Saturday, September 6, 2025

GST 2.0 Clarifies Gold Tax: 3% GST on Gold and 5% on Making Charges Remain Steady Amid Reform

GST on Gold Remains Unchanged Amidst GST 2.0 Reforms in India

The Goods and Services Tax (GST) Council recently unveiled GST 2.0 reforms aimed at simplifying India’s indirect tax regime by consolidating multiple GST slabs into mainly two broad rates of 5% and 18%, effective from September 22, 2025. While these reforms promise lower tax rates for many essential goods and relief for households and businesses, the GST on gold and silver remains notably untouched, providing clarity and stability to the precious metals market ahead of the festive season.

Gold and Silver GST Rates Steady at 3%

In the Council’s 56th meeting held on September 3, 2025, it was decisively announced that gold and silver will continue to attract a GST of 3% on their transaction value. Additionally, the jewellery making charges will persist at a 5% GST rate. This means buyers of gold jewellery, coins, and bars will not see any change in the tax incidence due to the GST 2.0 reforms.

This strategic decision keeps bullion taxation stable amid broader tax rationalization, ensuring that consumer sentiment and trade patterns around gold remain consistent during one of the peak buying seasons in India. It also avoids introduction of any uncertainty in pricing at a time when gold holds cultural and investment significance for millions.

Simplification but Selective Impact

The GST 2.0 structure simplifies the old four-slab tax system (5%, 12%, 18%, and 28%) to primarily two slabs—5% for essential and low-value goods and 18% for goods and services considered standard. A distinct 40% GST slab has also been introduced for luxury and sin goods like high-end cars, tobacco products, and premium aerated drinks.

However, precious metals such as gold and silver have been consciously excluded from these changes to maintain continuity and predictability. Most everyday use items and many consumer goods will benefit from lowered taxes, but gold investors and jewellery buyers will continue to transact under the established rates.

Market Reactions and Future Outlook

Following the announcement, gold futures on MCX (Multi Commodity Exchange) saw a mild decline as investor focus partially shifted to equities and higher risk assets, benefiting from reduced taxation on other goods. However, the stability in gold’s GST rate offers reassurance for both buyers and retailers about pricing confidence through the festival period and beyond.

For jewellery buyers, this means their purchases will remain fairly priced on the tax front, with no immediate relief but no unexpected hikes either. For investors, gold’s price movement will continue hinging primarily on global demand-supply dynamics, currency fluctuations, and central bank policies rather than domestic tax reforms.

Transforming Taxes: India’s New GST Structure Set to Simplify and Support Every Wallet Starting This Navratri

India’s GST Overhaul 2025: Simpler, Fairer, and Poised to Change Households Forever

As the festive air of Navratri approaches, India is set to witness a sweeping change in its tax landscape with the rollout of new GST rates effective September 22, 2025. The revised structure marks a significant move toward simplifying the indirect tax system, making it easier for both consumers and businesses alike to understand and comply. Essential daily-use items, such as fresh fruits, vegetables, and key healthcare goods, now breathe easier—completely freed from the burden of tax. Many life-saving medicines, health insurance premiums, and educational supplies join this exclusive zero-tax club as part of the government’s drive to prioritize public welfare. For the first time, the GST Council has expanded the lowest slab to cover a broad spectrum of products, allowing a larger share of household expenses to escape taxation entirely.

Packaged food, basic footwear, and vital agricultural machinery see their rates streamlined at five percent, promising noticeable relief in household budgets. Services like beauty salons and budget hotels also now fall under this affordable tax bracket, ensuring that everyday comforts remain within reach for the wider population. Meanwhile, most other goods and services—from household appliances and electronics to standard vehicles and telecom—are brought under a unified eighteen percent bracket. This reduces confusion and paperwork for businesses, while consumers can anticipate more transparent billing across the country. The move to collapse overlapping slabs into one standard rate is intended to foster smooth business operations and a more predictable tax environment.

For those with a taste for luxury, however, the message is clear: high-end automobiles, yachts, exclusive real estate, and products deemed harmful to health—including tobacco and sugary sodas—are now taxed at a hefty forty percent. This dramatic jump is designed not only to augment revenues but also to guide consumer choices and promote social well-being.

Experts forecast that the GST reset will make everyday essentials more affordable across India, boost overall consumption, and inject momentum into sectors ranging from FMCG to agriculture. The expanded scope for exemptions, coupled with a sharper focus on transparency, is expected to simplify compliance and accelerate business growth, especially for small enterprises. By dramatically revising the GST matrix, this reform signals a shift towards economic resilience led by grassroot demand and inclusive development.

As the country adapts to the new normal from September 22, families are encouraged to review their spending, while businesses update their pricing strategies to align with the clarified GST structure. The reform, which comes after broad consensus among policymakers, aims to build a simpler, fairer, and growth-focused taxation ecosystem—making 2025 a landmark year in India’s journey toward economic progress and social support.
.
.
.
.
#GST #GSTIndia #GSTUpdate #GST2025 #TaxReforms #IndirectTax #Finance #Business #Accounting #GSTCompliance #GSTR #Taxation #India #TaxUpdates #Economy

Thursday, September 4, 2025

GST 2.0 ఆవిష్కరణ : రెండు స్లాబ్‌ నిర్మాణానికి ఆమోదం

(కాయల సాయి నవీన, ప్రత్యేక ప్రతినిధి, మాయావిన్యూస్)
జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం దాదాపు 10 గంటలకు పైగా కొనసాగి దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక నిర్ణయానికి దారితీసింది. కేంద్రం మరియు రాష్ట్రాలు తీవ్ర చర్చల అనంతరం జీఎస్టీ 2.0 రూపంలో రెండు స్లాబ్‌ పన్ను నిర్మాణంపై అంగీకరించాయి. ఇప్పటివరకు ఐదు శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం వంటి పలు రేట్లు అమల్లో ఉండగా, ఇకపై సులభతరం చేస్తూ కేవలం రెండు స్లాబ్‌లలోనే పన్ను వసూలు చేయనున్నారు. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి.  

ప్రజలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. ఇప్పటి వరకు హెల్త్ పాలసీ ప్రీమియంపై సుమారు 18 శాతం వరకు అదనపు జీఎస్టీ బారం పడుతుండగా, ఇకపై అలాంటి భారం ఉండదు. ఉదాహరణకు, ఒక కుటుంబం సాలీనా రూ.20,000 ప్రీమియం చెల్లిస్తే, అదనంగా రూ.3,600 బారం మునుపటి విధానంలో ఉండేది. ఇప్పుడు అది అంతా తొలగి, ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుంది. ఇది ఆరోగ్య భద్రతను మరింత చేరువ చేయనున్న నిర్ణయంగా భావిస్తున్నారు.  

