Sunday, February 5, 2017

Cappuccino

A fav cup of coffee with 'once upon a time' favourite person.

Once upon a time means that... people do change but says didn't. Funny...

LUVIT CHOCOLATES

Candies are the favourite ever in every situation. Either anger or tension or happy or sad...

I love you chocolate

Friday, February 3, 2017

అనంత పద్మనాభ స్వామి మహిమలు

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం

అనంత మహిమలు

మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి. అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి.




స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది, ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు, నిత్య పూజలు జరుగలేదు.

దేవతల ఆరాధన: అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారు.
అఖండ దీపం: స్వామి వారి సన్నిధిలో ఒక దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అందులో కేవలం ఆవు నేయ్యి మాత్రమే వేయాలని ఆలయ శాసనం. ప్రతి రోజు ఆలయం మూసివేసే సమయంలో అర్చక స్వాములు అందులో ఆవు నెయ్యి వేసి వెళతారు. మరుసటి రోజు ఉదయం ఆలయం తెరించేంత వరకూ అఖండలంగా వెలుగుతున్న ఆ జ్యోతిలోనికి మరల నెయ్యి వడ్డిస్తూ కొనసాగిస్తూ ఉంటారు.

మనం లౌకికంగా ఆలోచిస్తే నూనె కంటే నెయ్యితో దీపం వేలగాలంటే కాస్త కష్టమే, ఎందుకంటే నెయ్యి వాతావరణాన్ని బట్టి గడ్డకడుతూ ఉంటుంది. దీపం వెలగడానికి ద్రవంగా మారడానికి సమయం పడుతుంది. చల్లటి వాతావరణంలో నెయ్యి తొందరగా గడ్డ కడుతూ ఉంటుంది. దీపానికి కావలసిన ద్రవంగా నెయ్యి మారక దీపం కొండెక్కిపోయే అవకాశాలు ఎక్కువ. ఇది మనందరికీ అనుభవనీయమైన సంగతే. కానీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దీపం లోనికి గడ్డ కట్టిన నెయ్యి వేసిన అది ద్రవంగా మారి దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . అయితే కొందరికి అనుమానం కలగచ్చు దీపపు ప్రమిద లేక దీపపు కుందె ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటే అది వేడిగా ఉండి నెయ్యిని కరిగిస్తుంది కదా ఇందులో గొప్ప విశేషం ఏముంది అనిపించవచ్చు.

స్వామి వారి సన్నిధిలో దీపం మట్టి ప్రమిద లోనో లేక లోహపు కుందె లోనో ఉండదు . శిలలో చెక్కబడిన రాతి ప్రమిదలో ఉంటుంది. ఎంత పెద్దగా ప్రజ్వరిల్లితే ఆ వేడికి రాతి ప్రమిద వేడెక్కాలి , అందులో నెయ్యి కరగాలి. ఉష్ణోగ్రత తరచుగా ఒకచోట నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ ఉంటుంది. రాతి శీలలో ఉండే చలి యొక్క ఉష్ణోగ్రత అదే రాతి శిలలోని ప్రమిదను కుడా చల్లబరుస్తూ నెయ్యిని గడ్డ కట్టేలా చేయాలి . కానీ అందుకు విరుద్ధంగా నెయ్యి కరిగిపోతూ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది.

ఇది సైన్స్ చెప్పే వాటికి వ్యతిరేకంగా లేదా? స్వామి వారి మహిమ కాక మరేమిటి?

మరొక నిదర్శనం:


అర్చక స్వాములు ఉదయాన్నే ఆలయం తెరిచి చూసినప్పుడు దీపంలో నెయ్యి కాస్త తగ్గి ఉంటుంది. ఆ దీపాన్ని మళ్ళీ నెయ్యి వేసి నింపుతారు.అంటే ప్రతి రోజు ఉదయo, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి అర్చక స్వాములు అప్రమత్తంగా ఉంటూ దీపం అఖండలంగా ఉండేలా నెయ్యి వడ్డిస్తూ ఉంటారు కదా.

