Saturday, December 11, 2021

తిరుమల - టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం.

జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది.

కోవిడ్ నిభందనలు సడలిస్తే, పండుగ తరువాత సర్వదర్శనం పెంపు.

ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం.

11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్స నిర్వహించారు.

చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం.

పాలకమండలి సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు.

500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులకు కేటాయిస్తాం.

హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తాం. 

నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మిస్తాం.

భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చడానికి నిర్ణయం.

హిందు ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు.

వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తాం.

ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం.

2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు.

శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తాం.

తాళ్లపత్ర గ్రంధాలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తాం.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పిస్తాం.

భక్తులకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తాం.

కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాం.

3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు.

10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం.

12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం.

వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ

Tuesday, November 30, 2021

సహధర్మచారిణి

సనాతన ధర్మంలో భార్య అన్న పదానికి ఉన్న అనేక పదాలలో 'సహధర్మచారిణి' అన్నది విశిష్ట మైనది. 

ధర్మయుతమైన భర్త మార్గాన్ని అన్నివిధాలా తాను అనుసరించి అనుగమించేది అని అర్థంచెప్పుకోవచ్చు. పెళ్లి నాటి ప్రమాణాలు ప్రకారం ధర్మేచ ,అర్థేచ, కామేచ భార్యాభర్తలదిద్దరిదీ ఒకే మార్గం అయితే ఆ దాంపత్యం అన్యోన్య సుఖదాయకంగా ఉంటుంది. ఈ ఆదర్శాన్ని చాటి చెప్పడానికే బ్రహ్మాది దేవతలు తమ సతీమణులకు సగౌరవ స్ధానాలిచ్చి ఆదర్శమూర్తులయ్యారు. తన చతుర్ముఖాలలో  సరస్వతిని నిలిపాడు బ్రహ్మ దేవుడు.అంటే  విధాత రసనాగ్రసీమను (బ్రహ్మ నాలుకనే వేదికగా చేసుకొని) వాణి వేదవాణిగా లాస్యమాడింది. ఇక విష్ణుమూర్తి తన వక్షస్థలం పై లక్ష్మీ దేవిని నిలుపుకొని ఆమెకు హృదయస్థానాన్ని ఇచ్చాడు. దీనర్థం స్వామిది సంకల్పం అయితే అమ్మ సిద్ధిదాత్రి అన్నమాట. వీరిద్దరినీ మించి తన మేనిలో సగభాగమిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు జగదీశ్వరుడు. అంటే తామిద్దరమూ అభిన్నమని విడదీయరానంతగా కలిసి ఉన్నామని తెలపడమే అర్ధనారీశ్వర తత్త్వ పరమార్ధం.

దీన్నే కాళిదాసు మహాకవి రఘువంశంలో

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

'జగత్తుకు తల్లిదండ్రులు ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులు వాక్కు అర్థాలలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. వారు ఈ నా కావ్య రచనకు  అర్థవంతములైన మంచి వాక్కులను ప్రసాదింతురుగాక!' అని నుతిస్తాడు. మాటను అనుసరించే అర్థం వచ్చినట్లుగా సతిపతులిద్దరూ ఒకరిననుసరించి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే సంసారంలో ఆనంద సరాగాలు వెల్లివిరుస్తాయి.

లక్ష్మీ నారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, అరుంధతీ వసిష్ఠులు, సీతారాములు, రాధాకృష్ణులు అని భార్యలతో కలిపి భర్తల పేర్లు స్మరించడం లోకంలో పరిపాటి. కానీ ఒక్క పరమశివుణ్ణి మాత్రం  సాంబశివుడని పిలిస్తే చాలు. స+ అంబ శివుడు అంటే అమ్మతో కూడిన అయ్య . పార్వతీ పరమేశ్వరుల రూపం లాగానే వారి పేర్లు కూడా ఒకటిగా కలిసి పోయాయి. తల్లి జగన్మాత - శివుడు జగదీశ్వరుడు అంటే ఆమె శక్తి - స్వామి శక్తి మంతుడు. దీనికర్థం ఏమిటంటే అమ్మవారి అండ లేనిదే పరమేశ్వరుడు కనీసం కదలను కూడా కదలలేదు. అందుకే సౌందర్య లహరిలో  ఆదిశంకరులు అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించి త్రిమూర్తులకు సైతం వారి వారి శక్తి లేకపోతే చలనమే ఉండదు అని చెప్తారు.

