I am UNIQUE, AMAZING, ORIGINAL, STRONG, KIND & I'm who I am. REAL and SIMPLE. :-) MoSt Of AlL My LiFe Is SiMpLe AnD CoLoRfUl...
Wednesday, July 29, 2020
Why Should I feel Bad. When Girl Rejects Love!
He felt that was the right way. The girl knew from the beginning, that this guy loves her. One day when he proposed, she rejected him. His friends thought he would take alcohol, drugs, etc, and ruin his life. To their surprise, he was not depressed.
When they asked him how was it that he is not sad, he replied, “‘why should I feel bad? I lost one who never loved me and she lost the one who really loved and cared for her.”
Moral: True Love is Hard to Get. Love is all about giving to another person without the greed of gaining anything in return if another person rejects it, it's him/her who will be losing the most important thing in life. So never feel dejected.
Sunday, July 26, 2020
Kashmiri Honey - 100% Pure
Elephant Set Size: 5",4",3"
Rs. 5,999.00
- Sale price
- Rs. 2,999.00 Sale
Cashew nuts 250g, Rs. 799.00 Sale price Rs. 749.00 Sale Shipping calculated at checkout.
- Calories: 157
- Protein: 5 grams
- Fat: 12 grams
- Carbs: 9 grams
- Fiber: 1 gram
- Copper: 67% of the Daily Value (DV)
- Magnesium:20% of the DV
- Manganese: 20% of the DV
- Zinc:15% of the DV
- Phosphorus: 13% of the DV
- Iron: 11% of the DV
- Selenium:10% of the DV
- Thiamine: 10% of the DV
- Vitamin K: 8% of the DV
- Vitamin B6: 7% of the DV
Sunday, May 17, 2020
Smart way of conversions
Wednesday, April 1, 2020
How The Awareness Of Death Brings More Life
Recommendations for Covid - 19 From Psychologists
Thursday, July 25, 2019
Helpers Desk!!!
In case of emergency! In all cases, if you are not able to reach destination point. I am here to take your valuable things to your destination.
Ping me for the Rescue to your Mental Ability!
Saturday, March 30, 2019
My Feel about Nature
Saturday, January 12, 2019
Swami Vivekananda ji's words
"When a man has begun to be ashamed of his ancestors, the end has come. Here am I, one of the least of the Hindu race, yet proud of my race, proud of my ancestors. I am proud to call myself a Hindu, I am proud that I am one of your unworthy servants. I am proud that I am a countryman of yours, you the descendants of the sages, you the descendants of the most glorious Rishis the world ever saw.
Do you feel for others? If you do, you are growing in oneness. If you do not feel for others, you may be the most intellectual giant ever born but you will be nothing; you are but dry intellect, and you will remain so…..
Do you know from the history of the world where the power of the Prophets lay? Where was it? In the intellect? Did any of them write a fine book onphilosophy, on the most intricate ratiocinations of logic? Not one of them. They only spoke a few words. Feel like Christ and you will be a Christ, feel like Buddha and you will be a Buddha. It is feeling that is the life, the strength, the vitality, without which no amount of intellectual activity can reach God. Intellect is like limbs without the power of locomotion. It is only when feeling enters and gives them motion that they move and work on others. That is so all over the world, and it is a thing which you must always remember…."
- Swami Vivekananda
Let us feel what Swami Vivekanandaji felt for our culture, country and Self. Lets walk the path showed by Him. Salutations to Him on Vivekananda Jayanti.
*Am thanking my Guru for sharing this to me.
*Am a proud practicing Hindu!*
Sunday, December 16, 2018
Sometimes a pity feeling
Am happy to say this.
Be Positive. Be Brave.
Sometimes give up is a best thing for family.
All are thinking about me and I hate this feeling. Because everyone is showing concern on me.
Wednesday, August 22, 2018
Pancharamas
The famous Shiva temples in Andhra Pradesh are known as Pancharamas.
The Skanda Purana for the formation of the Pancharamas describes their place as follows.
Formerly a demon named Tarakasuru, he performed great penance for Lord Shiva and acquired the soul sex of Lord Shiva. With this, the gods proudly tortured the gods in various ways, with which the gods prayed to Vishnu and sent their son, Tarakasuru, to battle with Shiva. When pierced that soul sex takes place in five different places. They are then revered by the gods in their respective places.