మరి మూడు రోజులు ఆలయం మూసి ఉన్నా కూడా ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది అంటే ఎవరు నెయ్యి వడ్డించి ఉంటారు? ఇది దేవతలు స్వామి వారిని సేవిస్తుంటారు అనటానికి నిదర్శనం కాదా?

మరొక నిదర్శనం:

అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది. స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అనీ తిరువనంతపుర ప్రజలు భయాందోళలను పొందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట.

మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు. స్వామి వారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు. ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుబ్రపరచినట్లుగా పొడిగా , సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి. బయట ధ్వజ స్థంభం కూడా పరి శుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి. స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు. ఇలా నేటికీ స్వామి వారి ఉనికి మనకు చాటుతూనే ఉన్నారు. మనమే ఆయనను గుర్తించలేక శిలలా భావిస్తూ యాంత్రికంగా షోడశోపరచార పూజలు చేస్తూ మన భక్తికి సాటిలేదు అంటూ గర్విస్తూ అజ్ఞానంలో ఓలలాడుతూ ఉన్నాము. ఇలాంటి నిదర్శనాలు ప్రతి ఆలయంలోను జరుగుతూనే ఉంటాయి. అంతటి భక్తి మనలో ఉంటే వాటిని దర్శించే భాగ్యము స్వామి వారే కలిగిస్తారు.

ఇలాంటి నిదర్శనాలను అందరికీ తెలియజేసి నాస్తికులలోను, హేతువాదులలోను మార్పు తెచ్చి మన సనాతన ధర్మాన్ని పరి రక్షించుకోవలసిన కర్తవ్యం మనది.


ఓం నమో నారాయణాయ.

Together makes strong. Caring. Sharing. Loving. Helping

Cool and quite couple ever. Smarter, bitter, sweeter, lovely, anger... etc...

Guru the divine

Lord Dakshinamurthy swamy

Rangoli

Butterfly rangoli by me
Remaining by my mother

My Rangoli

Thursday, February 2, 2017

అష్టాదశ శక్తి పీఠాలు

అష్టాదశ శక్తి పీఠాలు:

 

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, పూజిస్తున్నాం. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (గుడి ధ్వంసం అయ్యింది), మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించిన సమాచారం దసరా పండగ సందర్భంగా ఈ వారం.

 

1. లంకాయాం శాంకరీదేవి:

అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలంగా ప్రతీతి.

 

2. కామాక్షీ కాంచికా పురే:

 కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురం అమ్మగా వెలగొందుతోంది. అమ్మవారి శరీరభాగమైన ‘కంకాళం’ ఇక్కడ పడినట్లు చెబుతారు.

 

3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి:

నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సుమారు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో వెలసిందీ క్షేత్రం. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి, పైన మీనార్‌ను నిర్మించారు. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్లు అని అర్థం. భక్తుల సమస్యల సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని నమ్మకం.  అమ్మవారి శరీర భాగమైన ‘ఉదరం’ ఇక్కడ పడిందని చెబుతారు. పాండువా గ్రామానికి 10 కి.మీ దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది. భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు.

 

4. క్రౌంచపట్టణే చాముండేశ్వరి:

కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి మాత వెలుగొందుతోంది. ఆలయానికి ఎదురుగా సర్వాలంకృతుడైన మహిషుని విగ్రముంది. అమ్మవారి ‘తలవెంట్రుకలు’ పడిన పుణ్య ప్రదేశం చాముండేశ్వరీ ఆలయం.

 

5. అలంపురే జోగులాంబ:

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో  కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. ఈ దేవాలయం ముసల్మానుల దండయాత్రలో ధ్వసం అయ్యి, ఆ తర్వాత పునరుద్ధరించబడింది. సతీదేవి ‘దంతాలు’  ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.

 

6. శ్రీశైలే భ్రమరాంబికా:

దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి. ఈ ఆలయానికి దగ్గరలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది.

 

7. కొల్హాపురే మహాలక్ష్మీ:

మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో కొల్హాపూర్‌లో వెలసిన అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా చెబుతారు.

 

8. మాహుర్యే ఏకవీరికా:

మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కి.మీ దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇది ప్రతీతి.