సహధర్మచారిణి స్ధానాన్ని మించిన పదవి ధర్మపత్నికి లభించిందన్నమాట. ఇలా ఒక్కోసారి ఇల్లాలివల్లే ఇంటాయన గౌరవం కూడా పెరుగుతుందని ప్రాచీన స్తోత్రవాఙ్మయం నిరూపిస్తుంది.

"చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో

జటాధారీ కంఠేభుజగపతిహారీ పశుపతిః

కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం

భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదమ్"

"చితిలో బూడిదను భస్మంగా ధరిస్తాడు.విషాన్ని ఆహారంగా స్వీకరిస్తాడు.దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దిగంబరుడు, జటలు కట్టిన వెంట్రుకలు గలవాడు, మెడలో విషసర్పాన్నే ఆభరణంగా ధరించినవాడు, కపాలాన్ని చేతదాల్చినవాడు, భూతాధిపతి,పశుపతి అన్నపేరున్నవాడు శివుడు. కానీ ఓ భవానీ! నిన్ను వివాహమాడి నందువల్లనే ఈశుడు జగదీశుడనే గొప్ప పదవిని పొందాడు" అని అంటారు ఆదిశంకర భగవత్పాదులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో. యమునితో పోరాడి పతిప్రాణాలను దక్కించుకున్న సతీసావిత్రి, త్రిమూర్తులనే పసిబిడ్డలు గా చేసి లాలించిన సతీ అనసూయ వంటి పతివ్రతా శిరోమణులకు నిలయం మన భారతదేశం.

శ్రీమద్రామాయణంలో అశోకవనంలో శోకిస్తున్న  సీతామాతను గురించి చెబుతూ ఆదికవి వాల్మీకి పరమాత్మ కోసం పరితపించే జీవాత్మ లాగా సీతమ్మ ఉంది అంటాడు. జీవాత్మ పరమాత్మ బంధాన్నే దాంపత్య బంధంగా ఆదికావ్యం  రామాయణం నిరూపిస్తుంది.

ఇలా భర్తలను ఆరాధించి, అనుసరించి, అనుగమించి జీవితాంతం సాహచర్యం అందించిన భారతీయ మహిళలు సర్వదా సమాదరణీయలు.

దైవం మానుషరూపేణ

ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు. అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు. తాను దారి తప్పి పోయాడని. అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి. ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు.

ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని,తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు. పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు.  తనకు తెలియకుండానే 'భగవంతుడా. నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు.

వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??' అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు.

వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి, తన మనసులో 'శివయ్య. నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు.' అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు.

ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు. 
అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది! మీరేమైనా చూసారా?" అని అడిగాడు  అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కల కూర్చున్నా. ఈ వైపు ఏ కుందేలు రాలేదు." అన్నాడు. 

ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది! ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈ రోజు వేట వృథా అయినట్టే." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. 

వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్న.  నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా". అంటూ కొంచం ధీనంగా అడిగాడు. అందుకు, ఆ వేటగాడు-ఆ నాస్తికున్ని తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. 

నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి" అన్నాడు. 

ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి" ఏందయ్యా సామి? దేవుడు లేడంటావా?మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు, అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను, అలాంటిది, ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని,పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది. అంతా శివ లీల" అన్నాడు.

దానికి నాస్తికుడు "అంతా శివ లీలనా??ఇదంతా ఆ శివుడు చేయించే బదులు,శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా." అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే,అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా." అంటూ... ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి,తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి, కొంత డబ్బు తీసి, ఆ వేటగానికి ఇవ్వబోయాడు.

అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని,నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా నన్ను బయట పడేసావు! నీవు శివుడివో? శివుడు పంపిన దూతవో నీకే తెలుసు శివయ్య! ఇదంతా నిజంగా నీ లీలనే!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు.