These five shrines also flourished as monasteries during the Buddhist period. Buddhism was at its peak in India at that time. At that time there were many eminent professors in our Andhra country. These landmarks can also be seen in front of the Kanakadurga Ammavari Temple in Vijayawada.
These are the Pancharamas:
1. Daksha Ramamu -
Daksharama, the first of the Pancharamas, is located in Ramachandrapuram in the East Godavari district.
Here Swami is called Bhimeshwar. Swami Lingakaram is 60 feet high. Worship should be performed from the top floor. The uniqueness of this temple is that the gender is half white and half black.
Dakshaprajapati performed Yagna here. Hence the name Draksharamam. The temple is believed to have been built by the Chalukya king Bhima. In his Bhimeswara Purana, he wrote that in ancient times, many gods and kings were visited by Swami. The sculptures in this temple are magnificent.
2. Amara Ramamu -
Amararamam, the second of the Pancharamas, is located on the banks of the Krishna River in Amravati, Guntur district. It is also known as Swami Amareshwar.
The idol in the sanctum sanctorum was scattered after the slaying of Tarakasura and the soul lingam of Lord Shiva was scattered in the throat. This Shiva lingam is made of marble. White looks gorgeous. In the past, this Shiva lingam used to grow slowly every year. Now the growth has stopped.
3. Kshirar Ramamu -
Kshiraramam is located in Palakollu in the West Godavari district. The idol of Lord Shiva here is known as Sri Ksheera Ramamu Lingeshwara Swamy.
There is a story that the village got its name from the rulers. When Lord Shiva threw his arrow into the ground, a milky way came out of the ground and the name Kshiram means milk, hence the name Kshirpuri. Swami's temple was built by the Chalukyas in the 11th century. The temple is 125 feet high and is built with 9 domes.
4. Somaramamu -
Somarama, the fourth of the Pancharamas, is located at Gunipudi, two kilometers from Bhimavaram in the West Godavari district.
The Swami here calls them Someshwar. There is a specialty here. When the full moon returns, it will return to normal. The moon is worshiped here by the moon.
5. Kumara Bhimaramamu -
Kumarabhimarama, the last of the Pancharamas, is located at a distance of 1 km from Samarthkotta in the East Godavari district.
The temple was also built by Bhima, the Chalukya king who built Daksharama. The Shivalingam here is made of limestone.
Sunday, April 8, 2018
యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. A small story about Money
గొప్ప నీతి కథ....
అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.
దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలా అలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.
అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.
అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.
నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.
ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.
*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.
*అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా!* కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.
అవును! ప్రతిధ్వనించింది ఆత్మ.
వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.
అనుభవించాలా? ఎలా?
నీ శరీరానికి *డయాబెటిస్* కాబట్టి తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి *బీపీ* సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను.
ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి.
*నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట*
అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు.
నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను?
*ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?*
*నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం*?
నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే.
నాకు రక్షణ లేదు. సుఖం లేదు.
*అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు .. డబ్బు జబ్బు*. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా?
నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా?
*ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు*.
ఇంకొకడిని అణగతొక్కడానికి నాతో కుట్రలు చేయించావు.
ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో.
రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా?
*ఇక నేనుండలేను వెళ్తున్నా!*
ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది.
దాంతో ఈ రోజు, ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు.
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?
Saturday, April 7, 2018
మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన తిథులు
మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్న కొన్ని మహాభారత విశేషాలు మీ కోసం.
సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది.
తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను.
కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి.
ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు.
యుధిష్టరుని జననం :
ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో.
సుమారు క్రీ పూ 15-8-3229.
భీముని జననం :
మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి .
ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు.
అర్జునుని జననం:
శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి.
భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు.
నకుల & సహదేవుల జననం :
భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం.
అర్జునుని కన్నా 1సం 15రో చిన్నవాళ్ళు.
శ్రీ కృష్ణ జననం :
శ్రీముఖ నామ సం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి .
అర్ధరాత్రి అనంతరం tarus (వృషభ)లగ్నం.
దుర్యోధనుడి జననం :
భీముని మరుసటి దినం.
హిడింబాసురుడు, బకాసురుడు,కీచకుడు వీరుకూడా ఇదే సమయాలో మఘ & స్వాతి నక్షత్రాల మధ్య జన్మిస్తారు.