 

9. ఉజ్జయిన్యాం మహాకాళి: 

సతీదేవి ‘పై పెదవి’ పడిన స్థలం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లంగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు. మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది మహాకాళి.

 

10. పీఠికాయాం (పిఠాపురం) పురుహూతికా:

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల  పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు.

 

11. ఓఢ్యాయాం గిరిజా దేవి:

ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం (ఒరిస్సా). నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయం ఉన్నది. సతీదేవి ‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు.

 

12. మాణిక్యామ్ దక్షవాటికే (ద్రాక్షారామం):

సతీదేవి ‘కణతల భాగం’ పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం.

 

13. హరిక్షేత్రే కామరూపా:

అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ క్షేత్రం. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం. నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు.

 

14. ప్రయాగే మాధవేశ్వరీ:

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ప్రయాగ క్షేత్రం ఉంది. సతీదేవి ‘హస్త అంగుళీయం’ పడిన ప్రాంతంగా చెబుతారు. యుమన, గంగా నదులు కలిసే ప్రాంతం. శక్తిని మాధవేశ్వరి అంటారు. పిండప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలదీ క్షేత్రం.

 

15. జ్వాలాయం వైష్ణవీ దేవి:

సతీదేవి ‘పుర్రె’ పడిన ప్రదేశం. జ్ఞాన క్షేత్రం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉందీ ప్రాంతం. అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్‌లో కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గుహ ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది.

 

16. గయాయామ్ మాంగళ్య గౌరీ:

బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళ గౌరి కొలువుదీరి ఉంది. సతీదేవి ‘స్తనం’ పడిన ప్రదేశం. దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.

 

17. వారాణస్యాం విశాలాక్షీ:

సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం.

 

18. కాశ్మీరేతు సరస్వతియనా:

ఇక్కడ సతీదేవి ‘చేయి’ పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్‌లో ఉందని తెలుస్తోంది. కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

 

శక్తి పీఠాల సందర్శన భాగ్యం: 


అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితంగా మనశ్శాంతి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. అటువంటి 18 పీఠాలను స్వయంగా సందర్శించడం నా పూర్వజన్మ సుకృతం. ఒక్కో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కోటి, ఒక్కోసారి రెండు-మూడు శక్తి పీఠాలను దర్శించి వచ్చాను.

పరశురామేశ్వరస్వామి దేవాలయము, గుడిమల్లం, చిత్తూరు జిల్లా

గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం.చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.

ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు.ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం .ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది.
ఈ ఆలయానికి సమబంధించి మరియొక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉంది. అది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపలభాగం మొత్తం వరద నీటితో మునుగి పోతుంది.. ఒక చిన్న భూగర్భ తొట్టి మరియు దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం ప్రక్కన నేటికీ కూడా చూడవచ్చు. ఈ వరద నీరు అకస్మాత్తుగా, శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది. ఈ భూగర్భ ట్యాంక్ తరువాత ఎండి పోతుంది. ఇది 2005 డిసెంబరు 4 లో జరిగినట్ల తెలుస్తోంది. ఆ వరద నీరూ అలానే ఒక 4 గంటలు ఉండి అటుపై మరల ఆలయంలో ఏమీ జరుగనట్లు అదృశ్యమైనదని తెలుస్తుంది. రామయ్య అనే 75 ఏళ్ళ గ్రామస్థుడు దీనిని తాను 1945 సం.లో చూచినట్లు తెలిపినట్లు పలువురు వివరించిరి.

పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము మరియు దక్షిణాయనములో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటి నేరుగా వస్తాయి.

విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణమున యెన్నియో చిన్న గుళ్ళున్నవి. అన్నింటిని చుట్టునూ, ఆవలి ఇటుక ప్రాకారగోడ, నలువైపుల ఉంది.ఈ ప్రాకారమునకు పడమటివైపున పెద్ద గోపుర ద్వారము ఉంది. ఈ గోపురద్వారము, మరియు స్వామివారి అభిషేకజలమునకూ కట్టిన బావి యాదవదేవరాయలు కాలమునకు (క్రీ.శ.13-14 శతాబ్దము) చెందినది. ముఖ్య దేవాలయము- పరశురామేశ్వరస్వామి పేరున పలువబడుచున్నది. ఈ ఆలయమునకు వాయవ్య దిశన అమ్మవారి దేవాలయము ఉంది. దానిని ఆనుకొని దక్షిణమున వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి ఉంది. పై రెండును తూర్పు ద్వారమును కల్గిఉన్నవి. తూర్పు చివర ఆనుకొని సూర్యనారాయణుని దేవాలయము ఉంది. ఈ చిన్ని ఆలయమును బహుసా మరికొన్ని శిథిలములై ఉండవచ్చును. మరికొన్ని పరివార దేవతల గుళ్ళు ఉన్నాయి. గోడలపైని, రాతిపలకలపైని పెక్కు శాసనములు ఉన్నాయి. ఇవి తరువాతి పల్లవులు, వారి సామంతులు గంగ పల్లవులు (క్రీ.శ. 897-905), బాణ చోళులు, చోళరాజు విక్రమచోళుడు, రాజరాజు కాలమునకు చెందినవి. యాదవ దేవరాయల కాలమునాటికి చెందిన మరికొన్ని శాసనములు ఉన్నాయి. విక్రమ చోళుడు కాలమున (క్రీ.శ.1126) దేవాలమును పూర్తిగా తిరుగ కట్టినట్లు, రాతితో కట్టడములు చేసినట్లు తెలియుచున్నది. దేవాలయములో విశాలమైన మహామండపము గర్భగుడి ఆవలివైపు దాని ఆనుకొని ఎత్తైన రాతి ప్రాకారమును కలుపుచున్న అరుగు, నలుప్రక్కల ప్రదక్షిణమునకు వీలుగా స్తంభములపై శాల నిర్మింపబడెను.ఈ కాలమున మహామండపమునకు దక్షిణముగా ముఖద్వారము, దానికి నేరుగా ప్రాకారమును కూడా కుడ్యస్తంభములతో చక్కని ద్వారశాలను ఏర్పరచిరి. గర్భగుడి మాత్రము గజపృష్ఠాకారము కలిగి ఉంది. అందున అర్ధ మండపము మహామండపములు ఉన్నాయి. అన్నియు తూర్పు ముఖద్వారములు కలిగి ఉన్నాయి. గర్భగుడి, అర్ధ-మహామండపముల కన్న, చాలా పల్లములో ఉంది. అందువల్లనే కాబోలు ఈ గ్రామనామము గుడిపల్లము అని వాడుకలో ఉంది. శివుని ప్రతిమ, యవ్వనుడైన మల్లునిబోలి ఉన్నందున గ్రామనామము గుడిమల్లము అని ప్రతీతి. కాని శాసనములలో ఎక్కడా ఈనామము కానరాదు. ఈ గ్రామాన్ని విప్రపీఠముగా పేర్కొనబడెను.

Sri Parasurameswara Temple, Gudimallam

Gudimallam is a village in the formation zone of Chittoor district. It is historically important. This is an ancient Shiva temple dating back to the Andhra Satavahana period. Historians determined by inscriptions found here that it was built in the 2nd or 3rd century BC. More information about the temple is available at the Museum at Chandragiri Fort.











The temple was kept in its heyday by the Chandragiri kings for some time. Later, Muslim rulers destroyed the temple along with the Chandragiri principality. Otherwise, Moola Virat Swami was not harmed.