ఇంతకీ ఆ నాస్తికుని పేరు చెప్పలేదు కదు.

అతని పేరు "శివ కేశవ"!

తండ్రి ఆశీర్వాదం

తండ్రి ఆశీర్వాదం

అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 

కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 
ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 

తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.

ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  

త్వరలోనే  నగరంలోని సంపన్నులలో, ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 

నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు.

ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  

ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 

నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. 

ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 

వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 

అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 

సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా, వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 

అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. 

ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.

అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

"లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 
అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”
ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*,  అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా, చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు!” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, "ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.
కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.

తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

Monday, November 29, 2021

త్రిచక్ర యాప్ - 3 Chakra Project

తిరుపతి అర్బన్ జిల్లా:




  • తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు.
  • త్రిచక్ర యాప్ ద్వారా ఆటో యొక్క వివరాలన్నీ నమోదు.
  • ఆటో ప్రయాణికులకు ప్రత్యేక రక్షణ.
  • తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్. 
  • నగరంలోని ఆటోలకు త్రిచక్ర యాప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు.
  • నగరములోని ఆటోల యజమానులు త్రిచక్ర యాప్ ను ప్లే స్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ప్రతి ఆటో దారుడు తప్పకుండా పూర్తి వివరాలతో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • నకిలీ వాహనాలను సులభంగా గుర్తించే అవకాశం.
  • ప్రయాణికులకు పూర్తిస్థాయిలో భద్రత.
  • ప్రయాణికులు ఉన్నచోట నుండి యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం.
  • ప్రయాణికులు పయనించు మార్గాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • దీని వల్ల ఆటో యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
  • ప్రతి ఆటోకు ఒక QR కోడ్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా ప్రయాణికులతో నేరుగా సంప్రదించవచ్చు.
  • ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు, పోలీసులకు అనుసందానమై ఉపయోగకరంగా ఉంటుంది.
  • ప్రయానికుల భద్రతే ముఖ్యం. దిశా యాప్ వలే పనిచేయడం వలన పూర్తి స్థాయిలో భద్రత.
  • ఆపదలో ఉన్నప్పుడు QR కోడ్ ఒక రక్షణ.
నగరంలో ఆటో ప్రయానికుల భద్రత దృష్ట్యా త్రిచక్ర యాప్ ను ప్రారంబించి ఆటోలకు గుర్తింపు నంబర్లను ఆటోలకు అతికించిన జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు. ఈ కార్యక్రమం ఈ రోజు బాలాజీ కాలనీ, లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగింది.   

జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ తిరుపతి నగరం మహా పుణ్యక్షేత్రం. ఇక్కడ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా నగరంలో ఎక్కువ భాగం ప్రజలు, మహిళలు, యువత ఆటోల పైనే ఆధారపడుతారు. భద్రత దృష్ట్యా నగరములో ఉన్న ఆటోలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరియు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉండాలనే ఈ త్రిచక్ర యాప్ ను తయారు చేయడం జరిగింది. 

భద్రత విషయంలో ఈ యాప్ దిశా యాప్ వలే భద్రతను కల్పిస్తుంది. ప్రయాణికులు, మహిళలు ఆటో లో ప్రయాణించినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైతే ఈ QR కోడ్ స్కాన్ ద్వారా రక్షణ పొందవచ్చు. చేయవలసినదంతా ఒక్కటే, ప్రతి ఆటోకు ఆటో ముందు బాగం, లోపల, బయట QR కోడ్ స్టిక్కర్లు అంటించబడి ఉంటుంది. అది గమనించి అత్యవసరమైనప్పుడు సమాచారాన్ని పోలీస్ వారికి తెలుపవచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితి, అనుమానం ఉన్నా వెంటనే ఆటోలోని QR కోడ్ ను స్కాన్ చేయగానే ఆటో యొక్క పూర్తి వివరాలు, డ్రైవర్/ఓనర్, ఆటో నంబర్, లొకేషన్ అన్ని తెలుస్తుంది. మీరు పోలీస్ వారికి, తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఆటో యొక్క వివరములను షేర్ చేయవచ్చును.   
 