అక్కడి నుండి రోజుకొకరు చొప్పున మిగిలిన 99 కౌరవులు వారి చెల్లి #దుశ్శల (సైంధవుని భార్య).
పాండురాజు మరణం:
సర్వ ధారి నామ సం ఉత్తర నక్షత్ర శుక్ల ద్వాదశి.
అప్పటికి ధర్మరాజు వయసు 16సం 6నె 7రో.
పాండవుల హస్తినపుర ప్రవేశం:
సర్వధారి సం చైత్ర మాస బహుళ త్రయోదశి.
పాండురాజు మరణాంతర 16 రో కు.
యుధిష్టరుని పట్టాభిషేకం:
శుభకృత్ నామ సం ఆస్వీయుజ శుక్ల దశమి.
అతని వయసు 31సం 5రో.
అక్కడినుండి 5సం 4నె 20రో హస్తినాపురం లో ఉంటారు.
వారణావ్రత ప్రవేశం :
ప్లవ నామ సం ఫాల్గుణ మాస శుక్ల అష్టమి.
లాక్ష గృహ దహనం:
కీలక ఫల్గుణ 13/14 వ రాత్రి 3 వ ఝాము.
ఘటోత్కచ జననం:
సౌమ్య నామ సం అశ్వినీ శుక్ల విదియ.
పాండవులు ఏక చక్రపురం లో సాధారణ నామ సం చైత్ర శుక్ల విదియ నుండి ఆస్వీయూజ శుక్ల విదియ వరకు అనగా 6నెలలు ఉంటారు.
బకాసుర వధ :
సాధారణ నామ సం శుక్ల దశమి.
పాండవులు ఏకచక్రపురం లో సాధారణ మార్గశిర బహుళ పంచమి వరకు అనగా ఇంకనూ 1నె10రో ఉన్న తర్వాత పాంచాల రాజ్యం కు బయలుదేరుతారు.
ద్రౌపది స్వయంవరం:
సాధారణ నామ సం పుష్య మాస శుక్లపక్ష దశమి.
విరోధి నామ సం పుష్య పౌర్ణమి వరకు 1సం 15రో పాటు పాంచాల రాజ్యం లో వుంటారు.
హస్తినాపురం రాజధాని గా 5సం 6నె పాటు అనగా విరోధి కృత నామ సం మాఘ శుక్ల విదియ నుండి పింగల శ్రావణ శుక్ల విదియ వరకు.
ఈ కాలం లొనే ఇంద్రప్రస్థం నిర్మాణం జరుగుతుంది.
అప్పటికి ధర్మజుని వయసు 45సం 9నె 27రో.
ధర్మరాజు పట్టాభిషేకం :
పింగళ ఆశ్వీయుజ శుక్ల దశమి.
యధిష్టురుని వయసు 46 సం.
అర్జునుని తీర్థయాత్రలు:
కాలయుక్తి నుండి ప్రమోదూత వరకు.
సుభద్ర తో పరిణయం:
ప్రమోదూత వైశాఖ శుక్ల దశమి.
ఖాండవవన దహనం :
ప్రమోదూత శ్రావణ శుక్ల విదియ.
మయసభ 1సం 2నె లో నిర్మితమవుతుంది.
మయసభ ప్రవేశం :
ప్రజోత్పత్తి ఆస్వీయుజ శుక్ల దశమి
ధర్మజుని వయసు 60 సం 5 రో.
ఇంద్రప్రస్థం రాజధాని గా సర్వజిత్ ఆస్వీయుజ శుక్ల దశమి వరకు అనగా 16 సం పాలిస్తారు.
జరాసంధ వధ :
సర్వజిత్ కార్తీక శుక్ల విదియ నుండి 14 వ రోజు వరకు పోరాడి సాయంత్రం న.
రాజసూయ యాగం :
సర్వధారి చైత్ర పౌర్ణమి.
యధిష్టురుని వయసు 76సం 6నె 15రో.
మాయాజూదం
సర్వధారి శ్రావణ తదియ & సప్తమి నాడు.
ధర్మజుని వయసు 76సం 10నె 2రో.
కనుక మొత్తం 36 సం 6నె 20రో అనగా విరోధి కృతు మాఘ శుక్ల విదియ నుండి సర్వధారి శ్రావణ బహుళ సప్తమి.
