Monday, March 6, 2023

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు
..


మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది .అని కొన్ని గుళ్ళలో వ్రాసి వుంటారు.
హుండీ ఎవరు తెరుస్తారు ? ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి ! ఆయనెవరు ? ప్రభుత్వప్రతినిధి ! .
అంటే భక్తుడు ప్రభుత్వముద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట! 
సరే ! మరి పూజారి ఎవరు ?
పొద్దున్నే తెల్లవారుఝామునే లేచి భగవంతుడికి మేలుకొలుపులు పాడి ! (దేవుడికంటే ముందే మేలుకొంటున్నాడన్నమాట!!!!!!)
ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తులమదిలో ఒక అలౌకికపవిత్రభావనకలిగేటట్లు అలంకారాలు పూర్తిచేసి ఆయనను అష్టోత్తరాలు ,సహస్రాలతో పొగిడి ,స్వామీ ! నీ దర్శనానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రీ అని చెప్పి ! వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసే భగవంతుడి బంట్రోతు! ...
మరి ఆయన జీతమెంత ? చాలాచాలా తక్కువ ! బ్రతుకు జట్కాబండి ఈడ్వలేనంత!.
పూజారా ! మేము పిల్లనివ్వం ! అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో !!కట్టుకున్నదానికి కన్నపిల్లలకు న్యాయం చేయలేక బ్రతుకీడుస్తున్న వారు ఎందరో ! కోకొల్లలు!
వారిపట్ల మనకు ఏ బాధ్యతాలేదా?.
మన కుటుంబాలు కార్లలో తిరగాలి ! మన కుటుంబీకులు ఖరీదయిన దుస్తులు వేసుకోవాలి ! విహారయాత్రలకు వెళ్ళాలి ! అందుకు సంపాదన కావాలి ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం ! ఆ దేవుడికి కమీషన్లు ఇస్తాం !.
కానీ ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోము ! ఇదెక్కడి న్యాయం!
నా విన్నపం ఏమిటంటే ! హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేటులో మాత్రం కానుక వెయ్యండి !
కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియచేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు !
ఉదాత్తానుదాత్తస్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితుడు చేసే పూజలు అరుదుగా చూస్తున్నాం!, ఈ రోజు చాలా గుడులలో అపస్వరంతో మంత్రాలు పఠిస్తూ జరిగే పూజలే ఎక్కువ! .
ఆ వృత్తిలో ఆదాయం వస్తే మేధావులు వస్తారు సలక్షణంగా పూజలు జరుగుతాయి ! 
మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా ! పడగొట్టడమా ! ఆలోచించండి

Friday, October 28, 2022

నాగులచవితీ / నాగచతుర్థీ

ॐ 29/10/22 నాగులచవితీ / నాగచతుర్థీ

నాగుల చవితి విశిష్టత 
కార్తీక శుక్ల పక్ష చవితిని ”నాగుల చవితి” అని పిలుస్తారు. ఇది సర్పపూజకు ఉద్దిష్టమైన దినం. కార్తీక శుద్ధ చవితినాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతున్నది. శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యంలో ఇలా వర్ణింపబడినది.

”చలి ప్రవేశించు నాగుల చవితి నాడు,
మెరయు వేసవి రథసప్తమీ దివసమున,
అచ్చ సీతు ప్రవేశించి బెచ్చు పెరిగి,
మార్గశిర పౌష మాసాల మధ్యవేళ.”

ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.

జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

Wednesday, October 26, 2022

కార్తీక మాసం 30 రోజులు - నిషిద్ధములు - దానం - పూజించవలసిన దైవం - జపించవలసిన మంత్రం

*#కార్తీక #మాసం 30 రోజులు - #నిషిద్ధములు - #దానం- #పూజించవలసిన #దైవం - #జపించవలసిన #మంత్రం*
*👉1వ రోజు:*
నిషిద్ధములు:-
ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు
దానములు:-
నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము:-
స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము:-
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా

*👉2వ రోజు:*
నిషిద్ధములు:-
తరగబడిన వస్తువులు
దానములు:-
కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము:-
బ్రహ్మ
జపించాల్సిన మంత్రము:-
ఓం గీష్పతయే - విరించియే స్వాహా

*👉3వ రోజు:*
నిషిద్ధములు:- 
ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు:- ఉప్పు
పూజించాల్సిన దైవము:- పార్వతి
జపించాల్సిన మంత్రము:- 
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా

*👉4వ రోజు:*
నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి
దానములు:- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన 
మంత్రము:-
ఓం గం గణపతయే స్వాహా

*👉5వ రోజు:*
నిషిద్ధములు:- పులుపుతో కూడినవి
దానములు:- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:- 
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)

*👉6వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి
దానములు:- చిమ్మిలి
పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన 
మంత్రము:-
ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా

*👉7వ రోజు:*
నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం. భాం. భానవే స్వాహా

*👉8 వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు:- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దుర్గ
జపించాల్సిన మంత్రము:- 
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

*👉9వ రోజు:*
నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- 
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః

*👉10వ రోజు:*
నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము:-
ఓం మహామదేభాయ స్వాహా

*👉11వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, ఉసిరి
దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము:- శివుడు
జపించాల్సిన మంత్రము:- 
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

*👉12వ రోజు:*
నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

*👉13వ రోజు:*
నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి
దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము:- మన్మధుడు
జపించాల్సిన మంత్రము:- 
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

*👉14వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము:- యముడు
జపించాల్సిన మంత్రము:-
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

*👉15వ రోజు:*
నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు
దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు 
జపించవలసిన మంత్రం:-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'


*👉16వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల
దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

*👉17వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు:- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

*👉18వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి
దానములు:- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము:- గౌరి
జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా

*👉19వ రోజు:*
నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు:- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము:- వినాయకుడు
జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

*👉20వ రోజు:*
నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి
దానములు:- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

*👉21వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు:- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము:- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

*👉22వ రోజు:*
నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన 
మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

*👉23వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి, తులసి
దానములు:- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:- 
ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

*👉24వ రోజు:*
నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము:- 
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా

*👉25వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు:- యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము:- 
ఓం ఈశావాస్యాయ స్వాహా

*👉26వ రోజు:*
నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు
దానములు:- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము:- కుబేరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

*👉27వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

*👉28వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ
దానములు:- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- ధర్ముడు
జపించాల్సిన 
మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

*👉29వ రోజు:*
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

*👉30వ రోజు:*
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

Monday, September 5, 2022

ఇంతకన్నా గొప్పగా నేనేమి చెప్పగలను ?
****************************
పొరుగువాడిని 
ప్రవాసాంధ్రుడిని
తమిళదేశంలో వున్నవాడిని
మీకన్న గొప్పగా నేనేమి చెప్పగలను
కాని
తెలుగు గొప్పతనాన్ని
తెలుగేతరులే గొప్పగా చెప్పారు
పోని పెద్దలేం చెప్పారో చెప్పనా
ఆంధ్ర దేశంలో పుట్టడం అందునా తెలుగు వాడిగా పుట్టడం 
పూర్వ జన్మ సుకృతం -అప్పయ్య దీక్షితులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు
మా తెలుగు తల్లివి - శంకరంబాడి
ఇంతకన్నా చెప్పగలనా నేను