నగరంలో ఉన్న ఆటో దారులందరు తప్పకుండా ఆటో మరియు డ్రైవర్/యజమాని యొక్క పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా పొందుపరిచి ఉంటుంది. ఆటో కావాలసిన ప్రయాణికులు వారు ఉన్న చోట నుండే యాప్ ద్వారా సులభంగా వారి వద్దకు ఆటో ను రప్పించుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు ప్రయాణించే మార్గాలను మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ యాప్ పోలీస్ స్టేషన్ నందు అనుసందానమై ఉన్నందున ఆటో ఎక్కడికి వెళుతున్నది, ఎక్కడ ఆగినది అనే పూర్తి వివరాలు పోలీసులకు సమాచారం తెలుస్తుంది. దీని వలన ప్రయాణికులు పూర్తి భద్రతతో సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరవచ్చు. అనుకోని సంఘటనలు జరిగినప్పడు QR కోడ్ వివరాల ద్వారా క్షణంలో పోలీస్ వారు మీ ముందు ఉంటారు.
 
నకిలీ ఆటోలను మరియు కొత్త వ్యక్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. ప్రతి ఒక ఆటో కు QR కోడ్ ఉన్నందున అనుకోని సంగటనలు జరిగినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాత్రికులు, ప్రజలు, మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, అందరు సురక్షిత భద్రత పొందాలని అలాగే ఆటో డ్రైవర్లు, యజమానులు ఇందుకు సహకరించి విజయవంతం చేసి తిరుపతికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాననని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు.

యాప్ యొక్క వివరాలు:

ప్రజలు:
 
1. ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర సిటిజెన్ అప్ ని డౌన్లోడ్ చేసుకోవలెను.

2. మీ పేరు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

3. రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వవలెను.

4. Nearby బటన్ మీరు click చేస్తే మీకు దగ్గర లో ఉన్న ఆటో ల వివరాలు వాటి ఫోన్ నెంబర్ లతో పాటు మీరు స్క్రీన్ పైన చూడవచ్చును. మీకు నచ్చినటువంటి ఆటో డ్రైవర్ కి ఫోన్ చేసి మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళవచ్చు.

QR స్కాన్ విధానం:

5. Dashboard నందు QR స్కానర్ ని ఉపయోగించి మీరు ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్న QR కోడ్ ను స్కాన్ చేసుకోవలెను.

6. QR స్కాన్ విధానం ద్వారా మీరు ప్రయాణిస్తున్న ఆటో వివరాలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ ప్రయాణం లో మీ లొకేషన్ తో పాటు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు.

7. ఆపద సమయంలో పోలీస్ వారికీ కూడా మీ లొకేషన్ ని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన తరువాత మీ సురక్షణ కోసం పోలీస్ వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు.

ఆటో యాజమాని:

1. ఆటో డ్రైవర్లు ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర అనే ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరు మీ మొబైల్ నెంబర్ డిస్ట్రిక్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను.

2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.

3. లాగిన్ అయిన తర్వాత మీ ఆటో యొక్క వివరాలు(ఆటో నెంబర్, ఆటో ఫోటో మొ.), ఆటో ఓనర్ యొక్క వివరాల(ఓనర్ ఫోటో, ఫోన్ నెంబర్, లైసెన్స్ ఫోటో మొ.) డాక్యూమెంట్లను ఆప్ లో అప్లోడ్ చేయాలి.

4. మీరు అప్లోడ్ చేసిన డాకుమెంట్స్ ని మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇచ్చిన తరువాత మీకు పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అయిన తరువాత మీకు QR కోడ్ ఉన్న స్టికర్ ఇవ్వటం జరుగుతుంది. .

5. మీకు స్క్రీన్ పైన ఒక Online/Offline అనే ఒక బటన్ ఉంటుంది. ఆన్లైన్ గ్రీన్ కలర్ లో పెట్టుకుంటే మీకు దగ్గర లో ఉన్న ప్రజలు మీకు ఫోన్ చేయటం ద్వారా మీకు బాడుగలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
 
పోలీస్:
 
1. ప్లే స్టోర్ నుంచి త్రిచక్ర ఆప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పోలీస్ అధికారి తన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు.