Lord Shiva in the Gudimallam Shiva Temple is worshiped as Parasurameshwara. The Shivalinga is very special here. The Shivalinga enshrined in the sanctum sanctorum here is not in the form of a linga but the form of Lord Shiva as a superhero hunter in human form. This lingam is a human lingam made of dark coffee-colored stone. The penis is about five feet long and one foot wide. Lord Shiva, carved as if protruding from the front of the lingam with a bulge on the front of the lingam, was in the form of a standing (standing deity) on the shoulders of an unconscious man. Swami is with both hands. He holds the legs of a lamb (upside down) with his right hand and a small (shell) in his left hand. He was carrying an ax to his left shoulder. Swami Jatabhara (as if all the knots were tied above) was wearing a headband, several rings for the ears and various ornaments, wrapped around the waist, and a half-length (cloth from the waist to the knees) that hung down in the middle. The folds hanging in the middle of the cloth are most clearly visible. Swami's body parts are visible as if the cloth is very delicate. It is a fact that the Lord does not have Yagnopaveetham. A deep sunken line separating the upper part of the penis and the lower part of the lower penis, clear, resembling the entire penis and penis. This gender is considered to be the oldest gender. It is also known as an example of contemporary Shaivite worship. Gudimallam was under the control of the Department of Archeology till 2009. There were no pooja repetitions. So people didn’t come much. An employee of the Archaeological Department acts as its custodian and shows it to seldom-visited visitors. Gudimallam is a small village. It is about thirty kilometers from Tirupati. This temple is also known as the Parashurameshwara Temple.

The oldest Shiva lingam in the world. Historians date it to the 1st century BC. In 1911, an ancient scientist named Gopinathrao researched for a year and spread the existence of this Shiva lingam to the world. The seven-foot Shiva lingam, which resembles a male organ like nowhere else in the world, is engraved with a replica of Rudra standing on the shoulders of a fairy holding a beast with one hand and a sheep with the other. Scientists believe that the dress of this Rudru, who wore a turban and a dowry, dates back to the Rig Veda period. There is no information about the stone used to engrave this linga which details the ancient Saiva worship process. The sanctum sanctorum of the temple is also majestic in the shape of a yard flower. Excavations around the lingam have uncovered the remains of an ancient temple dating back to the 2nd century AD. The temple was taken over by the Archaeological Society of India in 1954 by the villagers of Gudimallam. Worship in the temple has stopped since then. Most of the statues were stolen. There is a toy similar to this organ on copper coins found in Ujjain in the past. There is a similar sculpture in the Mathura Museum. There is no other information about this temple except for two books titled 'Parameswara Temple at Gudimallam', 'Development of Early Shaiva Art and Architecture' written by Inguva Karthikeya Sharma, and some sculptural and art history research papers. Right now the temple market is going to fall under the spell of God.

Another mysterious scene related to this temple is popular. The main room is flooded every sixty years and the entire interior is submerged by the floodwaters. The floodwater suddenly touches the top of the Shiva lingam and then flows down at once. This underground tank then dries up. This seems to have happened on December 4, 2005. The floodwaters lasted for about 4 hours and then disappeared as if nothing had happened in the temple again. Ramayana, a 75-year-old villager, was described by many as having seen it in 1945.

The rays of the rising sun fall directly on the forehead of the main Shiva lingam through the grille carved on these stone walls twice in the north and south.


There are many small temples in this spacious temple complex. All around, there is a brick wall on the left and the left. There is a large dome entrance on the west side of this wall. This gateway, and the well built for the anointing water of the Swami, belong to the Yadava Devaraya period (13th-14th century AD). Named after Parashuram Eswara Swamy. To the northwest of this temple is the Ammavari Temple. Adjacent to it is the Karthikeya Swamy Temple with Valli-Devasena on the south. The upper two have an east gate. Adjacent to the eastern end is the Suryanarayana Temple. This small temple is probably in ruins. There are temples of other deities. There are many inscriptions on the walls and the stone slabs. These are the later Pallavas, their vassals the Ganga Pallavas (897-905 AD), the Bana Cholas, the Chola king Vikrama Chola, and the Rajaraja period. Some other inscriptions are dating back to the time of Yadava Devarayala. It is known that during the reign of Vikrama Chola (1126 AD), the temple was completely rebuilt and built of stone. The spacious vestibule of the temple was built on pillars that encircled the high stone wall adjoining the sanctum sanctorum on either side. The sanctum sanctorum alone has a courtyard. Hence the half mandapam is the maha mandapam. All have east gates. The sanctum sanctorum is much lower than the half-maha mandapams. That is why the village name Kabolu is also known as Gudipallam. The village is known as Gudimallam because of the statue of Lord Shiva and the young Malluniboli. But nowhere in the statutes should there be a reward. The village is referred to as Viprapeetha.

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...