paints it with his imagination. Let your choice of art represent your unique style

Charcoal Face Scrub : 50gms. Rs. 1,299.00 Sale price Rs. 899.00 Sale Shipping calculated at checkout.

Cashew nuts 250g, Rs. 799.00 Sale price Rs. 749.00 Sale Shipping calculated at checkout.

" PING FOR DISCOUNT "
No Fancy packaging, No brand labels, Just pure product directly from Kashmir delivered to your Homes. 
Cashews are low in sugar and rich in fiber, heart-healthy fats, and plant protein. They’re also a good source of copper, magnesium, and manganese — nutrients important for energy production, brain health, immunity, and bone health.
Cashews are rich in a range of nutrients. One ounce (28 grams) of unroasted, unsalted cashews provides you with around (Source: Healthline)
  • Calories: 157
  • Protein: 5 grams
  • Fat: 12 grams
  • Carbs: 9 grams
  • Fiber: 1 gram
  • Copper: 67% of the Daily Value (DV)
  • Magnesium:20% of the DV
  • Manganese: 20% of the DV
  • Zinc:15% of the DV
  • Phosphorus: 13% of the DV
  • Iron: 11% of the DV
  • Selenium:10% of the DV
  • Thiamine: 10% of the DV
  • Vitamin K: 8% of the DV
  • Vitamin B6: 7% of the DV

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...