2. లాగిన్ అయిన తరువాత QR స్కానర్ ద్వారా ఆటో మరియు ఆటో డ్రైవర్ యొక్క వివరాలను పరీక్షించవచ్చును.

3. ఆటో యొక్క వివరాలని ఆటో డ్రైవర్ మొబైల్ నెంబర్ (లేదా) ఆటో నెంబర్ (లేదా) పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా కూడా ఆటో వివరాలను పరీక్షించవచ్చును.

4. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారికి వారి స్టేషన్ పరిధిలో ఉన్నటు వంటి ఆటోల యొక్క వివరాలు చూసి వాటికీ అప్రూవల్ ఇచ్చిన తరువాత పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అవుతుంది.
 
          ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు ట్రాఫిక్ I మల్లికార్జున, ట్రాఫిక్ II కాటమరాజు, వెస్ట్ నరసప్ప, సి.ఐ లు ఈస్ట్ శివప్రసాద్, ట్రాఫిక్ రామ సుబ్బయ్య, 3చక్ర యాప్ డెవలపర్ రియాజ్, ఆటో డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు.

Thursday, November 25, 2021

Chanting Vishnu Sahasranama

Vishnu Sahasranama was first composed & recited by Bhishma when he was on his deathbed. Lord Krishna went to see Bhishma because he was breathing his last. When Bhishma had darshan of Lord Krishna, he started reciting Vishnu Sahasranama immediately. Vishnu Sahasranama means, the rosary of thousand names of Lord Vishnu.

He started reciting Vishnu Sahasranama in the order he saw the lord's form continuously and successively.

Vishnu Sahasranama is found in Mahabharata, the great epic of India.

If confers all the mundane transcendental benefits to the person who chants it. There are so many Sahasranamas of Vishnu, but among them, this happens to be the most cardinal and important one because right from Sankaracharyalu there are so many Sages and Saints who have recited and commented in their own way. Even today, it is recited with fervor and gaiety in all the temples of Lord Vishnu.

The Chanting of the following names of Lord Vishnu immensely helps us in overcoming the obstacles in our daily life.

1. "Om Vashatkaaraaya Namaha" : For Success in Business.

2. "Om Aksharaaya Namaha": For Success in Studies.

3. "Om Bhuthabhavanaya Namaha": For Good Health.

4. "Om Paramaathmane Namaha": For Self Confidence.

Wednesday, November 24, 2021

బ‌ల్లిశాస్త్రం చెప్పే నిజాలు

బల్లి శరీరంపై పడితే మనలో చాలా మంది ఆందోళన పడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి. 

మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది. 

కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం. 

వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు. 

ఇక స్త్రీలపై బల్లి పడితే: తలపై పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి. 

స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు. 

ఇక బల్లి ఎవరిపైనా అయినా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. 

బల్లి పై పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి. 

బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష నిపుణులు మరియు శాస్త్ర వివరణ.

Monday, November 22, 2021

మన పండుగల గొప్పతనం 




సంక్రాంతి: మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహాశివరాత్రి: కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

హోలీ: వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ఉగాది: కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

శ్రీరామ నవమి: భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

అక్షయ తృతీయ: విలువైన వాటిని కూడబెట్టుకోమని.

వ్యాస (గురు) పౌర్ణమి : జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

నాగుల చవితి: ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం: నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి: తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

వినాయక చవితి ( నవరాత్రులు ): ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

పితృ అమావాస్య: చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

దసరా ( ఆయుధ పూజ): ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి: పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

కార్తీక పౌర్ణమి: చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

గోదాదేవి ఎవరు

గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.

తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.

పాశురాల పరమార్ధం: తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.

తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.

చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.


Wednesday, October 20, 2021

Direction priority in Hinduism

We have eight directions. We call them 'octagons'. Those who rule them are called 'Directors'. Directions: East, West, North and South are called 'Directions'.

 Directions: In addition to these four directions, there are also four directions: Northeast, Southeast, Southwest and Northwest. All together we call it octagons.