సాధారణ వస్తువులను తక్కువ స్లాబ్‌లో వర్గీకరించగా, విలాసవంతమైన వస్తువులు లేదా అధిక ఆదాయం ఇచ్చే సేవలను ఎక్కువ స్లాబ్‌లో చేర్చనున్నారు. ఈ మార్పు వల్ల వ్యాపారులకు పన్ను లావాదేవీలు సులభతరం కాగా, వినియోగదారులకూ ధరల్లో స్పష్టత ఉంటుంది. ఉదాహరణకు, రోజువారీ అవసరాల సరుకులపై తగ్గింపు ఉంటే గృహ ఖర్చులు కొంత తగ్గుతాయి. మరోవైపు కారు, లగ్జరీ ఉత్పత్తులతో వంటి వస్తువులపై అధిక స్లాబ్ వర్తించి ప్రభుత్వ ఆదాయానికి తోడ్పడుతుంది.  

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న చారిత్రక సంస్కరణగా అభివర్ణించారు. జీఎస్టీ 2.0 ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పన్ను విధానాన్ని పారదర్శకంగా మార్చబోతుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య పాలసీలపై పన్ను మినహాయింపు సామాజిక సంక్షేమం కోసం తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం అని చెప్పారు.  

మొత్తం మీద ఈ కొత్త విధానం సాధారణ ప్రజలకు పన్నుల సరళీకరణ, ఖర్చుల తగ్గింపు, ఆరోగ్య భద్రత హామీ వంటి లాభాలను అందించనున్నది. నిపుణులు ఈ నిర్ణయాన్ని ఆర్థిక వ్యవస్థలో ఒక పాజిటివ్‌ అడుగుగా విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ 22 తో జీఎస్టీ 2.0 ప్రజల దైనందిన జీవితంలోకి ప్రవేశించనుంది.




#GST #GSTIndia #GSTUpdate #GST2025 #TaxReforms #IndirectTax #Finance #Business #Accounting #GSTCompliance #GSTR #Taxation #India #TaxUpdates #Economy

Monday, August 18, 2025

The Conspiracy Behind "Marwari Go Back"


The Secrets to Marwari Business Success: Why Don't We Learn from Them?

The Marwaris, who hail from Rajasthan's Mewar region, are not just businesspeople; their lives are a testament to discipline, unity, and a strong work ethic. The recent "Marwari Go Back" slogans have sparked a discussion on business values and self-respect in our country


A Unique Business Strategy

While a typical trader might invest 100 rupees, make a 2-rupee profit twice, and earn 4 rupees, the Marwaris rotate that same investment ten times. They make a 1-rupee profit on each rotation, ultimately earning 10 rupees. Their business philosophy isn't just about maximizing a single profit, but about increasing profits rapidly over time.

Based on analysis of their business experience, I've observed that many of us rely on credit from companies. Marwaris, however, make advance payments to secure a higher discount. A bigger discount means a bigger profit—a simple yet highly effective business strategy.

Prioritizing Tradition and Unity

The Marwaris' success is not limited to their financial strategies. The secrets to their success are hidden in their way of life. They allocate a portion of their earnings to cow protection and charitable activities. Despite any internal differences, they stand united in difficult times. They get involved in business from a young age and are constantly thinking about it. They never leave their work to others and are not hesitant to work as a clerk in their own business if needed.

Their family rules and customs are very strong, followed by everyone from a five-year-old child to an eighty-year-old elder. Respect for elders and adherence to traditions are part of their moral values. Children don't speak loudly in front of elders and don't walk past them. They respectfully bow to their elders' feet when they see them. The entire family is dedicated to the business. They don't rely on government welfare schemes but instead work hard to earn their own living. Their self-respect and patriotism are exceptionally high.

Is There a Political Conspiracy Behind "Marwari Go Back"?

Their proud saying, "Jahan jahan na pahuche bailgadi, wahan wahan pahuche Marwari" (Where even a bullock cart cannot reach, a Marwari can), signifies their hard work and courage. However, this article suggests that the "Marwari Go Back" slogan is a conspiracy by pro-Pakistan forces. It questions why no one criticizes those who do business in India while shouting "Pakistan Zindabad" but instead directs criticism at the hardworking Marwaris.

Here my warning is that if the Marwaris are driven away, pro-Pakistan groups could become a stronger economic force in the country, and the consequences of that would be unimaginable. It advises people to reflect on this situation, and instead of criticizing the Marwaris, to learn from their unity, discipline, hard work, and cultural values.



.
.
.
.
.
.
.
 #Marwari #Mewar #Rajasthan #Hyderabadi    #BusinessSuccess #Entrepreneurship #BusinessMindset #WorkEthic #BusinessStrategy #MarwariBusiness #IndianCulture #Traditions #FamilyValues #Unity #Discipline #IndianBusiness #SocialCommentary #Patriotism #India #MakeInIndia

Sunday, August 17, 2025

కిష్త్వార్‌లో తీరని విషాదం

హిమాలయాల్లో కన్నీళ్లు: కిష్త్వార్‌లో తీరని విషాదం
పశ్చిమ హిమాలయ పర్వతాల గుండెపై, కన్నీటి బిందువులు రాలుతున్నాయి.


మరపురాని గురువారం, అందమైన కిష్త్వార్‌లోని చిసోటి గ్రామంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వతాలు ఎప్పుడూ భక్తికి, మనశ్శాంతికి నెలవుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పర్వతాలు, ఆ కుటుంబాల కన్నీటితో తడుస్తున్నాయి. ఆకాశం నుండి కురిసింది వర్షం కాదు, అది ప్రకృతి కసి. ఒక క్లౌడ్‌బర్స్ట్, ప్రకృతి ఉగ్రరూపం. అది అకస్మాత్తుగా ఊరిపై విరుచుకుపడి, నీరు, మట్టి, నిరాశలను ఒక సుడిగుండంగా మార్చి, ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా గాయపర్చింది.

ప్రతి సంవత్సరం జరిగే శ్రీ మచ్చీల్ మాతా యాత్ర, భక్తికి, నమ్మకానికి ప్రతీక. కానీ ఈసారి అది ఒక పీడకలగా మారింది. భక్తులు తమ హృదయాలను భక్తితో నింపుకొని, సమానత్వం, స్నేహం, ఆధ్యాత్మికతలకు ప్రతీక అయిన ఒక లంగర్ (సామూహిక భోజనశాల)లో కూర్చున్నారు. కానీ ఆ క్షణంలో వారి ప్రార్థనలు హాహాకారాలుగా మారాయి. స్నేహాలు, ఆప్యాయతలు, ఆ వరద ఉగ్రరూపానికి ముక్కలయ్యాయి. భూమి కూడా వణికిపోయినట్లు అనిపించింది. ఇళ్ళు, ఆశలు, ప్రాణాలు కూడా క్షణాల్లో లోపలికి లాగేసుకుంది.