తెలుగదేలన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ ,తెలుగొకొండ
ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు
ఇంతకన్నా చెప్పగలనా నేను

తరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు
పునుగు జవ్వాజి ఆమని పూలవలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్మ మా తెలుగుభాష -నండూరి రామకృష్ణమాచార్యులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

భాషలొక పదితెలిసిన ప్రభువు చూచి
భాషయనిన ఇద్దియని చెప్పబడిన భాష
-కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ
ఇంతకన్నాగొప్పగా చెప్పగలనా నేను

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? - కాళోజి
ఇంతకన్నా గొప్పగా చెప్పగలనా నేను

ఇంతమంది చెపుతూనే వున్నారు
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి
వినకుండా 
తల్లి భాషను చంపెయ్యడం
తగదు మనకు
కడుపులో వున్న శిశువును తెలిసి తెలిసి చంపేస్తామే దానికి సమం.
ఆ పాపానికి ఒడిగట్టకండి.
మన భాష మనకి తెలియడం
మన ప్రధమ కర్తవ్యం
  -గోటేటి వెంకటేశ్వరరావు

Tuesday, August 16, 2022

బలరామ జననం

బలరామ జననం
ఆగస్టు 17 బుధవారం బలరామ జననం సందర్భంగా

బలరాముడు అనగానే నాగలిని ఆయుధంగా ధరించిన బలమైన రూపంతో మనకు గోచరిస్తాడు. బలరాముడు శ్రీకృష్ణుడికి అగ్రజుడు. విష్ణుమూర్తి దశావతారాల్లోని బలరాముడు కూడా ఒక అవతారమని చెబుతారు. చివరి వరకు శ్రీకృష్ణుని వెన్నంటి ఉంటూ ఆ అవతార ప్రయోజనం సిద్ధించడానికి కృషిచేసాడు. శ్రావణ బహుళ షష్ఠి తిథిన బలరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. బలరాముని ఆయుధం హలం కనుక ఈ రోజును హలషస్తే అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో భాద్రపద తదియ రోజున బలరాముని జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమ రోజున, అక్షరతృతీయ రోజున కూడా బలరామ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.

బలరాముడు వసుదేవుని కొడుకు. శ్రీకృష్ణుని సోదరునిగా, అవతరించాడు. ఆదిశేషుడే బలరామునిగా అవతరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈయనకి మరో పేరు సంకర్షణుడు. అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భంలోకి లాగబడినవాడు. అని అర్థం. దేవకీ, వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపివేస్తుంటే, దేవకి ఏడో గర్భాన జన్మించవలసిన బలరాముడు విష్ణుమూర్తి ఆదేశంతో, యోగమాయ సహాయంతో ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి వెళ్తాడు. ఆ కాలంలోనే గర్భమార్పిడి పద్ధతి జరిగిందనేది ఆధునికులు గమనించాలి.

దుష్టశిక్షణలో శ్రీకృష్ణుని వెంటే ఉన్నాడు బలరాముడు. బలరాముడు అతి బలవంతుడు. గదాయుద్ధంలో ఆయనకు సాటిఎవరూ లేరు. బలరాముణ్ణి ప్రకృతి తత్త్వంగా చెప్తారు. నాగలితో దున్నిన భూమి నుండి వచ్చిన ఆహారంతో సమస్త జీవరాసులను ఈ ప్రకృతి పోషిస్తుందన్న దానికి సంకేతం ఆయన ఆయుధం. భీముడు, దుర్యోధనుడు ఆయన వద్దనే గదాయుద్ధం నేర్చుకున్నారు. బలరాముడు ఎప్పుడూ నీలంరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడని, అయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుందని కొన్ని పురాణాలు వర్ణించాయి. బలరాముడు కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.

ప్రకృతి భగవానుని కంటే వేరుగా కనిపించినప్పటికీ విరుద్ధంగా ప్రవర్తించదు. ఆయన ఆదేశాలకు లోబడే పనిచేస్తుంది. బలరాముడు శ్రీకృష్ణునితో విభేదించినట్లు కనబడినప్పటికీ అసలు ధర్మసూక్ష్మం ఏమిటో మనకు తెలియబరుస్తాడే తప్ప నిజానికి అది విభేదం కాదు. బలరాముడి సాహసం, పరాక్రమం తెలియచెప్పే సంఘటనలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కుమార్తెయైన లక్ష్మణను. స్వయంవరం నుంచి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, కౌరవ సైన్యం సాంబుని బంధింస్తారు. ఈ విషయం తెలిసిన యాదవులు, దుర్యోధనుని సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తారు. కానీ బలరాముడు వారిని వారించి తానొక్కడే కొద్దిపాటి సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. తన పరాక్రమం చూపిస్తూ తన హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు. ఆ దెబ్బకి హస్తినలో కొంతభాగం యమునలో పడింది. ఇప్పటికీ హస్తినలో (ఢిల్లీ) లోని దక్షిణ భాగం ఒక వైపుకి ఒరిగి ఉందంటారు.

భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అలా వింధ్యపర్వత ప్రాంతాలు, దండకారణ్యాన్ని దాటి బలరాముడు తన యాత్ర కొనసాగిస్తున్నాడు. ఓ ప్రాంతంలో ప్రజలంతా కరువు కాటకాలతో తిండి దొరకక విలవిలలాడుతున్నారు. దానికితోడు ప్రలంబసూతి అనే రాక్ష సుడు, అక్కడి ప్రజలను విపరీతంగా వేధిస్తున్నాడు. ఆ రాక్షసుని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా? అని ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో బలరాముడు అక్కడకు చేరుకున్నాడు. ప్రజల బాధలు విని తన హలంతో బలరాముడు ఆ రాక్షసున్ని అంతం చేశాడు. అనంతరం ఆ నాగలిని భూమిపై బలంగా నాటాడు. ఆయన నాగలిని నాటినచోట ఒక జలధార ఉద్భవించి, నాగావళిగా పేరొందింది. అనంతరం బలరాముడు, ఆ నాగావళి నది పక్కనే ఒక మహాలింగాన్ని ప్రతిష్ఠించి, దానికి రుద్రకోటేశ్వరుడని నామకరణం చేశాడు. బలరాముడు ప్రతిష్ఠించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మానవలే కాదు సకల దేవతలు కూడా అక్కడికి చేరుకున్నారని పురాణ కథనం.

Friday, August 5, 2022

చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు) 
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు 
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము.

సృష్టి రహస్య విశేషాలు

సృష్ఠి ఆవిర్బావము.
1  ముందు(పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల నర,  మృగ, పశు, పక్షి, వృక్ష, స్థావర జంగమాదులు పుట్టినవి.

సృష్ఠి కాల చక్రం
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతో మంది శివులు, ఎంతోమంది విష్ణువులు, ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1  సత్వ గుణం 
2  రజో గుణం
3  తమో గుణం

పంచ భూతంలు ఆవిర్భావం
1 ఆత్మ యందు ఆకాశం 
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5  ఙ్ఞానేంద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

1  ఆకాశ పంచికరణంలు
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల  ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల  ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల   (ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )
పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )
పుట్టెను.( మానవ దేహ తత్వం )

5  ఙ్ఞానేంద్రియంలు
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.