అరణ్యవాసం :
సర్వధారి శ్రావణ బహుళ అష్టమి నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి యధిష్టురుని వయసు 76సం 10నె 18రో.
12సం అరణ్యవాసం శార్వరి శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.
1సం అజ్ఞాతవాసం ప్లవ శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.
కీచక వధ :
ప్లవ ఆషాఢ బహుళ అష్టమి.
అతని సోదరురులు మరుసటి దినం మరణిస్తారు.
ఇవన్నీ చాంద్రమానం ప్రకారం సం. వీటిలో
ప్రతి 5 సం కు 2 అధిక మాసాలు మరియు 13 సం లలో 5 అధిక మాసాలు ,12 రోజులు అధికంగా ఉంటాయి.
వీటి లెక్క తిథులలో సహా ధర్మజునికి & భీష్మునికి తెలుసు కాబట్టే ఉత్తర గోగ్రహణం నందు పాండవులు బయటకు తెలుస్తారు.
కానీ దుర్యోధనుడు సూర్యమానం ప్రకారం ఇంకా అజ్ఞాతవాసం పూర్తి అవలేదని భ్రమ పడతాడు.
అందుకే ఉత్తర గోగ్రహణం నందు బయటపడడానికి ముందు రోజే మొత్తం 13 సం కాలం పూర్తి అగుతుంది.
ఇదంతా అర్జునుడు ఉత్తర కుమారునికి వివరిస్తూ తాను గాండీవం ను 30 సం ధరించానని ఇంకనూ 35 సం దరిస్తానని చెప్తాడు.
బహుళ నవమి రోజు అర్జునుడు అజ్ఞాతవాసం నుండి బయటకు వస్తాడు.
అప్పటికి ధర్మజుని వయసు 89సం 10నె 9రో.
పాండవులు ఉపప్లవ్యం లో 1సం 2నె 17రో ఉంటారు. ఈ కాలం లొనే ఉత్తర&అభిమన్యుల వివాహం శుభకృత్ జ్యేష్ఠ మాసం లో జరుగుతుంది.
ఆస్వీయుజ మాసం లో ఏర్పడిన సూర్య చంద్ర గ్రహణాలు రాబోయే కాలం లో జరగబోయే వినాశానికి హేతువులు గా చెప్తారు.
శ్రీ కృష్ణ రాయబారం :
కృష్ణుడు శుభకృత్ కార్తీక శుక్ల విదియ రేవతి నక్షత్రం నాడు ప్రారంభమై త్రయోదశి నాడు హస్తినపురం కు చేరతాడు.అక్కడి నుండి బహుళ అష్టమి వరకు శాంతి కాముకం గా రాయబారం నడుపుతాడు.
అష్టమి రోజే విశ్వరూప సందర్శనం జరుగుతుంది. రాయబారం విఫలమైన తర్వాత అదే రోజు పుష్యమి నక్షత్రం నాడు తిరుగు ప్రయాణం అవుతూ కర్ణుడి తో ఈ విధం గా అంటాడు. వారం రోజులలో అనగా జ్యేష్ఠ నక్షత్రం పాడ్యమి నాడు కురుక్షేత్ర సంగ్రామం జరగపోతుంది. సిద్ధంగా ఉండండి అని ఉపప్లవ్యం కు బయలు దేరతాడు.
మార్గశిర శుక్ల విదియ నుండి ద్వాదశి వరకు సైన్యాల మోహరింపు, యుద్ధ సరంజామా , సామర్ధ్య పరీక్షలు నిర్వహించ బడతాయి.
యుద్ధ ప్రారంభం :
శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల త్రయోదశి / చతుర్దశి భరణి నక్షత్రం మంగళవారం నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి ధర్మరాజు వయసు 91సం 2నె 9రో .
దీనికి ముందు రోజే అర్జునునికి భగవద్గీత ను బోధిస్తాడు.
మార్గశిర బహుళ సప్తమి నాడు భీష్ముడు అంపశయ్య పై చేరతాడు.
అభిమన్యుని మరణం :
మార్గశిర బహుళ దశమి తన 17 వ ఏట. అప్పటికి అతని వివాహం జరిగి 6నెలలు మాత్రమే. ఉత్తర 6నెలల గర్భిణీ.
సైంధవ మరణం :
మార్గశిర బహుళ ఏకాదశి.