మృతులు, గాయపడ్డవారి సంఖ్యలను గురించి మాట్లాడటం, ఈ విషాదం ముందు ఒక చిన్న విషయం. ప్రతి సంఖ్య వెనక ఒక కథ ఉంది. చిన్నతనంలోనే ఆరిపోయిన ఒక ప్రాణం. శాశ్వతంగా చీలిపోయిన ఒక కుటుంబం. చివరి క్షణాల్లో వారి గుండెల్లోని భయాన్ని, నిస్సహాయతను మనం ఊహించుకోగలం. వారి గట్టిగా చేసే ప్రార్థనలు నీటి గలగలా శబ్దంలో కలిసిపోయి ఉంటాయి.

ఈ విషాదం కేవలం ఒక చిన్న సంఘటన కాదు. హిమాలయాల పెళుసైన భూభాగం, కొండచరియల పతనాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా అసాధారణ వాతావరణం, హఠాత్తుగా కురిసే వర్షాల తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చాలా కాలం నుండి హెచ్చరిస్తున్నారు. అటవీ నిర్మూలన, ప్రణాళిక లేని అభివృద్ధి, భూమికి సహజ రక్షణను తగ్గిస్తున్నాయి. ఫలితంగా, ఇలాంటి విపత్తులు మరింత తీవ్రంగా మారి, భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.

ఈ భౌగోళిక హెచ్చరికలను మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. కిష్త్వార్ లో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తుపెట్టుకొని, మనం హిమాలయాల్లో నిలకడైన అభివృద్ధి విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. అటవీ సంరక్షణ, నిర్మాణాలపై కఠినమైన నియమాలు, ముందస్తు హెచ్చరికల వ్యవస్థల ఏర్పాటు చాలా ముఖ్యం. ఇది కేవలం సలహా మాత్రమే కాదు, ఈ పర్వతాలపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇది అత్యవసరం.

కిష్త్వార్ కోసం మనం రాల్చే కన్నీళ్లు కేవలం దుఃఖానికి మాత్రమే పరిమితం కాకుండా, మార్పుకు ఒక ప్రేరణ కావాలి. ఈ విషాదం మన విధానాలు, చర్యలలో ప్రతిధ్వనించాలి. హిమాలయాల గుండెల్లో ఇలాంటి విషాదం మళ్లీ జరగకుండా మనం చూసుకోవాలి. మరణించిన ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఈ ప్రాంతంలో జీవితాన్ని పునర్నిర్మించుకునే వారికి మన మద్దతు, సహకారం ఇవ్వాలి.





.
.
.
.
#KishtwarTragedy #HimalayanCrisis #Cloudburst #JammuAndKashmir #Kishtwar #NaturalDisaster #ClimateChange #PrayForKishtwar #HimalayanWarnings #FlashFloods #MachailMataYatra


Tuesday, August 12, 2025

ఉచిత తిరుపతి బాలాజీ దర్శనం.

65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం

 "ఉచిత తిరుపతి బాలాజీ దర్శనం."


తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలనుకునే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త.

65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రెండు ప్రత్యేక ఉచిత దర్శన స్థలాలు కేటాయించబడ్డాయి:

ఉదయం 10:00

మధ్యాహ్నం 3:00

మీరు S-1 కౌంటర్ వద్ద ఫోటో ID మరియు వయస్సు రుజువును సమర్పించాలి.

మార్గదర్శకాలు:

వంతెన క్రింద ఉన్న గ్యాలరీ ద్వారా ఆలయం యొక్క కుడి వైపు గోడకు వెళ్లండి.

ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.

సాగు స్థలం అందుబాటులో ఉంది.

దర్శనం తర్వాత, మీకు ఉచితంగా వేడి సాంబార్ బియ్యం, పెరుగు బియ్యం మరియు వేడి పాలు అందించబడతాయి.

సౌకర్యం కోసం బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి, నిష్క్రమణ గేటు వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వరకు మిమ్మల్ని రవాణా చేస్తాయి.

ఎటువంటి బలవంతం లేదా ఒత్తిడి ఉండదు — దర్శనం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించబడింది.

దర్శన క్యూలో ఒకసారి, మీరు మీ దర్శనం మరియు నిష్క్రమణను కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.

TTD తిరుమల హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్: 8772277777

ప్రత్యేక అభ్యర్థన: దయచేసి ఈ సమాచారాన్ని ఇతర గ్రూపులతో కూడా షేర్ చేయండి.

.
.
.
.
.
.
.
.
.
.

#TTD #Tirumala #TirumalaDarshan #Tirupati #Balaji #VenkateswaraSwamy #LordBalaji #TirumalaTemple #TTDDarshan #SrivariDarshan #TTDSeniorCitizensDarshan #TirumalaSeniorCitizens #SeniorCitizensDarshan #TTDInstructions #TirumalaDarshanRules

The Lord on the Lotus Hill: A Journey to Tanapalli Subramanya Swamy Temple

The Tanapalli Subramanya Swamy Temple, also known as Sree Balagnana Dhandayudhapaani Swamy Temple, has a relatively recent history. It is situated on a hill named Sri Padmagiri, which is shaped like a lotus, in the village of Tanapalli near Tirupati.



According to temple legends, the temple's founder, Sri Ganapathi Swamy, had a dream of Lord Subramanyam Swamy on the hill when he was 15 years old. He then went to the hill and, after hearing the Subramanya Swamy mantra from a small cave, performed intense penance for several years. He received the blessings of Lord Subramanya Swamy, named the hill Sree Padmagiri, and established Guhaanandhapeetam. He initially worshipped the Lord in the form of a yantra.



In 1979, Sri Ganapathi Swamy used his own funds to consecrate and install the idol of Sri Balagnana Dhandayudhapaani Swamy, which is a unique representation of Subramanya Swamy in his Brahmachari (celibate) form. The idol is also said to stand on a shatkona yantra peetam (a six-pointed star). This makes it the only temple in Andhra Pradesh with this specific form of the deity.

Since its establishment, the temple's rituals and management have been overseen by the hereditary lineage of Sri Ganapathi Swamy. In 2006, he passed on the sacred mantra and the responsibility of the yantra to his son, Sri Shanmugha Swamy.

Source: The history of the Tanapalli Subramanya Swamy Temple is primarily based on temple legends and narratives found on various online platforms, including temple-related websites and local information portals.

A key source of information is the temple's own description on websites such as "Our Temples," which details the story of its founder, Sri Ganapathi Swamy, and the circumstances of the temple's establishment. These sources provide the founding year (1979) and describe the unique form of the deity.

It's important to note that the history is rooted in the devotional accounts and experiences of the temple's founder and subsequent generations, and not from a documented historical or archaeological record in the same way as ancient temples might have.