5 పంచ తన్మాత్రలు
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు

5  పంచ ప్రాణంలు
1  అపాన 
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన

5  అంతఃర ఇంద్రియంలు  
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం

5 కర్మేంద్రియంలు
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం

6  అరిషడ్వర్గంలు
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మాత్సర్యం

3  శరీరంలు
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం

3  అవస్తలు
1  జాగ్రదావస్త
2  స్వప్నావస్త
3  సుషుప్తి అవస్త

6  షడ్బావ వికారంలు 
1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరినమించుట
5  క్షిణించుట
6  నశించుట

6 షడ్ముర్ములు
1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

7  (కోశములు)  (సప్త ధాతువులు)
1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం

3 జీవి త్రయంలు
1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞుడు

3  కర్మత్రయంలు
1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు

5  కర్మలు
1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద

3  గుణంలు
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

9  (చతుష్ఠయములు)
1  సంకల్ప
2  అధ్యాసాయం
3  ఆభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష

10  (5 పంచభూతంలు పంచికరణ చేయనివి)
1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి

14  మంది  (అవస్థ దేవతలు)
1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  ఆగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు

10  ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ

10  వాయువులు
1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ

7  షట్ చక్రంలు
1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం

మనిషి  ప్రమాణంలు
96  అంగుళంలు
8  జానల పోడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  ముారల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం

(మానవ దేహంలో 14 లోకాలు)  పైలోకాలు 7
1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మాంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో
అధోలోకాలు  7
1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకాల్లలో
6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం - పాయువుల్లో
(మానవ దేహంలో  సప్త సముద్రంలు)
1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చెమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షీర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు

(పంచాగ్నులు)
1  కాలాగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభిలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో

7  (మానవ దేహంలో  సప్త  దీపంలు)
1  జంబుా ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుపైన
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో

10  (నాధంలు)
1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం

Thursday, August 4, 2022

తథాస్తు దేవతలు

తథాస్థు దేవతలంటే
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం.

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. 

కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది.

Monday, July 25, 2022

History and Meaning of Snakes and Ladders వైకుంఠపాళీ

"#మోక్ష_పంతం" అని పిలువబడే ఈ పిల్లల ఆటను 13వ శతాబ్దపు కవి,సన్యాసి #జ్ఞానదేవ్ రూపొందించారు బ్రిటీష్ వారు దీనికి పాములు అనే పేరును పెట్టగా మరియు నిచ్చెనలు అని కొన్ని స్థలాల్లో దీనిని కైలాసం అని అంటారు.

అసలు వంద చదరపు గేమ్ బోర్డులో, 
#12వగడి_విశ్వాసం, 
#51వ గడి #విశ్వసనీయత,
#57వ గడిలో #దాతృత్వం, 
#76వ గడిలో #జ్ఞానం, 
#78వ గడిలో #సన్యాసం.  
నిచ్చెనలు దొరికిన చతురస్రాలు ఇవి మరియు వేగంగా ముందుకు సాగవచ్చు.

41వ గడి అవిధేయత, 
44వ గడి అహంకారం, 
49వ గడి అసభ్యత,
52వ గడి దొంగతనం, 
58వ గడి అబద్ధం, 
62వ గడి మద్యపానం, 
69వ గడి అప్పు, 
84వ గడి కోపం,  
92వ గడి అత్యాశకు, 
95వ గడిలో అహంకారానికి, 
73వ గడిలో హత్యకు,
99వ గడిలో మోహానికి ప్రతీకలు. పాము నోరు తెరిచి ఎదురుచూసే చతురస్రాలు ఇవి.  #100వ_చతురస్రం_నిర్వాణం లేదా మోక్షాన్ని సూచిస్తుంది.

 ప్రతి నిచ్చెన పైభాగంలో ఒక దేవుడు లేదా వివిధ స్వర్గం (కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం) మొదలైనవాటిని వర్ణిస్తారు.  ఆట పురోగమిస్తున్నప్పుడు, జీవితంలో వలె వివిధ చర్యలు మిమ్మల్ని పైకి క్రిందికి తీసుకువెళతాయి.

 మోక్షపత్: పాము మరియు నిచ్చెన భారతదేశంలో పుట్టింది

 ఈ ఆట భారతదేశంలో దాని మూలాన్ని కలిగి ఉంది మరియు దీనిని మోక్ష పంతం లేదా పరమ పదం లేదా మోక్షపత్ అని పిలుస్తారు.  ఇది పిల్లలకు హిందూ ధర్మం మరియు హిందూ విలువలను బోధించడానికి ఉపయోగించబడింది.  బ్రిటిష్ వారు దీనిని పాములు మరియు నిచ్చెనలుగా మార్చారు.

ఆటలోని నిచ్చెనలు సద్గుణాలను సూచిస్తాయి మరియు పాములు దుర్గుణాలను సూచిస్తాయి.  కౌరీ షెల్స్ మరియు డైస్‌లతో గేమ్ ఆడారు.  కాలక్రమేణా, ఆట అనేక మార్పులకు గురైంది, అయితే అర్థం ఒకటే, అంటే మంచి పనులు మనల్ని స్వర్గానికి మరియు చెడును పునర్జన్మల చక్రానికి తీసుకువెళతాయి.  2వ శతాబ్దం సా.ద.పూ నాకు చెందిన ఆటను తీసుకెళ్లే కొన్ని సూచనలు ఉన్నాయి.

 భారతీయ పాములు మరియు నిచ్చెనల ఆట (1700 ADE)

 గేమ్ ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది: వినోదం, అలాగే చేయవలసినవి మరియు చేయకూడనివి, దైవిక బహుమతి మరియు శిక్ష, నైతిక విలువలు మరియు నైతికత.  ఆఖరి లక్ష్యం వైకుంఠం లేదా స్వర్గానికి దారి తీస్తుంది, విష్ణువు తన భక్తులతో లేదా శివుడు, పార్వతి, గణేశుడు మరియు స్కందంతో మరియు వారి భక్తులతో కైలాసాన్ని చుట్టుముట్టారు.  నైతిక మరియు నైతిక క్షీణత యొక్క ఈ యుగంలో, తమ తల్లిదండ్రుల కంటే తమకు ఇప్పటికే ఎక్కువ తెలుసునని భావించే పిల్లలకు విలువలను బోధించడానికి ఇది మంచి మార్గం.

పరమపదం నైతిక విలువలను బోధిస్తే,  పల్లంకుళి నైపుణ్యాన్ని,శీఘ్ర ఆలోచనను పెంపొందిస్తుంది. ఒక ఆటగాడికి ఏడు మరియు ఇరవై పిట్‌ల మధ్య ఉండే బోర్డుపై ఇద్దరు ఆటగాళ్ళు పోటీపడతారు;  ప్రతి ఆటగాడు గేమ్ ఆడిన నాణేలు లేదా పెంకులు లేదా విత్తనాలను సేకరించాలి, గరిష్ట సంఖ్య కలిగిన ఆటగాడు విజేత అవుతాడు.