 1) East: The ruler of the east, Indra is the presiding deity. Sachidevi, wife of Indra. His vehicle is an elephant. The town where he lives is 'Amravati.' The weapon worn by Indra was the diamond weapon. He is a male fertility factor. The giver of power. This directional error, which is preferred by the solar system, can lead to health problems and official misery.

 2) Southeast Source: The ruler of the southeast, Agnihotra, the presiding deity. Agni wife Swahadevi. Vehicle trunks. Tejovati is the town where Agnihotra lives. Wearable weapon power. He is the giver of anger and pride. Southeast Venus takes precedence. The direction of southeast cooking. Cooking is for women so this directional error can make women sick.

 3) South: The ruler of the south is Yamadharmaraju, the presiding deity. He is also known as Dandapani. Shyamaladevi, the wife of Yamuna. The vehicle of Yamuna is Mahishamu (Dunnapothu). The town where he lives is restrained. The weapon worn by Yamudu is the wand. He is also known as 'Dandapani' as he has a weapon as a weapon. Yamudu is the destroyer, the giver of disease. The Mars-dominated southern hemisphere often causes traffic accidents and fires.

 4) Southwest Source: The ruler of the southwest, a demon called Nivruti, the presiding deity. His wife is Deerghadevi. Vehicle Narrow. The town where he lives is Krishnangana. The weapon worn by the southwest is the spear. Genocide Southwest. Southwest direction Rahugraha is preferred so this directional error always causes more mental annoyance in the family.

 5) West: The ruler of the west, the presiding deity Varuna. Kalikadevi, the wife of Varuna. Vehicle Capricorn (crocodile). The town where he lives is Shraddhavati. The weapon worn is a noose. Giver of all good fortune. Due to Saturn's predominance in the west, this directional error will cause delays.

 6) Northwest Source: The ruler of the northwest, the presiding deity is the wind. I.e. the god of air. His wife is Anjanadevi. No vehicle. Gandhavati is the town where he lives. The weapon worn is the flag. The Son is the giver of offspring. The northwest direction is dominated by the moon, which causes fluctuations in this direction.

 7) North: The ruler of the north, Kubera, the presiding deity. His wife Chitralekha. The vehicle is a horse. Alakapuri is the town where Kubera lives. The weapon that Kubera wears is the sword. Education, income, children, reputable giver. Due to Mercury's dominance in the north, this directional error can lead to problems in business and education.

 8) Northeast Source: Lord Shiva, the ruling deity of the Northeast. Parvati Devi, the wife of Shiva. The vehicle of Shiva is the bull. Place of residence Kailasam. The weapon worn by Lord Shiva is the trident. Gangadhar is the giver of Ashtaishwaryas, devotional knowledge and higher jobs to Lord Shiva. Jupiter dominates the northeast. If there is a defect in the northeast, there will be difficulties in procreation.

 In this way there are eight compasses in the eight directions and they always protect the human beings.

 Sri Maha Vishnu is also the dictator of the Dikpalakas. Appointing them to the eight directions, the one who commands the rituals, the rules, the dharmas, the one who guides, the supreme (husband) Sri Maha Vishnu is the emperor of all the gods.

Wednesday, May 19, 2021

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

రామునికి — సీత
కృష్ణునికి — రాధ 
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి 
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ

మన దినచర్యలో భాగంగా
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
పడకలో - మేనక 
పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి
ఓరిమిలో -వసుధ
వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు— హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి -స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన
చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో— సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు— ఆనంది 
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
     
సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ
      
సాహిత్య గోష్టిలో — కవిత 
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ,
పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — “జీవిత”.

Thursday, May 6, 2021

మాతృమూర్తి ఋణ - ఆదిశంకరాచార్యులవారు

సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,

ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?నాకు దిక్కెవరు "  అని దీనంగా ప్రశ్నించింది.

"అమ్మా! ఏ సమయమైనా సరే,  నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను."  అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది.  మూసిన కళ్ళు తెరవలేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే  తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.

తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీ కృష్ణుని ధ్యానించారు. 

శ్రీ కృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురు పితామహుడు భీష్మాచార్యునికి  మోక్షమిచ్చినట్లుగా  నా  మాతృమూర్తి కి  మోక్షం ప్రసాదించమని  వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి 

ఎవరో వస్తున్న అలికిడయింది.

కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న  ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా!  అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, 

గట్టిగా హృదయానికి హత్తుకుంది.బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌,

శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని  అనుకున్నది.  బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది

ఆర్యాంబ. అక్కడ  తను అను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు  సాక్షాత్కరించి నిలచివుండడం

గమనించింది.

గురువాయూరప్పన్ ని చూసిన ఆర్యాంబ  మహదానందంతో " అప్పా! నోరు తెరిచి,నీ నామజపం చేసేశక్తి కూడా లేని యీ దీనురాలి  ఆఖరిక్షణాలలో  నను చూసేందుకు 

వచ్చావా? కృష్ణా "   అని మెల్లిగాగధ్గద కంఠంతో  పలికింది. 

కృష్ణుడు  వెంటనే   "  నీ పుత్రుని ఆదేశం . రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా "  అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే  సమయానికి  శంకరాచార్యులవారు కూడా  అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన  ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా  భాగ్యమేమని చెప్పను ? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు  కదా, శంకరా!" అని కన్నీళ్ళుకార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి?

నేను జన్మించినది మొదలు  నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నెనేమీ చేయలేకపోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా  కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.  నేనైనా అంతే.  నేను చేయగలిగినదంతా నీదివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "

అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశిస్సులు సదా  తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యులవారు యీలోకానికి సందేశమిచ్చారు.

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).

ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).

చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.

అందుకే:

మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.

ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.

ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ కాపలాదారుగా మారిపోయి

వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.

ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.

"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".

మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని. 

 ( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు ఈ అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)

గోదాదేవి అసలు కథ


తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

తీర్థయాత్ర - విది విధాన

పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ ఎక్కువమంది దృష్టిలో తీర్థయాత్ర అంటే ప్రయాణం చేసేయడం, అక్కడి దేవుణ్ణి దర్శించుకోవడం, తిరిగిరావడం – ఇంతే ! కానీ తీర్థయాత్ర అంటే కేవలం ఇవే కావు. ఓ పుణ్యక్షేత్రానికి యాత్ర చేసేటప్పుడు పాటించాల్సిన విధినిషేధాలు కొన్నున్నాయి.

1. ఏ దేవుడి క్షేత్రానికి వెళ్తున్నామో ఆ దేవుడి పూజ ముందస్తుగా కొన్నిరోజుల పాటు ఇంట్లో చేయాలి. కనీసం స్తోత్రాలైనా చదవాలి. ఆ దేవుడి గుఱించి ఏదైనా పవిత్ర గ్రంథం ఉంటే దాన్ని కనీసం ఓ సప్తాహం పాటు పారాయణ చేయాలి. ఆ తరువాతే యాత్రకి బయల్దేఱి వెళ్ళాలి. అప్పుడు మన యాత్ర నిరాటంకంగా జఱిగేలా ఆయన ఆశీర్వదిస్తాడు.

2. ఇలా వెళ్ళి, అలా వచ్చేయడం కాకుండా, కనీసం రెండు-మూడ్రోజుల పాటైనా ఆ క్షేత్రంలో గడిపి, తద్ద్వారా ఆ భగవత్సన్నిధాన అనుభూతి విశేషాలతో మన మనస్సులు సంపూర్ణంగా పరిప్లావితం అయ్యేలా యాత్రా ప్రణాళిక వేసుకోవాలి.

౩. మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళుతున్న పక్షంలో అందుకోసం కట్టిన ముడుపును కూడా మర్చిపోకుండా వెంట తీసుకెళ్ళాలి. ఆ దేవుడు మన ఇష్టదైవం గానీ, ఇలవేల్పు గానీ అయిన పక్షంలో ఆయనకి ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు సమర్పించిన ధనరూపకమైన దక్షిణల్నీ, ధాన్యాన్నీ కూడా ఆ దేవాలయంలో సమర్పించడం కోసం తీసుకెళ్ళాలి.