.
.
.
.
.
.
.
.
.
#SubramanyaSwamy #LordMurugan #Dhandayuthapani #HinduTemple #Devotional #AndhraPradeshTemples #Tirupati #Pilgrimage #TanapalliTemple #BalagnanaDhandayuthapaniSwamy #SriPadmagiri #TirupatiTemples #GanapathiSwamy #ShankonaYantra #UniqueTemple #SpiritualJourney #DivineBlessings #TempleHistory #IndianCulture #Faith #Inspiration #PeaceAndSerenity

Friday, August 8, 2025

ఆశకు ప్రతిరూపం: లక్ష్మి కథ

సముద్ర మథనం నుండి మన హృదయం వరకు, మన మనసులోని వెలుగు, ఆశకు ప్రతిరూపం: లక్ష్మి కథ
నేను ఒక దేవత గురించి ఒక కథ చెబుతాను. ఆమె కేవలం ఒక దేవత కాదు, ఈ సృష్టిలోని సంపదను తన హృదయంలో దాచుకున్న లక్ష్మీదేవి గురించి. ఇది దూరంగా, మనకు అందుబాటులో లేని ఒక దేవత కథ కాదు, ఇది ఒక తల్లి, ఒక ప్రేయసి, ఒక వాగ్దానం యొక్క కథ. ఈ కథ మీకు ఇప్పటికే మీ అంతరాత్మలో తెలుసు, బహుశా మీరు దానిని మర్చిపోయి ఉండవచ్చు.

ఒకప్పుడు, గొప్ప చీకటి కాలం ఉండేది. దేవతలు కష్టాల్లో ఉండి, వారి తేజస్సు మసకబారిపోతోంది. వారు తమ శక్తిని, ఐశ్వర్యాన్ని, ఆశను కోల్పోయారు. నిస్సహాయంగా వారు సృష్టికి రక్షకుడైన విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడు ఆయన వారికి విముక్తి మార్గం చూపారు - అదే పాల సముద్రాన్ని మధించడం. అది ఒక గొప్ప కార్యం, శత్రువులైన అసురులతో కలిసి అపారమైన ప్రయత్నం చేయాలి. ఆ మధనంలో, ఆ అంతులేని సముద్రం నుండి, ఒక అద్భుతమైన అందం ఉద్భవించింది.

మొదట జీవితంలోని చేదు సవాళ్ల లాంటి విషాలు వచ్చాయి. ఆ తరువాత అద్భుతాలు - కామధేనువు, కల్పవృక్షం, అమృతం. చివరికి, ఆమె వచ్చింది. వికసించిన పద్మంపై నిలబడి, అసాధారణమైన అందంతో కూడిన ఒక దివ్య రూపం. ఆమె కళ్లు కరుణతో నిండి ఉన్నాయి, ఆమె చేతులు సంపద, అదృష్టాన్ని వాగ్దానం చేశాయి, ఆమె హృదయం స్వచ్ఛమైన బంగారం. ఆమెయే లక్ష్మి.

ఆమె రాక కేవలం సంపదకు చిహ్నం కాదు; అది అచంచలమైన నమ్మకానికి నిదర్శనం. విషాలు, కష్టాలే కనిపించినా, దేవతలు ఒక గొప్ప మంచికోసం ఆ ప్రక్రియను నమ్మారు. వారు తాము నడిచే మార్గంలో ఏదో అందమైనది తమకోసం ఎదురుచూస్తోందని నమ్మారు.

లక్ష్మి కథ మన కథే. మన జీవితంలో చీకటి క్షణాల్లో, మన సొంత కష్టాల సముద్రాన్ని మధించినప్పుడు, ఏదో ఒక దివ్యమైన శక్తి ఉద్భవించడానికి సిద్ధంగా ఉందని నమ్మే ప్రయాణం ఇది. ఆమె ఉనికి కేవలం బంగారం, ఆభరణాలలోనే కాదని, మనం చేసే ప్రతి చిన్న సహాయంలో, కృతజ్ఞతతో కూడిన ప్రతి క్షణంలో, మనం తీసుకునే ప్రతి నమ్మకపు అడుగులో ఉందని గుర్తుంచుకోవాలి. ఆమె ముఖంపై పడే సూర్యరశ్మి, చెట్ల గుండా వీచే గాలి, ఒక చిన్నారి నవ్వులో ఉండే ఆనందం.

ఆమెకు శ్రీమన్నారాయణుడిపై ఉన్న ప్రేమ, ఈ నమ్మకానికి అత్యున్నత ఉదాహరణ. అది అంత లోతైన ప్రేమ, ఆమె ఎల్లప్పుడూ ఆయనతో, ఆయన హృదయంలో, ఆయన పక్కనే ఉంటుంది. మనకు నమ్మకం ఉన్నప్పుడు, మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండమని అది మనకు గుర్తు చేస్తుంది.

కాబట్టి, మీకు సందేహం కలిగినప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించి, మీ జీవితంలో వెలుగు మసకబారుతున్నట్లు అనిపించినప్పుడు, మీ కళ్లు మూసుకోండి. ఆమె దివ్యమైన సముద్రం నుండి, తేజస్సుతో, ప్రశాంతంగా వస్తున్నట్లు ఊహించుకోండి. ఆమె కేవలం అదృష్టాన్ని ఇచ్చేది కాదు; ఆమె ఆశకు ప్రతిరూపం. ఆమె మీకు ఏమి ఇవ్వగలదో దానికోసం మాత్రమే కాదు, మీలో ఆమె ఏమి మేల్కొలపగలదో దానికోసం ఆమెను నమ్మండి. ఎందుకంటే ఆమె నిజమైన బహుమతి, మీరు ఎల్లప్పుడూ ఆమె ప్రతిబింబించే దివ్యమైన సంపదలో భాగమేనని అర్థం చేసుకోవడమే. మీరు కేవలం నమ్మాలి అంతే.

(రచన: కాయల సాయి నవీన) ఈ కథ మన పురాణాలలో లక్ష్మీదేవి గురించి చెప్పిన విషయాల నుండి ప్రేరణ పొంది, ఒక భక్తిపూర్వకమైన మరియు సృజనాత్మకమైన కథగా రచించబడింది. ఇది పవిత్ర గ్రంథాలైన విష్ణు పురాణం మరియు మహాభారతంలోని ప్రధాన ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని రాసినదే కానీ, ఏ ఒక్క గ్రంథం నుండి అక్షరాలా అనువదించినది కాదు.





.
.
.
.
.
#VaralakshmiVratham #SilverPujaSet #Shravanamasam #TraditionalElegance #DivineCelebration #PujaEssentials #FestiveVibes #LakshmiPuja #SilverGrace #Sravanasukravaram #CelebrateTradition

Monday, June 30, 2025

సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.