ఈ గేమ్‌లో తొమ్మిది రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి '#పాండి', ప్రాంతీయ, కుల మరియు మత వైవిధ్యాలతో.  ఇది స్త్రీలలో బాగా ప్రాచుర్యం పొందింది మరియు మంచి జ్ఞాపకశక్తి మరియు చురుకుదనం అవసరం, ఎందుకంటే వారు ప్రత్యర్థి సేకరించిన నాణేలు లేదా విత్తనాల సంఖ్యను లెక్కించాలి మరియు గుర్తుంచుకోవాలి.

బ్రిటీష్ వారు 1892లో ఈ గేమ్‌ను ఇంగ్లండ్‌కు తీసుకెళ్లారు మరియు దానికి పాములు మరియు నిచ్చెనలు అని పేరు పెట్టారు మరియు దానిని విక్టోరియన్ విలువల ప్రకారం మార్చారు.

సేకరణ: BhaktiPustakalu
Image Credits: Devullu.com

Saturday, February 12, 2022

Vaidyanatha Swamy Temple, Thirumalapady, Ariyalur District

 Vaidyanatha Swamy Temple is a Hindu temple dedicated to Lord Shiva in the village of Thirumalapadi near Thirumanur in Ariyalur taluka of Ariyalur district in Tamil Nadu. Swami is called Vaidyanatha Swami and the mother is called Sundarambigai. The temple has two Ambika temples.

 Vaidyanatha Swami: Sage Siladha, a resident of Thiruvaiyaru, performed penance for Lord Shiva for the child. An incarnation told him that his wish could be fulfilled if he performed the Putrakameshti Yajna and that he would get the box with the child when he plowed the land for the Yajna. He was advised to raise a child who was only 16 years old. Some sage found the box and when he opened it, he saw a child with 3 eyes, 4 shoulders and a crescent moon adorned on his head.

 The sage closed the box in astonishment and opened it again and found the child in ordinary human form. He named the baby Japesar. The young man reached the age of 14, who was only two years old to complete his destination lifetime. The sage was so upset that his son could still live for two more years. Realizing his father's anguish, Japesar stood on one leg at the Ayana pilgrimage pool in Thiruvaiyaru and began penance. The creatures in the pool slowly began to eat him. Japesar was not afraid of their danger.

 Lord Shiva, pleased with his penance, completely healed him and gave him a long life. Later, Japesar married Suyasambika in Thirumalapadi. Even after marriage Japesar continued his penance and was appointed as the head of the Shiva Ganas and later as the security guard at the first gate of Kailasamu and was named Nandeeshwara. Japeshar is called Vaidyanatha Swami because Lord Shiva healed all his wounds.

 Vajratambeshwara: The male beast sage established the lingam here. Once, Lord Brahma wanted to remove this linga from here and establish it elsewhere. Because the lingam was as strong as a thunderbolt (diamond), Brahma could not remove it. Hence Lord Shiva is called Vajratambeshwara. Devotees believe that the four rivers in front of the Brahma idol in Koshtamu prevented Brahma's efforts.

 Vairathoonu: The male sage brought the lingam from the realm of truth and worshiped it here but later could not remove it. Hence it is called Vairathunu.

 Thirumalapadi: According to the mythology, Lord Shiva performed a cosmic dance with a maju (ax-like weapon) in his hand during the month of Vaikasi Vishakam for Markundeyu. Hence, the place was called Majuwadi, which later became known as Thirumalapadi. In the Ardhamandapam, in the right hand, there is an idol of Maludeeshwara with an ax, a trident and a noose. He is also said to have saved the sage Markandeya from Yamudi here.

 Uttaravahani Kshetra: Thirumalapadi is considered to be the Uttaravahani Kshetra as the Kollidam flows from south to north here.

 Moon relieved of skin disease: According to mythology, the moon suffered from skin disease. He came here and visited Lord Shiva and did penance. Lord Shiva appeared before him and ordered him to light lamps in the Navagraha pits. Chandran did as ordered and got relief from skin disease.

 Emperor CB relieved of his Navagraha error: Emperor CB was relieved of his Navagraha error by lighting lamps in the Navagraha pits here.

 Lord Sundarar appeared in a dream: It is believed that St. Sundarar appeared in a dream and asked the Swami to visit and praise the place, so that the saint came to the temple and addressed him as 'Ponnar Maniane' in his famous Thevaram hymn.

 Literary reference: It is believed that the lord of this place appeared in a dream of St. Sundarar and asked him to visit this place. At the request of Lord Shiva, Sundarar came to the temple and sang 'Ponnar Maniane' in his famous Thevaram hymns. The temple lord is praised in the Thevaram hymns of St. Sundarar. The golden-skinned lord, dressed in tiger skin, is likened to a majestic lord with chondroitinous flowers that radiate fragrance from the head, hair that shines like lightning, a crescent moon and a precious gem that blesses the world.

Friday, February 11, 2022

Bhishma Ekadashi

The Ekadashi that falls in the month of Magha is called Bhishma Ekadashi. Bhishma Ekadashi is the holiest day on which Bhishma, who was wounded during the battle of Kurukshetra, taught Vishnu the Sahasranama to Dharmaraj while he was on Ampashayya. Bhishma Ekadashi is also known as Jaya Ekadashi. Because it is the belief of the elders that whatever action is taken today will surely be successful, and that those who worship Sri Mahavishnu on this day will have access to heaven.

Bhishma Ekadashi Highlights: Bhishma was the eighth child of Ganga, the Shantanu. The original name was Devavratu. Father Shantanu sacrificed his life to Satyavati by giving her the Satyavati he loved, and for Satyavati's promise that there would be no place in his life for the word of marriage that God would be a bachelor forever for the happiness of the father. Since then the deity has been known as Bhishma. Satisfied with his sacrifice, the father gave Bhishma the gift of voluntary death.

Bhishma, the father of archery, led the battle on the battlefield of Kurukshetra on behalf of the Kauravas, led by Lord Krishna himself for ten days with the ahva yajna single hand. Arjuna and Lord Krishna also became disillusioned with Bhishma's archery. "Bhishma" welcomed death only when he stood on the side of lawlessness and prepared to fight righteousness.  That is, Arjuna, thinking that it was a punishment for his incompetence, reached Bhishma, who had been wounded by arrows, and, waiting for a better time to die, not only preached the kingdom dharma to the Pandavas but also chanted the Vishnu Sahasranama to the king of Dharma.  The gods were also saddened to see Bhishma lying on the ground. Bhishma spent 58 days on Ampashayya, experiencing the agony of death, waiting for the Uttarayana pilgrimage, for death, a great boon to mankind.

In response to King Dharma's skepticism, Lord Krishna, the human idol of Leela, began by saying, 

"Jagat Ebhum Devadevamanantham Purushottamam," and "Vishvam Vishnurvashatkaro Bhuta Bhavya Bhavatprabhu:" 

While Lord Krishna gave Maghashuddha Ekadashi Tithi as a gift on the day of Bhishma's remembrance. This is how the Mahaprasthana of a great man in the Mahabharata epic ended. 