ద్రోణుడు ద్వాదశి నాడు
కర్ణుడు చతుర్దశి నాడు
శల్యుడు శుక్ల పాడ్యమి సాయంత్రం మరణిస్తారు.
దుర్యోధనుడి మరణం :
పుష్య మాస శుక్ల పాడ్యమ
ఉపపాండవుల మరణం :
పుష్య శుక్ల పాడ్యమి నాటి రాత్రి వేళ.
ధర్మరాజు పట్టాభిషేకం :
శుభకృత్ పుష్య పౌర్ణమి.
అప్పటికి ఆయన వయసు 91సం 3నె 10 రో.
పుష్య బహుళ విదియ నుండి అష్టమి వరకు భీష్ముని చే అనేక విషయాలు పాండవుల కు చెప్పబడతాయి.హస్తిన కు వెళ్లిన 15 రోజుల తర్వాత మళ్ళీ మాఘ శుక్ల అష్టమి నాడు మళ్ళీ కలుసుకుంటారు.
అష్టమి నుండి పంచ ప్రాణాలలో రోజుకు ఒక్కొకటి చొప్పున భీష్ముడు విడిచారు అని దీనిని భీష్మ పంచకం అని అంటారు.
భీష్ముడు మార్గశిర సప్తమి నుండి మాఘ ఏకాదశి వరకు 48 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నట్లు చెప్తారు.
అశ్వమేధ యాగం :
శుభకృత్ మాఘ శుక్ల ద్వాదశి.
15సం అనంతరం ధృతరాష్ట్రుడు వన వాసానికి కార్తీక మాసంలో వెళతాడు.
3సం తర్వాత పాండవులు పెద్ద వారు మరణించారని తెలుసుకుని వారిని చూడడానికి అడవులకు వెళ్తారు.
ఒక నెల తర్వాత గాంధారి , ధృతరాష్ట్రుడు, కుంతి మొదలగు వారు అడవులలో అగ్నికి ఆహుతి అవుతారు.
యుద్ధానంతరం 36 సం కు ద్వారక లో ముసలం పుట్టి యాదవులు వినాశనం జరుగుతుంది.
ధర్మరాజు పాలన : శుభకృత్ పుష్య పౌర్ణమి నుండి బహుదారణ్య పుష్య పౌర్ణమి వరకు ధర్మరాజు 36సం 2నె 15రో పాటు పరిపాలిస్తాడు.
కలియుగ ప్రారంభం :
ప్రమాధి శుక్ల పాడ్యమి నాడు శ్రీ కృష్ణ నిర్యాణం తో కలియుగం ఆరంభం అవుతుంది.
అది క్రీ పూ,...20 - 2 - 3102. 2:27:30 AM.
7 రోజుల అనంతరం ద్వారక సముద్రం లో మునిగి పోతుంది.
యుధిష్టర శకం ఆయన పట్టాభిషేకం రోజునుండి మొదలవుతుంది.
పాండవుల రాజ్య నిర్గమన
ద్వారక నిమ్మజ్జన అనంతరం 6నె 11రో అనగా ధర్మజుని వయసు 127సం 6రో ఉన్నపుడు 36 సం పరీక్షిత్తు నికి రాజ్యాభిషేకం చేస్తారు.
స్వర్గారోహణ గురించి పూర్తి వివరణ తెలియదు కాని అది 26 సం తర్వాత జరిగింది గా చెప్తారు.
వ్యాసుడు గణపతి కి స్వర్గారోహణ తర్వాతే మహాభారతం చెప్తాడు అని అంటారు.
పరీక్షిత్తు 60 సం రాజ్యపాలన అనంతరం మరణిస్తాడు. 25 సం జనమేజయుడు రాజు అవుతాడు.
మహాభారత రచన అనంతరమే వేద వ్యాసుడు కలియుగం ప్రారంభమైన 60 సం కు భాగవత రచన చేశాడని చెప్పారు.
వారి కోసం మరియు నా కోసం కూడా ఈ వ్యాసాన్ని తెలుగు లో టైపు చేసాను. ఇది మన వారి విజ్ఞానాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నం మాత్రమే.
ఇందులో తప్పులు ఏమైనా వున్ననూ సరిదిద్దుకోగలరు.