సృష్టి రహస్య విశేషాలు
సృష్టి  ఎలా  ఏర్పడ్డది
సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది
మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి


( సృష్ఠి )  ఆవిర్బావము 

1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాదం
4  నాదం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  అగ్ని యందు జలం
16  జలం యందు పృద్వీ.
17 పృద్వీ యందు ఓషధులు
18  ఓషదుల వలన అన్నం
19  ఈ అన్నము వల్ల నర మృగ  పశు  పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

( సృష్ఠి ) కాల చక్రం

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు  ఏంతోమంది విష్ణువులు  ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి . 
1000 యుగాలకు ఒక రాత్రి  ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.

సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది

అన్ని  జీవులలో మూడే గుణములు ఉంటాయి

1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

( పంచ భూతలు  )

1  ఆకాశం
2 వాయువు
3  అగ్ని
4  జలం
5  భూమి 
.
5  ఙ్ఞానింద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

 ఆకాశ పంచికరణంలు

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( అహంకారం ) పుడుతున్నాయి

వాయువు పంచికరణంలు

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

అగ్ని పంచికరణములు

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టేను.

 జలం పంచికరణంలు

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టేను.

 భూమి పంచికరణంలు

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టేను.

( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానింద్రియంలు

1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.

5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు

5  ( పంచ ప్రాణంలు )
,
1  అపాన
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన

5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మఇంద్రియంలు )
,
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం
.
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం

6  (  అరిషడ్వర్గంలు  )
,
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మచ్చార్యం

3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం
.
3  (  అవస్తలు  )

1  జాగ్రదవస్త
2  స్వప్నవస్త
3  సుషుప్తి అవస్త
.
6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరిణమించుట
5  క్షిణించుట
6  నశించుట

6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం

3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞాడు

3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు

5  (  కర్మలు  )

1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద

3  (  గుణంలు  )

1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప
2  అధ్యాసాయం
3  అభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష

10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )
      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి

14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  అగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు

10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ

10  (  వాయువులు  )

1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యానా

6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ

7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం

(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగళంలు
8  జానల పొడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  మురల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం

(  మానవ దేహంలో 14 లోకలు  )  పైలోకలు 7

1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో
7  సత్యలోకం  -  లాలాటంలో

అధోలోకలు  7

1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకల్లలో
6  మహతలం  -  తోడల్లో
7  పాతాళం  -  పాయువుల్లో

(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చేమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షిర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు

(  పంచాగ్నులు  )

1  కాలగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభీలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో

7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబు ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుప
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వేంట్రుకల్లో

10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం

Friday, June 27, 2025

Kolkata Law College Gang Rape

సౌత్ కోల్‌కతా లా కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన, పశ్చిమ బెంగాల్‌లోని విద్యా సంస్థలలో మరియు విస్తృత సమాజంలో మహిళల భద్రతను నిర్ధారించడంలో ఉన్న నిరంతర సవాళ్లకు ఒక తీవ్రమైన గుర్తు.


ఈ దాడి యొక్క పథకం ప్రకారం జరిగిన స్వభావం, బాధితురాలు అనుభవించిన సుదీర్ఘ చిత్రహింసలు, మరియు రాజకీయ సంబంధాలున్న వ్యక్తులచే అధికారాన్ని దుర్వినియోగం చేయడం లోతైన వ్యవస్థాగత సమస్యలను సూచిస్తుంది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాపై గతంలో ఆరోపించబడిన దుష్ప్రవర్తన చరిత్ర, మరియు రాజకీయ సంబంధాలున్న పాలకమండలిచే అతని తాత్కాలిక సిబ్బంది నియామకం ఉన్నప్పటికీ కళాశాలలో అతని నిరంతర ప్రభావం, సంస్థాగత జవాబుదారీతనంలో గణనీయమైన లోపాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితి రాజకీయ ఆశ్రయం శిక్షార్హత లేని సంస్కృతికి ఎలా దోహదపడుతుందో సూచిస్తుంది, ఇక్కడ సంబంధాలున్న వ్యక్తులు చట్టపరమైన పరిణామాల నుండి రక్షణ కవచంతో పనిచేయగలరు, తద్వారా క్యాంపస్ రాజకీయ నిర్మాణాలలో నేరపూరిత ప్రవర్తనను సాధారణీకరిస్తారు.

తక్షణ అరెస్టుల పరంగా పోలీసుల స్పందన వేగంగా ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో బాధితులకు మద్దతు మరియు న్యాయ సంస్కరణల విస్తృత వ్యవస్థలో గుర్తించదగిన అంతరాలు ఉన్నాయి. రాష్ట్రంలో వన్ స్టాప్ సెంటర్‌లు స్పష్టంగా పనిచేయకపోవడం, వాటి జాతీయ ఆదేశం ఉన్నప్పటికీ, లింగ-ఆధారిత హింస బాధితులకు సమగ్ర మద్దతును అందించడంలో ఒక కీలకమైన లోపాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుత బాధితుల పరిహార పథకం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ మొత్తాలను అందిస్తుంది, సమగ్ర బాధితుల పునరావాసం పట్ల రాష్ట్ర నిబద్ధతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత యాంటీ-రేప్ బిల్లు, లైంగిక నేరాలకు కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టడానికి మరియు న్యాయాన్ని వేగవంతం చేయడానికి ఒక శాసన ప్రయత్నాన్ని సూచిస్తుంది. అయితే, ఇతర రాష్ట్రాల నుండి ఇలాంటి బిల్లులను ప్రతిబింబిస్తూ, రాష్ట్రపతి ఆమోదం కోసం దాని సుదీర్ఘ నిరీక్షణ, కేంద్ర చట్టాలతో అతివ్యాప్తి చెందే రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను అమలు చేయడంలో ఉన్న సంక్లిష్టతలను మరియు సంభావ్య రాజకీయ అడ్డంకులను హైలైట్ చేస్తుంది.

అంతిమంగా, అటువంటి దారుణాలను పరిష్కరించడానికి తక్షణ అరెస్టులకు మించిన బహుముఖ విధానం అవసరం. దీనికి క్యాంపస్ భద్రతా ప్రోటోకాల్‌లను సమగ్రంగా పునరుద్ధరించడం, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై జవాబుదారీతనం చర్యలను కఠినంగా అమలు చేయడం, విద్యా సంస్థలను రాజకీయీకరణ నుండి దూరం చేయడం, మరియు బాధితులకు మద్దతు మరియు పరిహార యంత్రాంగాలను గణనీయంగా బలోపేతం చేయడం అవసరం. పశ్చిమ బెంగాల్‌లో అటువంటి సంఘటనలు పునరావృతమవుతున్న స్వభావం, మహిళలకు నిజంగా సురక్షితమైన మరియు న్యాయమైన వాతావరణాన్ని పెంపొందించడానికి అన్ని వాటాదారుల నుండి సమగ్రమైన మరియు నిరంతర నిబద్ధత యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది.