Thousands of years after Bhishma's demise, the "Vishnu Sahasranama Stotra" he prophesied is still dancing to the tune of Bhagavata. His divine voice continues to resonate universally. Reading Vishnu Sahasranama is omnipotent, all purification. Every letter in that nomenclature is divine. The pronoun is Mahamantra. It is immortal. Hindus celebrate Maghashuddha Ashtami as "Bhishmashtami" and Maghashuddha Ekadashi as "Bhishma Ekadashi" when Bhishma reaches Paramatman.

Wednesday, February 9, 2022

The Indian Calendar

Sadhana Pada

Guru Pournami is the first full moon in Dakshinayana, and marks. the day when Shiva the  became the Adi Guru or first Guru.

"Unlike modern calendars that ignore human experience in relation to the planetary. movement, the Indian lunisolar calendar takes account the experience and impact that is happening to the human being. It connects you with the movements of the planet."

Mahalaya Amavasya is the first new moon after the autumn equinox. Dussehra, which celebrates the divine feminine begins on the next day.

Winter Solstice (December 22):
Marks the shift from Dakshinayana to Uttarayana. It is the beginning of the gnana pada or the period of flowering.

Gnana Pada

Summer Solstice (June 21): Marks the shift from Uttarayana to Dakshinayana. It is the beginning of the sadhana pada or the period of striving.

Buddha Pournami celebrates the day of Gautama Buddha's enlightenment.

The 21 days after Ugadi are the warmest in the Northern hemisphere.

The spring and autumn equinoxes (March 21, September 23) mark a point when a sadhaka can bring balance to one's system. The Devi Pada begins from the autumn equinox.

Mahashivarathri is one of the most spiritually significant nights, when nature creates anatural upsurge of energies.

Manni Amavasya is the new moon that comes before Mahashivarathri. Yogis frequently maintain Maun or silence till Mahashivarathri.

Tuesday, February 8, 2022

The temple was built by the Chola king Kulothunga Chola after his victory in the North Indian War., Kampahareshwarar Temple, Tribhuvanam, Kumbakonam Dari





Kampahareshwarar Temple, Tribhuvanam, Kumbakonam Dari

 Kampahareshwarar Temple is a Hindu temple dedicated to Lord Shiva. It is located in the town of Thirubuvanam on the Mayiladuthurai-Kumbakonam road. Lord Shiva is worshiped as "Kampahereshwarar" as Brahmaraksha removes the vibration (shaking) of the haunting king. Lord Shiva Swayambhumurti in the temple.

The main deity of the temple is Lord Shiva known as Kampahareshwarar and Goddess Parvati. The temple was built by the Chola king Kulothunga Chola after his victory in the North Indian War.

In this temple, there is a special shrine to Sarabeshwar. The 7 feet tall idol of Sarabeshwar is seen in a high pose from a special shrine. Sharabeshwar appears with a lion's mane, human body and eagle wings. Sharabeshwarar is the incarnation of Lord Shiva to cool Narasimha after Asura destroyed Hiranyaksh. There is a saying that Sharabeshwar destroys all evils and enemies. Childbirth and marriage difficulties were resolved by Lord Sharabeshwarar. Apart from this temple, Thirubuvanam is famous for its silk sarees.

About the temple: The main deity of the temple, Lord Shiva Kampahareshwar is a linga form. Apart from this, the temple also has a special shrine for Sharabeshwarar, a combination of man, eagle and lion. According to legend, after Lord Vishnu killed Hiranyakashipu in the incarnation of Lord Narasimha, Lord Shiva appeased Lord Narasimha to save the gods from rage and anger.

 The sculpture of Sarabeshwaramurthy in the Tribhuvanam temple is strange. The goddess is depicted with three legs, a lion body and a face as well as a tail. Sarabeshwar is holding four human hands, holding an ax in his right upper hand, a trap in his lower right hand, a deer in his upper left hand and a fire in his lower left hand.

Narasimha had eight arms and Sarabeshwara moorthy was struggling to free himself by crawling under his paws. Apart from these, the temple is also adorned with beautiful sculptures of Vishnu's wives Sridevi and Bhudevi. The main deity of the temple is the Shivalingam in the form of Kampahareshwar.

The idols of Bikshatana, Lingodbava, Dakshina moorthy, Brahma and Durga Devi are in the wall. The temple, which is under the administration of Dharmapuram, has nine holy shrines, including the Sharaba Tirtha.

Myths and Stories: According to Hindu mythology, the devotees believed that Swami had relieved the trembling of the king who was being chased by evil spirits because he had killed a Brahmin by mistake. Hence the name Kampahareshwara Swami to this Swami. King Varguna Pandian was riding a fast horse to fight his enemies when a Brahmin came across him and the king tried to slow down the horse to save him but according to fate the Brahmin died in an accident. His soul haunted the king with Brahmahati dosha-papa. The king came to the Thiruvidaimarudur Mahalingaswamy temple to worship the Lord for the prevention of his Brahmahatya error. The spirit of the Brahmin left him and stood at the eastern entrance of the temple waiting for the arrival of the king. So Mahalingaswamy ordered the king to go out through another gate. The king went to Tirubuvan but was trembling with fear that the spirit would catch him again. Kampahareshwarar saved the king from trembling. Hence, he was hailed as the leader of the Nadukkam (trembling) Tirtha.

History: According to inscriptions found on the south wall of the temple, the shrine was built by the Chola king Kulothunga Chola III as a monument to his successful North Indian campaign. The inscriptions in the adhisthana temple are similar to the outer gopuram (Rajagopuram), indicating the structure of the Kulothunga-Chola temple. Although it is unclear which Kulothunga Chola king, it was confirmed by scholars in 1176 CE that it was close to the reign of Kulothunga Chola III who is considered to be a powerful Chola king.

There are four inscriptions in scripture from Kulothunga Chola. The ruins on the south wall of the shrine between the 189th edict of the 1907 edict mention Arya Sri-Somnath. Inscription 190 on the same wall refers to the Kulothunga Chola structures. At the entrance to the 191st outer tower, a duplicate of 190. In the same tower the 192nd inscription refers to the record of King Kulothunga Chola. There are two inscriptions in Tamil from the time of Jatavarman Tribhuvana chakravartin Parakrama Pandyadeva in 1911 by the Department of Epigraphy. One of them, 159, registered an agreement between the inhabitants of Tribhuvanaveerapuram and Kulamangalanadu. On the same wall, there is an inscription numbered 160, which records a similar agreement in the presence of Chief Minister Udayar Kulasekara Deva.

Significance: People pray to Sarabeshwar for relief from illness, worries, court affairs, the effects of witchcraft, threats from mysterious enemies, spells, and adverse effects caused by planets. They worship the Lord and gain freedom from the life, job promotion, intelligent children and debt burdens of their choice. Those who pray to Kampahareshwar will get complete relief from neurological problems, tremors, meaningless fear in the mind, lack of brain growth and other ailments. They are also blessed with a healthy longevity. Mother Ambika frees her devotees from sin, purifies the unity of the couple and procreation weeks.

Reaching Thirubuvanam Sri Kampahareshwara Temple
By Air - The nearest airport is at Trichy Airport.

Train - The nearest railway station is the Scandal Railway Station.

Road.- Thirubuvanam is located in Thanjavur district in the Indian state of Tamil Nadu. It is located 6 km from Kumbakonam city on Mayiladuthurai road (Mayavaram). Distance. Connected with adequate bus facilities from Mayiladuthurai. Bus facilities are also available from Kumbakonam.