EVENT_DATE
Going to forest 4th Sept. 5574 BC
Kimura Killed 7th Sept. 5574 BC
Going underground 19th May 5562 BC
Keechak killed 1st April 5561 BC
Anukeechak-Massacre 2nd April 5561 BC
End of secret life 9th April 5561 BC
Cows stole 15th April 5561 BC
Arjuna exposed 16th April 5561 BC
All Pandavas exposed 19th April 5561 BC
Marriage of Uttara 4th May.
& Abhimanyu.
Krishna set out for a treaty. 27th Sept.
Stay at Upaplavya 27th Sept.
Stay at Vrukshthala 28th Sept.
Dinner to Brahmins 29th Sept.
Entry into Hastinapur 30th Sept.
Krishna meets Kunti etc. 1st Oct.
Invited for meeting 2nd Oct.
First meeting 3rd Oct.
Second meeting and an attempt 4th Oct.
to arrest Krishna.
Third meeting Vishvaroopa 7th Oct.
Stay at Kunti 8th Oct.
Krishna meets Karna. War 9th Oct.
fixed.
Krishna returns 9th Oct.
Pandavas preparation 11th Oct.
Balaram's visit.
Mahabharat war started on 16th Oct.
Abhimanyu killed 28th Oct. 5561 BC.
End of War 2nd November 5561 B.C.
Yudhishthira crowned 16th Nov. 5551 BC.
Bhishma expired on 22nd Dec. 5561 BC
Pandava campaign 15th Jan. 5560 BC
for wealth
Parikshita born 28th Jan. 5560 BC
Pandavas return 25th Feb. 5560 BC
Ashvamedh Deeksha. 1st March 5560 BC
Return of Arjuna Horse 15th Jan. 5560 BC
Ashvamedh yajna 22nd Feb. 5559 BC
Dhritarashtra went to forest 18th Aug. 5545 BC
Pandavas visited Kunti 18th Aug. 5543 BC
Vidura expired
Death of Kunti, Dhritarashtra, and Gandhari Sept./Oct. 5541 BC
Yadava Massacre 5525 B.C.
Parikshit Dead 5499 B
కురుక్షేత్ర యుధ్ధ సమయానికి ఎవరి వయసు
bheeshma - 141 years
Krishna - 90 years
Karna - 107 ears
Yudhishthir - 91 years;
Bheem - 90 years;
Arjun - 89 years;
Nakul & Sahdev - 88 years.
Duryodhan - 90 years
Abhimanyu - 17 years
సూర్యుని అంతర్భాగంలో శక్తి ఎలా ఉత్పత్తి 6. ఆ శక్తి కొన్ని వందల సంవత్సరాలకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు. ఎందువల్ల?
*సూర్యుని అంతర్భాగంలో శక్తి ఎలా ఉత్పత్తి 6. ఆ శక్తి కొన్ని వందల సంవత్సరాలకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు. ఎందువల్ల?‼*
*సూర్యుడు భూమికన్నా సుమారు 3,30,000 రెట్లు ఎక్కువ బరువుంటాడు. సూర్యుడిలో 3/4 భాగం హైడ్రోజన్ ఉంటే మిగతాది హీలియం. సూర్యుడు అంత బరువుగా ఉండబట్టే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉండి అందులోని వాయువులను ఒకే చోట పట్టి ఉంచడమే కాకుండా గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు.*
*సూర్యుని అంతర్భాగం కేంద్రం నుంచి 25 శాతం వ్యాసార్థం మేర వ్యాపించి ఉంటుంది. ఇక్కడ సూర్యునిలోని ద్రవ్యాన్ని (వాయువు) అంతా గురుత్వశక్తి కేంద్రంవైపు ఆకర్షించడంతో విపరీతమైన పీడనం (ఒత్తిడి) ఉత్పన్నమవుతుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, హైడ్రోజన్ వాయువు పరమాణువులు ఒక చోటకు చేరి కేంద్రక చర్యలు ప్రారంభమవుతాయి. రెండు హైడ్రోజన్ పరమాణువులు కలుసుకొని, హీలియం పరమాణువులతో పాటు కొంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ దశలో ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. ఈ శక్తి కిరణాలు, నీలలోహిత కిరణాలు, కంటికి కనిపించే కాంతి, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల రూపంలో వెలువడుతుంది. సూర్యుడు శక్తిమంతమైన న్యూట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన 'సౌర పవనాలు' వెలువరిస్తాడు. ఈ శక్తి వికిరణ, సంవాహన మండలాలు దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. సూర్యుని అంతర్భాగం నుంచి 55 శాతం మేర వ్యాపించి ఉండే వికిరణ మండలంలో అంతర్భాగం నుంచి వెలువడే శక్తి 'ఫోటాన్ల' ద్వారా రవాణా అవుతుంది. ఫోటాన్ల నుంచి వాయుకణాలు శక్తి సంగ్రహించి వేడెక్కడంతో కొత్త ఫోటాన్లు ఆవిర్భవిస్తాయి. అవి మళ్లీ వాయుకణాలను వేడెక్కించడం ద్వారా శక్తి సంవాహన మండలాన్ని చేరుకుంటుంది. సంవాహన మండలం మిగతా 20 శాతం సంవాహన ప్రక్రియ ద్వారా క్రమేణా సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. ఈ మండలంలోని కొన్ని పొరలలో వేడెక్కిన వాయు ప్రవాహం పైకి లేస్తుంది. ఈ ప్రవాహం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న పొరల వాయువులతో ఉష్ణాన్ని పంచుకుంటుంది. చల్లారిన పొరలు మళ్లీ కిందికి పయనిస్తాయి. ఈ విధంగా ఫోటాన్లకు, వాయుకణాలకు మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఉష్ణ, కాంతి శక్తులు వికిరణ, సంవాహన మండలాల్ని దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటాయి. సూర్యుడు సెకనుకు 400 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను పూర్తి శక్తిరూపంలోకి మారుస్తాడు. సూర్యుని వికిరణ మండలం నుంచి ఒక ఫోటాన్ సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి పట్టే కాలమే సుమారు లక్ష నుంచి రెండు లక్షల ఏళ్ల వరకు ఉంటుంది.*
*శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం*
*శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం*
ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః |
లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ || ౧ ||
సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ |
అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ || ౨ ||
నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః || ౩ ||
ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః |
న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే || ౪ ||
విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ |
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ || ౫ ||
తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే |
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా || ౬ ||
సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు |
మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ || ౭ ||
చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్ |
వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో || ౮ ||
సుబ్రహ్మణ్యస్తోత్రమిదం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః || ౯ ||
Facts of life!
▪ రూపాయి బియ్యం తినలేం..
50 రూపాయలకి బియ్యం కొనలేం
▪ మున్సిపల్ నీళ్ళు తాగలేం..
మినరల్ వాటర్ కొనలేం
▪ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..
కలల ఇల్లు కట్టుకోలేం
▪ ప్రభుత్వ బడికి పంపలేం..
కార్పొరేట్ ఫీజులు కట్టలేం
▪ సర్కారు దవాఖానా కు పోలేం..
కార్పొరేట్ బిల్లులు కట్టలేం
▪ సిటీ బస్సుల్లో వెళ్ళలేం..
బండికి పెట్రోలు కొనలేం
ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!
👋🏻కులం పోవాలని చెప్పేది మనమే..
👋🏻కులం చూసి ఓటు వేసేది మనమే..
👋🏻అవినీతి పోవాలనేది మనమే..
👋🏻అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే..
👋🏻ఇంటికో భగత్ పుట్టాలని చెప్పేది మనమే..
👋🏻మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే..
👋🏻మార్పు రావాలని చెప్పేది మనమే..
👋🏻అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే..
అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........
వెర్రి గొర్రెలు..
ఇది ఎవరు రాసారో కానీ చాలా బాగా చెప్పారు... నాకు వాట్సాప్ లో ఎవరో షేర్ చేశారు... మధ్య తరగతి వాడిని కదా నాకు నచ్చింది ... (నచ్చితే మీరు కూడా షేర్ చేయండి..
*✅ అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని
ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.*
*✅ ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.*
*✅మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.*
*✅ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.*
*✅ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.*
*✅ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.*
*✅ దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.*
*✅ విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.*
*ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.!*
Truths about life incidents
The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose
There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...
-
Nepal is currently witnessing a powerful youth-led movement that has deeply shaken the country’s political scene. This wave of protests, led...
-
There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...
-
The Tanapalli Subramanya Swamy Temple, also known as Sree Balagnana Dhandayudhapaani Swamy Temple, has a relatively recent history. It is si...