Wednesday, May 28, 2025

ప్రముఖ వాగ్గేయ కారులు(అతి సంక్షిప్త పరిచయం)

ప్రముఖ వాగ్గేయ కారులు
(అతి సంక్షిప్త పరిచయం)



జయదేవుడు (1101-1153)
'గీతగోవిందము' అను సంగీత   గ్రంథమును సంస్కృత భాషలో రచించిన ప్రథమ వాగ్గేయకారుడు.'జయదేవ'ముద్రతో ఇతను రచించిన సంగీత కృతులు 'అష్టపదులు'గా ప్రసిద్ధి చెందినవి.

పురందరదాసు (1484-1564)
తన ఇష్టదైవమగు పండరీపుర విఠలునిపై
వేలాది,సంగీత కృతులను కన్నడ భాషలో రచించారు. 'దేవరనామాలు' అను పేరుతోప్రఖ్యాతిగాంచిన ఈతని కృతులు 'పురందరవిఠల' ముద్రతో ఉన్నాయి.

అన్నమాచార్యులు (1408-1503)
తన ఇష్టదైవమైన  తిరుపతి,శ్రీవేంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలను రచించారు.ఈ కీర్తనలు 'వేంకటేశ' ముద్రతో సాగుతుంది.'ఆంధ్ర పద కవితా పితామహుడు' గా ప్రఖ్యాతి చెందినారు.

భక్త రామదాసు (1620-1680)
ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న.తన ఆరాధ్య దైవమగు శ్రీరామునిపై 'రామదాసు' ముద్రతో అనేక కీర్తనలను రచించారు.

క్షేత్రయ్య (1610-1685)
ఇతని అసలు పేరు వరదయ్య. అనేక క్షేత్రములను సందర్శించడం వలన క్షేత్రయ్యగా పిలువబడినారు.
తన ఇష్టదైవమగు గోపాలస్వామి పేర 'మువ్వగోపాల' ముద్రతో పెక్కు సంగీత కృతులు రచించారు.

శ్యామశాస్త్రి (1762-1827)
అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యం. 
ఆంధ్రులైన సంగీతత్రయంలో మూడవవారు.
త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికులు. 'శ్యామకృష్ణ' ముద్రతో సంగీత కృతులు రచించారు.

త్యాగరాజు(1767-1847)
కాకర్ల త్యాగరాజు 'సంగీతరత్నత్రయము' గా, ప్రసిద్ధి గాంచిన వారిలో అగ్రగణ్యుడు. తన ఇష్టదైవమైనశ్రీరామునిపై,అపారమైన భక్తితో 24 వేల కీర్తనలను రాసారు.

ముత్తుస్వామి దీక్షితులు(1776-1835)
'సంగీతరత్నత్రయం'లో రెండవ వారు.
'గురుగుహ' ముద్రతో సంస్కృత భాషలోవీరు కృతులు రచించారు.

స్వాతితిరునాళ్(1813-1846)
తిరువాన్కూరు(కేరళ) సంస్థానమునకు ప్రభువు.
బహుభాషా పాండిత్యమునకుతోడు, సంగీతంములోనూ విశేష ప్రజ్ఞా వంతులు. మళయాళము, తమిళము, సంస్కృతము, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడము , తెలుగు వంటి ఎనిమిది భాషలలో 'పద్మనాభ' ముద్రతో సంగీత కృతులను రచించారు.

నారాయణ తీర్థులు (17వ శతాబ్దము)
ఇతని అసలు పేరు తల్లావఝల శివశంకరశాస్త్రి. తన ఆరాధ్య దైవమగుశ్రీకృష్ణుని లీలావినోదములను 'కృష్ణ లీలా తరంగిణి' అను సంగీత గ్రంథమున విపులంగా  వర్ణిస్తూ కీర్తనలను రాసారు.
ఇవి 'తరంగములు' అను పేర ప్రసిద్ధి చెందినవి.

Monday, March 6, 2023

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు
..


మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది .అని కొన్ని గుళ్ళలో వ్రాసి వుంటారు.
హుండీ ఎవరు తెరుస్తారు ? ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి ! ఆయనెవరు ? ప్రభుత్వప్రతినిధి ! .
అంటే భక్తుడు ప్రభుత్వముద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట! 
సరే ! మరి పూజారి ఎవరు ?
పొద్దున్నే తెల్లవారుఝామునే లేచి భగవంతుడికి మేలుకొలుపులు పాడి ! (దేవుడికంటే ముందే మేలుకొంటున్నాడన్నమాట!!!!!!)
ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తులమదిలో ఒక అలౌకికపవిత్రభావనకలిగేటట్లు అలంకారాలు పూర్తిచేసి ఆయనను అష్టోత్తరాలు ,సహస్రాలతో పొగిడి ,స్వామీ ! నీ దర్శనానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రీ అని చెప్పి ! వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసే భగవంతుడి బంట్రోతు! ...
మరి ఆయన జీతమెంత ? చాలాచాలా తక్కువ ! బ్రతుకు జట్కాబండి ఈడ్వలేనంత!.
పూజారా ! మేము పిల్లనివ్వం ! అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో !!కట్టుకున్నదానికి కన్నపిల్లలకు న్యాయం చేయలేక బ్రతుకీడుస్తున్న వారు ఎందరో ! కోకొల్లలు!
వారిపట్ల మనకు ఏ బాధ్యతాలేదా?.
మన కుటుంబాలు కార్లలో తిరగాలి ! మన కుటుంబీకులు ఖరీదయిన దుస్తులు వేసుకోవాలి ! విహారయాత్రలకు వెళ్ళాలి ! అందుకు సంపాదన కావాలి ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం ! ఆ దేవుడికి కమీషన్లు ఇస్తాం !.
కానీ ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోము ! ఇదెక్కడి న్యాయం!
నా విన్నపం ఏమిటంటే ! హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేటులో మాత్రం కానుక వెయ్యండి !
కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియచేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు !
ఉదాత్తానుదాత్తస్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితుడు చేసే పూజలు అరుదుగా చూస్తున్నాం!, ఈ రోజు చాలా గుడులలో అపస్వరంతో మంత్రాలు పఠిస్తూ జరిగే పూజలే ఎక్కువ! .
ఆ వృత్తిలో ఆదాయం వస్తే మేధావులు వస్తారు సలక్షణంగా పూజలు జరుగుతాయి ! 
మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా ! పడగొట్టడమా ! ఆలోచించండి

Friday, October 28, 2022

నాగులచవితీ / నాగచతుర్థీ

ॐ 29/10/22 నాగులచవితీ / నాగచతుర్థీ

నాగుల చవితి విశిష్టత 
కార్తీక శుక్ల పక్ష చవితిని ”నాగుల చవితి” అని పిలుస్తారు. ఇది సర్పపూజకు ఉద్దిష్టమైన దినం. కార్తీక శుద్ధ చవితినాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతున్నది. శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యంలో ఇలా వర్ణింపబడినది.