Importance: Devotees visit this temple to fulfill the following: -

Devotees visit this temple for childbearing to remove obstacles in marriage, to win legal battles and to neutralize the effects of witchcraft.

Hymns: "Kailasharana Shiva Chandramouli Phaneendra Mata Mukuti Jalali Karunya Sindhu Bhava Dukhah Hari Tujavina Shambho Maja Kona Tari"

Meaning - O Shiva seated on Mount Kailash, the moon adorns the forehead and is crowned like a crown on the head of the king of snakes. I surrender to you.

"Om Triambakam Yajamahe Sugandhim Pusti Vardhanam Urvarukamiva Bandhanath Mrityur Mukshiya Mamritath"

Meaning - We worship the fragrant Lord Shiva who has eyes and nurtures all living beings. Since even a cucumber is separated from its string, he will redeem me from death, for immortality.

Monday, February 7, 2022

Sri Ramanujacharya - 1000 year old body of Sri Ramanujacharya Body Srirangam!

Sri Ramanujacharya - 1000 year old body of Sri Ramanujacharya. Ever seen it in Srirangam!

Ramanujacharya was a Mahanite who gave a proper meaning to the Vedas and spread the greatness of Vishishtadvaita to the world. Thousands of years after his death, his body is still preserved.

The importance of Hinduism in India is very significant. We find dazzling temples in every state. Srirangam is a town located in the state of Tamil Nadu, India. It is said that Lord Vishnu incarnated in the Srirangam Temple, one of the famous Vaishnava shrines. Built with seven walls, the temple has many specialties at every step. The most notable of them is the body of Sri Ramanujacharya.

Although more than a thousand years have passed since the ascension of Sri Ramanujacharya, his body is still preserved here. However, it is unfortunate that many devotees are not aware of this. Although some visit the temple of Ramanujacharya in the 4th wall of Srirangam, they do not realize that what is there is his divine body.

Ramanuja left his body here while sitting in a yoga posture in the Padmasana. The body is still visible in that sitting posture. Twice a year a festival is held for him. At that time camphor and saffron flower are applied in a lump to the body of Noori Ramanuja. Hence his body shines like an idol in a red color. However, we can clearly see his eyes and nails while giving the horticulture. The saffron flower ointment does not dye there so they look even brighter in horticultural lights.

The best of Ramanujacharya: Ramanuja was born in the year 1017 AD in Sriperumbudur (Bhoothapuri), 25 km from the city of Chennai. Ramanuja, who lived for almost 123 years, made special efforts to propagate the Visishtadvaita doctrine. He spent half of his life in the fields of Srirangam and Kanchipuram in Tamil Nadu.

Is the idol of Kaliyuga deity Thirumala Venkateswara Swamy in the form of Vishnu? In the form of Shiva? Ramanujacharya resolved the disputes between the Vaishnavism and the Shaivites. This problem was easily solved when Thirumala Swami kept the conical wheels in their womb and when the whites saw Swami wearing them they were seen. Ramanujacharya also decided on the daily handicrafts and services of Thirumala Venkateswara.

The Ashtakshari Mukti mantra, which is limited to a few, is heard on the roof of the Thirukottiyur temple. Rejecting the claims that he would go to hell if this mantra was proclaimed publicly, he was dismayed. He proposed the concept of equality, coexistence and equality. He pioneered many great reforms in Hinduism.

Unpopular secret: Ramanujacharya left his body in Srirangam between the 11th - 12th centuries AD. Since then special ointments have been smeared to protect his body. However, the popularity of this place was unmatched by the divine body of Ramanujacharya in Srirangam. That is why it remains a secret known to very few.

వేదాల్లో సూర్యోపాసన - సూర్యభగవాన్ విశిష్టత

సూర్యభగవాన్ విశిష్టత:
సప్తలోక ప్రకాశాయ సప్త సప్త రథాయ చ । 
సప్త ద్వీప ప్రదీపాయ భాస్కరాయ నమో నమ: ॥

సకల చరాచర జగత్తుకు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఈయన భూమి మీద తొలిగా తన వెలుగును ప్రసాదించిన రోజు సప్తమి. అందుకనే మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిగా, రథ సప్తమిగా లోకప్రసిద్ధి పొందింది.

సూర్యునికి వివస్వంతుడనే పేరు ఉంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. ఇతని మన్వంతరం ప్రారంభమైంది కూడా సప్తమి రోజునే. సూర్యుడు తన రథాన్ని అధిరోహించింది కూడా మాఘ శుద్ధ సప్తమి రోజునే. అందుకనే మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా ప్రసిద్ధి పొందింది. మత్స్యపురాణంలో ఈ వివరాలు ఉన్నాయి.

మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది.

సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి.

సూర్యోపాసన చేసి, సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అగస్త్య మహర్షి చేత ఆదిత్యహృదయాన్ని ఉపదేశం పొంది, దాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురిడిని సంహరించాడు. ఇంకా మరెందరో పుణ్యమూర్తులు సూర్యోపాసన చేసి, రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన పుణ్యప్రభావం చేత ఎన్నో బాధల నుంచి విముక్తులైన గాథలు ఉన్నాయి. మొత్తంగా సూర్యోపాసన అనంతమైన ఫలితాలను ఇస్తుంది.

సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈవిధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా లోకంలో వ్యాప్తి చెందింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరవుతుందని, ఆ ఆవిరి మేఘాలుగా మారి, వర్షించటం వల్ల సకల ప్రాణికోటి తాగటానికి మంచి నీరు, పంటలు పండటానికి తగిన నీరు లభిస్తోందని చెబుతోంది. ఈవిధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని స్పష్టమవుతోంది.

సౌరార్చన విశేషాలు:
ఆదివారం నాడు తెల్లజిల్లేడు సమిధలు ఉపయోగించి మహాసౌమంత్రంతో హోమం చేసినవారికి అభీష్టసిద్ధి కలుగుతుంది.

ఆదివారం రోజున తెలుపు, ఎరుపు, పసుపుపచ్చని మృత్తికలను ఒంటికి పూసుకుని, మృత్తాకాస్నానం చేసిన వారికి కోరికలు సిద్ధిస్తాయి.

వివిధ రంగుల పూలతో ప్రతి ఆదివారం విడువకుండా ఆదిత్యుని పూజించి, ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే కోరికలు అతిశీఘ్రంగా నెరవేరుతాయి.

ప్రతి ఆదివారం ఆవునెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి, ఆ దీపాన్ని సూర్యస్వరూపంగా భావించి పూజించినట్లయితే నేత్రవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.

రాగిపాత్రలో నువ్వులనూనెతో దీపారాధన చేసి, ఆ దీపాన్ని బ్రాహ్మణుని దానం చేసినవారికి జ్ఞానప్రాప్తి కలిగి, అంతిమంగా ముక్తి లభిస్తుంది.

చతుష్పథం (నాలుగు రోడ్లు కలిసే కూడలి)లో ప్రయత్నపూర్వకంగా ద్వాదశాదిత్యులను ఉద్దేశించి 12 దీపాలు దానం చేసిన వారు భాగ్యవంతులు అవుతారు. మరుసటి జన్మలో రూపవంతులు, భాగ్యవంతులు అవుతారు.

పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, రక్తచందనం, ఎర్రని పుష్పాలు, అక్షతలు, తిలలు, గరిక ఇగుళ్ళు కలిపిన జలంతో నిత్యం ద్వాదశాదిత్యులకు 12 అర్ఘ్యాలు ఇచ్చి, ఆ ద్రవ్యాలతో ఆదిత్యుని అర్చించి, ఒక సంవత్సరం పాటు అష్టాక్షరీ మహామంత్రాన్ని దీక్షగా జపించిన వారికి సంవత్సరాంతంలో ఇష్టసిద్ధి తప్పకుండా కలుగుతుంది.

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యునుకి అభిముఖంగా నిలబడి, సౌరమంత్రం జపించినా, సూర్యస్తోత్రాలు పారాయణ చేసినా జన్మ ప్రారంభం నుంచి అప్పటివరకు చేసిన పాపాలు నశిస్తాయి.

గుగ్గులు కర్ర, మారేడు చెక్క లేదా దేవదారు చెక్కతో నలుపలుకలుగా ఉండే ఆసనం తయారుచేసి, దాని మీద ప్రభాకరుని ఆవాహన చేసి, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో అర్చించిన వారికి స్వర్గలోక ప్రాప్తి స్థిరంగా కలుగుతుంది.

‘విషువ’ అనే పుణ్యకాలంలో సూర్యార్చన చేసిన వారికి సమస్త పాపాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

పులగం, పాయసం, అప్పాలు, పండ్లు, దుంపలు, నెయ్యి తదితర ద్రవ్యాలతో సూర్యబలి ఇచ్చిన వారికి కోరికలన్నీ తీరుతాయి.

మూలమంత్రాన్ని పారాయణ చేస్తూ, ఆవు నేతితో తప్పరణ చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి. ఆవుపాలతో తర్పణ చేస్తే మనస్తాపాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆవుపెరుగుతో తర్పణ చేస్తే కార్యసిద్ధి 
కలుగుతుంది.

పవిత్ర తీర్థజలాలతో అరుణ, మహాసౌర మంత్రాలతో సూర్యునికి అభిషేకం చేస్తే పరమపదం లభిస్తుంది.

భక్తిశ్రద్ధలతో ఆదిత్యుడిని ఒక్కరోజు పూజించిన ఫలితం వంద యాగాలు చేసిన ఫలితాన్నిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

వేదాల్లో సూర్యోపాసన:
కృష్ణయజుర్వేదంలో సూర్యవైభవం ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ‘తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదశి సూర్య...’ (కృష్ణ యజుర్వేదం, సంహిత, 1 ` 4)లో అనే మంత్రం చీకటితో నిండి ఉన్న సకల జగత్తు అంతా సూర్యుని కాంతి వల్లనే దృగ్గోచరమవుతుందని చెబుతోంది.

నారాయణోపనిషత్తు ‘ఘృణిస్సూర్య ఆదిత్యోం న ప్రభావాత్యక్షరం మధుక్షరన్తి తద్రసం’ అంటుంది. సముద్రాల్లోని ఉప్పు నీటిని తన కిరణాల ద్వారా గ్రహించి, తన ప్రభావం చేత ఆ ఉప్పు నీటిని తాగటానికి యోగ్యమైన నీరుగా, ఓషధీగుణాలు కలిగినదిగా మార్చి, మేఘాల ద్వారా వర్షింపజేస్తాడు సూర్యభగవానుడు. ఈవిధంగా సూర్యభగవానుడి అనుగ్రహ ఫలితంగా అందిన వాన నీటి ద్వారానే పంటలు పండుతాయి. పంటల వల్ల మానవాళికి అన్న సమృద్ధి కలుగుతుంది. అంటే, సకల మానవాళి మనుగడకు సూర్యుడే జీవాధారం అని వేదం స్పష్టం చేస్తోంది.

నారాయణోపనిషత్తులో ‘ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి తత్రతా ఋచ:...’ అని ఉంటుంది. అంటే సూర్యుని ఆవరించి ఉండే తేజస్సు ఋగ్వేద స్వరూపం. ఆయన నుంచి లోకాలకు అందే వెలుగు సామవేదం. సాక్షాత్తు సూర్యభగవానుడే యజుర్వేద స్వరూపం అని అర్థం.

‘సూర్యస్యచక్షూ రజసైత్యావృతం తస్మినార్పిత భువనాని విశ్వా...’ (ఋగ్వేదం, 1`164`14) సూర్యుని పైనే సమస్త ప్రాణికోటి ఆధారపడి ఉంది. సూర్యుడు పరమాత్మ స్వరూపుడు.

శ్రౌత కర్మల్లో నిర్వహించే యజ్ఞయాగాది క్రతువుల్లో సూర్యునికే అగ్రస్థానం. చంద్రుని వెన్నెల కూడా సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిరదే. ఓషధుల్లో ఉండే ఔషధ గుణం సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిరదే. ఇంకా మరెన్నో సూర్యవైభవాలను ప్రకటించే విశేషాలను వేదాలు విస్తారంగా చెబుతున్నాయి.

సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.

బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః ।
సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకరః॥

సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు.

ఇతిహాస, పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యోపాసన ద్వారా వాజసనేయ సంహిత (శుక్ల యజుర్వేదం) పొందాడు. వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు కూడా సూర్యుని గురువుగా స్వీకరించి, ఆయన నుంచి సకల విద్యలు వరంగా అందుకున్నాడు. కుంతీదేవి సూర్య మంత్రాన్ని ఉపాసించటం ద్వారా సంతానం (కర్ణుడు) పొందింది. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించటం వల్లనే శమంతకమణి సాధించాడు. అరణ్యవాస కాలంలో ధర్మరాజు సూర్యోపాసన చేసి, అక్షయ పాత్రను పొంది, తన ఆశ్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశాడు.

ప్రస్కణ్వుడనే మహర్షి సూర్యమంత్రాలను ఉపాసన చేయటం ద్వారా తన చర్మరోగం నుంచి విముక్తి పొందాడు. భద్రేశ్వరుడనే రాజు కూడా ఆదిత్యోపాసన ద్వారా శ్వేత కుష్ఠురోగం నుంచి ఉపశమనం పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యగాయత్రి, అరుణం, మహాసౌరం, ఆదిత్యహృదయం, మయూర శతకం మొదలైన వాటిని పారాయణ చేయటం ద్వారా అనేక శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తిపొందిన భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి.

ప్రత్యేకించి, రథసప్తమి రోజున చేసే స్నానం, సూర్యారాధన అనేక విశేష ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున జిల్లేడు ఆకులను శిరసు, భుజాల మీద ఉంచుకుని స్నానం చేయాలి. గోధుమనూకతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదన చేయాలి. ఇందువల్ల ఏడుజన్మల్లో చేసిన పాపం నశిస్తుందని నారద పురాణం చెబుతోంది.

సూర్యగమనం ఆధారంగానే ఋతువులు, అయనాలు (ఉత్తరాయణం, దక్షిణాయనం) ఏర్పడతాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సందర్భం మకర సంక్రమణం. ఆ తర్వాత మాఘ శుద్ధ సప్తమి నుంచి సూర్యగమనం దక్షిణదిశకు మారుతుంది. ఈవిధంగా, రథసప్తమి ఖగోళ విజ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది.