”చలి ప్రవేశించు నాగుల చవితి నాడు,
మెరయు వేసవి రథసప్తమీ దివసమున,
అచ్చ సీతు ప్రవేశించి బెచ్చు పెరిగి,
మార్గశిర పౌష మాసాల మధ్యవేళ.”

ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.

జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

Wednesday, October 26, 2022

కార్తీక మాసం 30 రోజులు - నిషిద్ధములు - దానం - పూజించవలసిన దైవం - జపించవలసిన మంత్రం

*#కార్తీక #మాసం 30 రోజులు - #నిషిద్ధములు - #దానం- #పూజించవలసిన #దైవం - #జపించవలసిన #మంత్రం*
*👉1వ రోజు:*
నిషిద్ధములు:-
ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు
దానములు:-
నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము:-
స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము:-
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా

*👉2వ రోజు:*
నిషిద్ధములు:-
తరగబడిన వస్తువులు
దానములు:-
కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము:-
బ్రహ్మ
జపించాల్సిన మంత్రము:-
ఓం గీష్పతయే - విరించియే స్వాహా

*👉3వ రోజు:*
నిషిద్ధములు:- 
ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు:- ఉప్పు
పూజించాల్సిన దైవము:- పార్వతి
జపించాల్సిన మంత్రము:- 
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా

*👉4వ రోజు:*
నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి
దానములు:- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన 
మంత్రము:-
ఓం గం గణపతయే స్వాహా

*👉5వ రోజు:*
నిషిద్ధములు:- పులుపుతో కూడినవి
దానములు:- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:- 
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)

*👉6వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి
దానములు:- చిమ్మిలి
పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన 
మంత్రము:-
ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా

*👉7వ రోజు:*
నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం. భాం. భానవే స్వాహా

*👉8 వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు:- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దుర్గ
జపించాల్సిన మంత్రము:- 
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

*👉9వ రోజు:*
నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- 
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః

*👉10వ రోజు:*
నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము:-
ఓం మహామదేభాయ స్వాహా

*👉11వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, ఉసిరి
దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము:- శివుడు
జపించాల్సిన మంత్రము:- 
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

*👉12వ రోజు:*
నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

*👉13వ రోజు:*
నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి
దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము:- మన్మధుడు
జపించాల్సిన మంత్రము:- 
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

*👉14వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము:- యముడు
జపించాల్సిన మంత్రము:-
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

*👉15వ రోజు:*
నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు
దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు 
జపించవలసిన మంత్రం:-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'


*👉16వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల
దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

*👉17వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు:- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

*👉18వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి
దానములు:- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము:- గౌరి
జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా

*👉19వ రోజు:*
నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు:- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము:- వినాయకుడు
జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

*👉20వ రోజు:*
నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి
దానములు:- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

*👉21వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు:- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము:- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

*👉22వ రోజు:*
నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన 
మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

*👉23వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి, తులసి
దానములు:- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:- 
ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

*👉24వ రోజు:*
నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము:- 
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా

*👉25వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు:- యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము:- 
ఓం ఈశావాస్యాయ స్వాహా

*👉26వ రోజు:*
నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు
దానములు:- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము:- కుబేరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

*👉27వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

*👉28వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ
దానములు:- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- ధర్ముడు
జపించాల్సిన 
మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

*👉29వ రోజు:*
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

*👉30వ రోజు:*
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

Monday, September 5, 2022

ఇంతకన్నా గొప్పగా నేనేమి చెప్పగలను ?
****************************
పొరుగువాడిని 
ప్రవాసాంధ్రుడిని
తమిళదేశంలో వున్నవాడిని
మీకన్న గొప్పగా నేనేమి చెప్పగలను
కాని
తెలుగు గొప్పతనాన్ని
తెలుగేతరులే గొప్పగా చెప్పారు
పోని పెద్దలేం చెప్పారో చెప్పనా
ఆంధ్ర దేశంలో పుట్టడం అందునా తెలుగు వాడిగా పుట్టడం 
పూర్వ జన్మ సుకృతం -అప్పయ్య దీక్షితులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు
మా తెలుగు తల్లివి - శంకరంబాడి
ఇంతకన్నా చెప్పగలనా నేను

తెలుగదేలన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ ,తెలుగొకొండ
ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు
ఇంతకన్నా చెప్పగలనా నేను

తరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు
పునుగు జవ్వాజి ఆమని పూలవలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్మ మా తెలుగుభాష -నండూరి రామకృష్ణమాచార్యులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

భాషలొక పదితెలిసిన ప్రభువు చూచి
భాషయనిన ఇద్దియని చెప్పబడిన భాష
-కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ
ఇంతకన్నాగొప్పగా చెప్పగలనా నేను

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? - కాళోజి
ఇంతకన్నా గొప్పగా చెప్పగలనా నేను

ఇంతమంది చెపుతూనే వున్నారు
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి
వినకుండా 
తల్లి భాషను చంపెయ్యడం
తగదు మనకు
కడుపులో వున్న శిశువును తెలిసి తెలిసి చంపేస్తామే దానికి సమం.
ఆ పాపానికి ఒడిగట్టకండి.
మన భాష మనకి తెలియడం
మన ప్రధమ కర్తవ్యం
  -గోటేటి వెంకటేశ్వరరావు

Tuesday, August 16, 2022

బలరామ జననం

బలరామ జననం
ఆగస్టు 17 బుధవారం బలరామ జననం సందర్భంగా

బలరాముడు అనగానే నాగలిని ఆయుధంగా ధరించిన బలమైన రూపంతో మనకు గోచరిస్తాడు. బలరాముడు శ్రీకృష్ణుడికి అగ్రజుడు. విష్ణుమూర్తి దశావతారాల్లోని బలరాముడు కూడా ఒక అవతారమని చెబుతారు. చివరి వరకు శ్రీకృష్ణుని వెన్నంటి ఉంటూ ఆ అవతార ప్రయోజనం సిద్ధించడానికి కృషిచేసాడు. శ్రావణ బహుళ షష్ఠి తిథిన బలరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. బలరాముని ఆయుధం హలం కనుక ఈ రోజును హలషస్తే అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో భాద్రపద తదియ రోజున బలరాముని జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమ రోజున, అక్షరతృతీయ రోజున కూడా బలరామ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.

బలరాముడు వసుదేవుని కొడుకు. శ్రీకృష్ణుని సోదరునిగా, అవతరించాడు. ఆదిశేషుడే బలరామునిగా అవతరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈయనకి మరో పేరు సంకర్షణుడు. అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భంలోకి లాగబడినవాడు. అని అర్థం. దేవకీ, వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపివేస్తుంటే, దేవకి ఏడో గర్భాన జన్మించవలసిన బలరాముడు విష్ణుమూర్తి ఆదేశంతో, యోగమాయ సహాయంతో ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి వెళ్తాడు. ఆ కాలంలోనే గర్భమార్పిడి పద్ధతి జరిగిందనేది ఆధునికులు గమనించాలి.

దుష్టశిక్షణలో శ్రీకృష్ణుని వెంటే ఉన్నాడు బలరాముడు. బలరాముడు అతి బలవంతుడు. గదాయుద్ధంలో ఆయనకు సాటిఎవరూ లేరు. బలరాముణ్ణి ప్రకృతి తత్త్వంగా చెప్తారు. నాగలితో దున్నిన భూమి నుండి వచ్చిన ఆహారంతో సమస్త జీవరాసులను ఈ ప్రకృతి పోషిస్తుందన్న దానికి సంకేతం ఆయన ఆయుధం. భీముడు, దుర్యోధనుడు ఆయన వద్దనే గదాయుద్ధం నేర్చుకున్నారు. బలరాముడు ఎప్పుడూ నీలంరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడని, అయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుందని కొన్ని పురాణాలు వర్ణించాయి. బలరాముడు కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.

ప్రకృతి భగవానుని కంటే వేరుగా కనిపించినప్పటికీ విరుద్ధంగా ప్రవర్తించదు. ఆయన ఆదేశాలకు లోబడే పనిచేస్తుంది. బలరాముడు శ్రీకృష్ణునితో విభేదించినట్లు కనబడినప్పటికీ అసలు ధర్మసూక్ష్మం ఏమిటో మనకు తెలియబరుస్తాడే తప్ప నిజానికి అది విభేదం కాదు. బలరాముడి సాహసం, పరాక్రమం తెలియచెప్పే సంఘటనలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కుమార్తెయైన లక్ష్మణను. స్వయంవరం నుంచి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, కౌరవ సైన్యం సాంబుని బంధింస్తారు. ఈ విషయం తెలిసిన యాదవులు, దుర్యోధనుని సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తారు. కానీ బలరాముడు వారిని వారించి తానొక్కడే కొద్దిపాటి సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. తన పరాక్రమం చూపిస్తూ తన హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు. ఆ దెబ్బకి హస్తినలో కొంతభాగం యమునలో పడింది. ఇప్పటికీ హస్తినలో (ఢిల్లీ) లోని దక్షిణ భాగం ఒక వైపుకి ఒరిగి ఉందంటారు.

భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అలా వింధ్యపర్వత ప్రాంతాలు, దండకారణ్యాన్ని దాటి బలరాముడు తన యాత్ర కొనసాగిస్తున్నాడు. ఓ ప్రాంతంలో ప్రజలంతా కరువు కాటకాలతో తిండి దొరకక విలవిలలాడుతున్నారు. దానికితోడు ప్రలంబసూతి అనే రాక్ష సుడు, అక్కడి ప్రజలను విపరీతంగా వేధిస్తున్నాడు. ఆ రాక్షసుని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా? అని ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో బలరాముడు అక్కడకు చేరుకున్నాడు. ప్రజల బాధలు విని తన హలంతో బలరాముడు ఆ రాక్షసున్ని అంతం చేశాడు. అనంతరం ఆ నాగలిని భూమిపై బలంగా నాటాడు. ఆయన నాగలిని నాటినచోట ఒక జలధార ఉద్భవించి, నాగావళిగా పేరొందింది. అనంతరం బలరాముడు, ఆ నాగావళి నది పక్కనే ఒక మహాలింగాన్ని ప్రతిష్ఠించి, దానికి రుద్రకోటేశ్వరుడని నామకరణం చేశాడు. బలరాముడు ప్రతిష్ఠించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మానవలే కాదు సకల దేవతలు కూడా అక్కడికి చేరుకున్నారని పురాణ కథనం.

Friday, August 5, 2022

చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు) 
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు 
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము.

సృష్టి రహస్య విశేషాలు

సృష్ఠి ఆవిర్బావము.
1  ముందు(పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల నర,  మృగ, పశు, పక్షి, వృక్ష, స్థావర జంగమాదులు పుట్టినవి.

సృష్ఠి కాల చక్రం
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతో మంది శివులు, ఎంతోమంది విష్ణువులు, ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1  సత్వ గుణం 
2  రజో గుణం
3  తమో గుణం

పంచ భూతంలు ఆవిర్భావం
1 ఆత్మ యందు ఆకాశం 
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5  ఙ్ఞానేంద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

1  ఆకాశ పంచికరణంలు
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల  ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల  ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల   (ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )
పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )
పుట్టెను.( మానవ దేహ తత్వం )

5  ఙ్ఞానేంద్రియంలు
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.

5 పంచ తన్మాత్రలు
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు

5  పంచ ప్రాణంలు
1  అపాన 
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన

5  అంతఃర ఇంద్రియంలు  
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం

5 కర్మేంద్రియంలు
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం

6  అరిషడ్వర్గంలు
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మాత్సర్యం

3  శరీరంలు
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం

3  అవస్తలు
1  జాగ్రదావస్త
2  స్వప్నావస్త
3  సుషుప్తి అవస్త

6  షడ్బావ వికారంలు 
1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరినమించుట
5  క్షిణించుట
6  నశించుట

6 షడ్ముర్ములు
1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

7  (కోశములు)  (సప్త ధాతువులు)
1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం

3 జీవి త్రయంలు
1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞుడు

3  కర్మత్రయంలు
1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు

5  కర్మలు
1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద

3  గుణంలు
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

9  (చతుష్ఠయములు)
1  సంకల్ప
2  అధ్యాసాయం
3  ఆభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష

10  (5 పంచభూతంలు పంచికరణ చేయనివి)
1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి

14  మంది  (అవస్థ దేవతలు)
1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  ఆగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు

10  ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ

10  వాయువులు
1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ

7  షట్ చక్రంలు
1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం

మనిషి  ప్రమాణంలు
96  అంగుళంలు
8  జానల పోడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  ముారల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం

(మానవ దేహంలో 14 లోకాలు)  పైలోకాలు 7
1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మాంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో
అధోలోకాలు  7
1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకాల్లలో
6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం - పాయువుల్లో
(మానవ దేహంలో  సప్త సముద్రంలు)
1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చెమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షీర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు

(పంచాగ్నులు)
1  కాలాగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభిలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో

7  (మానవ దేహంలో  సప్త  దీపంలు)
1  జంబుా ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుపైన
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో

10  (నాధంలు)
1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం

Thursday, August 4, 2022

తథాస్తు దేవతలు

తథాస్థు దేవతలంటే
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం.

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. 

కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది.

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...