మాఘ మాసం, శుక్ల పక్షంలో షష్ఠి తిథితో కూడిన సప్తమి వస్తే, అది మరింత పర్వదినం. ఆ రోజు సూర్యునికి ఎంతో ప్రీతికరం. సాధారణ రథసప్తమి పర్వదినాల కన్నా షష్ఠితో కూడిన సప్తమి రోజున చేసే సూర్యారాధన మరింత ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది.

యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పున:
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర ॥
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నర:
కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్ ॥

రథసప్తమి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తూ, శాస్త్రవిధిగా స్నానం చేయాలని, ఫలితంగా ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్రదోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది.

మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమ వ్రతంగా లోకవ్యాప్తిలో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

రథసప్తమి: అంటే ఏమిటి, ఎందుకు?

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం

బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే 
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు 
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు, 
3. అనుష్టుప్పు, 
4. జగతి, 
5. పంక్తి, 
6. బృహతి, 
7. ఉష్ణిక్కు

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వ దేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

సూర్య నారాయణ దండకం

శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!
పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండ స్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!

Sunday, February 6, 2022

Prime Minister Modi unveiled the 'Statue of Equality' in Hyderabad

The huge 'Statue of Equality' of Prime Minister Narendra Modi "dedicated to the world" Sri Ramanujacharya on Saturday was made in China and cost around Rs 135 crore.

The order was placed in August 2015 to China-based Aeroson Corporation, although an Indian company was also vying to win the contract.

 Casting work was done in China and the statue was brought here in 1,600 pieces. Installation took place in 2017-18 and took about 15 months.

At 216 feet, the statue is the second tallest sitting statue in the world. It is made of Panchaloha (alloy of five metals) - copper, silver, gold, zinc and titanium - of which 80 per cent is copper.

What you need to know about the statue of equality here

Sage Sri Ramanujacharya is credited with initiating social reforms and reviving Hinduism a thousand years ago and inspiring devotional movements in the country.

The Samata-Kendra, around the idol of Sri Ramanujacharya, is home to 108 replicas of 108 sacred Hindu shrines in the country, spread over 45 acres near the Hyderabad International Airport. Jupally Rameshwara Rao of My Home Group donated the land and the project cost - “About Rs. 1,000 crore ”- donations received.

The agreement with the Chinese company was signed by Jupally, Chairman, My Home Group of Industries, on behalf of Sri Ramanuja Millennium Managers.

The statue was erected to commemorate the 1000th birth anniversary of Sri Ramanujacharya (born in 1017 in present day Sriperumbudur, Tamil Nadu) with the hope of lasting another 1,000 years and also spreading the message of equality in society.

According to the famous monk Tridandy Chinna Jiyar Swami, who designed the project, the original plan was to have a stone carved figurine on a hill somewhere in Tamil Nadu 10 years ago.

But after two years of searching, no suitable rocky hill was found. Chin Jiyar agreed to the present statue as Jupally came forward to donate land at Muchhinthal for the project.

The 14 models of the statue of Sri Ramanujacharya were originally made incorporating the principles of agama and architecture, three of which were further improved by 3D scanning. The final sample was then sent to China.

The agreement with the Chinese company was signed by Jupally, Chairman, My Home Group of Industries, on behalf of Sri Ramanuja Millennium Managers.

Narmada River Story and Trivia

Among the sacred rivers, the Ganges, the Yamuna, the Godavari, the Cauvery, and the Narmada are the five sacred rivers of India. Narmada is supremely sacred. She is also known as Reva and Purvaganga. It is said that looking at the river removes our sins. Interestingly, according to legend, when she thinks she has been polluted by her admirers bathing in the Ganges, she comes in the form of a black cow to take a purifying bath in the Narmada!







In mythological times, Lord Shiva, the head of destruction, sat in meditation. His intense concentration made him sweat. As it rolled down, it was collected in a tank. Eventually, it turned out to be Shankar's daughter Narmada or Shankara. Every pebble in the riverbed should be in the shape of a Shiva lingam.

According to a legend, 60 million Gandharvas defeated the Nagas and captured their kingdom and wealth. Nags went to Vishnu for help. Purukutsa asked them to get help. They sent their sister Narmada for prenatal help. He agrees and she leads him into the world of Nagas. Supported by Vishnu, Purukutsa fought the Gandharvas and eventually defeated them.

Naglu declares that those who remember the story of Narmada who led the Purukutsa were not poisoned by snakes. Married Narmada Purukutsa.

Sahasrarjuna Emperor: Maheshwar, located on the banks of the Narmada River, is the capital of Sahasrarju. One day, the king and his 500 wives went to the river for a picnic. When the wives wanted a spacious playground, the king stopped the mighty Narmada river with his 1000 hands!

While they were all enjoying themselves, Ravana flew in his floral plane. At the bottom, when he saw the dried up river bed, he felt that it was an ideal place to pray to Shiva. He made a Shivalinga out of sand and started worshiping it.

When the wives of the millennium were finished and they came out of the riverbed, he let the water flow. A huge river swept away Ravana's Shivalinga and ruined his prayers. An enraged Ravana tracked down and challenged Sahasrajuna. Armed, the mighty Ravana was greatly astonished. The mighty Sahasrarja threw Ravana to the ground with his 1000 arms. Then he put 10 lamps on his head and one on his hand.

After tying up Ravana, Sahasrarju dragged him home and tied his son to a hammock. The insulted Ravana remained a prisoner until his release.

Even today, 11 lamps are lit at the Sahasrarjun Temple in Maheshwar.

Western Narmada Stream: Narmada is said to have given birth to two teardrops of Brahma. Others say Narmada's father made a formal marriage proposal from his son to the goats. Others say that the son was attracted to the strong Narmada and she agreed to marry him.

As the son slowly approaches his bride in the procession (barat in Hindi), Narmada sends her hairdresser Johilla to see the curious and impatient groom. The son chatted with Johilla and she was mesmerized. When Narmada realizes that her groom Johilla is enjoying companionship, she comes out of the house and flows to the west. The rejected son also went east from Amarkantak. Eventually, the Johilla stream, formed with her tears, flows eastward to join the son.

The son is an important tributary of the Ganges.


 Trivia:


 1. This river forms an important connection between the Arabian Sea and the Ganges.


 2. It was called by the Greek geographer Ptolemy Namade.


 3. Narmada is considered a mother and a provider of peace.


 4. It is the fifth largest river in the Indian subcontinent and flows through central India.


 5. The source of the river is the Amarkantak hill range.


 6. It is believed that bathing in this river removes all sins. It is one of the five sacred rivers of India.


 7. The Narmada river basin is home to some of the finest teak and hardwood forests in India. Also, Maheshwari sarees are popular in the area.


 8. Several irrigation projects related to the Narmada River have been completed, supplying water to hundreds of people. Farmers across Central India.


 9. Dams and hydroelectric powerhouses have been built to make full use of this river flow.


 10. The distribution of water in this river has been in dispute for a long time and finally an agreement has been reached to allocate water as per the need.


#narmada #narmadapushkaralu #narmadariver  #narmadakumb2024 #narmadapushkaralu2024  


పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...