4. పుణ్యక్షేత్రాల్లో చేసే పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. కనుక యాత్రా సమయం లోనూ,  పుణ్యక్షేత్రం లోనూ చదువుకోవడం కోసం కొన్ని చిన్నచిన్న పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లాలి. ఉదాహరణకి – విష్ణుసహస్రనామాలు, వివిధ దేవీదేవతల స్తోత్రసంపుటాలు మొ||వి. కార్లో వెళ్ళేవారు దేవుడి దృశ్యక, శ్రవ్యక క్లుప్తికలను (CDs) దగ్గఱ పెట్టుకుని కదలాలి.

5. పిల్లల్ని బడి మానిపించైనా సరే, తీర్థయాత్రకి అవశ్యం తీసుకెళ్ళాలి. ఆ బాల్యదశ లో కాకపోతే వారింక ఎప్పటికీ ఆధ్యాత్మికతకీ, మత సంప్రదాయాలకీ పరిచితం కారు. వారికి సంస్కృతీ, సంప్రదాయమూ అలవడనే అలవడవు. వాటిని బళ్ళల్లో నేర్పరు. తల్లిదండ్రులే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నేర్పాలి ...  

  చిన్నప్పట్నుంచీ హిందూ సంప్రదాయానికి వారిని అలవర్చకపోతే వారి తరంలోనో, వారి వారసుల తరంలోనో మతం మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ రోజున్నట్లే ఱేపు కూడా ఉంటుందని అనుకోకూడదు. హిందూ తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యం ద్వారా తమ పిల్లల జీవితాల్లో సృష్టించిన ఆధ్యాత్మిక శూన్యాన్ని వేఱే ఎవఱో తమ మతంతో భర్తీ చేసేందుకు కాచుక్కూర్చుంటారని మర్చిపోవద్దు.    

6. యాత్రని రహస్యంగా ఉంచకూడదు. సాధ్యమైనంత వఱకూ పరిచయస్థులందఱికీ తెలియజేయాలి. వారిలో యాత్రకి రాలేని వారుంటే వారు తమ తరఫున పదో పరకో, లేకపోతే కొన్ని వస్తువులో దేవుడికి సమర్పించమని ఇస్తారు. వాటిని కూడా వెంట తీసుకెళ్ళాలి. భక్తులంటే భగవంతుని స్వరూపాలే. వారికి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడమే.

7. అప్పుచేసి, లేదా ఇతరుల్ని పీడించి సంపాదించిన ద్రవ్యంతో యాత్ర చేయకూడదు.

8. యాత్ర చేస్తూండగా దైవేతర, లౌకిక సంభాషణల్లో సాధ్యమైనంత వఱకూ పాల్గొనకుండా ఉండడానికే ప్రయత్నించాలి. నిరంతరం భగవన్నామాన్ని, స్తోత్రాల్నీ వల్లిస్తూ ముందుకు సాగాలి. భగవత్సంబంధమైన సత్కథల్ని తోటివారితో చెబుతూ ప్రయాణం చేయాలి. ఎవఱితోనూ ఏ విధమైన చర్చలూ, వాదాలూ, తర్కాలూ చేయకూడదు. ఇతరులు ఏదైనా పొఱపాటు మాట్లాడితే దాన్ని సవరించే పని పెట్టుకోకూడదు.

9. కామక్రోధాది అరిషడ్వర్గాల్ని ఉపశమింపజేసుకోవాలి. శత్రువుల్నీ, దురదృష్టాల్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. యాత్రలో తారసపడేవారందఱినీ స్నేహభావంతో చూడాలి.

10. దారిలో మనకు కలిగే ఆకలిదప్పుల్నీ, అలసటనీ, అనారోగ్యాల్నీ, అసౌకర్యాల్నీ భగవత్ ప్రసాదంగా భావించి ఆనందంగా భరించాలి. పూర్వజన్మ దుష్కర్మ ఈ యాత్రాక్లేశాల ద్వారా హరించుకు పోతోందనీ, ఆత్మ పరిశుద్ధమవుతోందనీ భావించి సంతోషించాలి. అంతే తప్ప “అది బాలేదు, ఇది బాలేదు” అని మాటిమాటికీ వ్యాఖ్యానించుకొని మనసుని కష్టపెట్టుకోకూడదు. యాత్రకొచ్చింది తినడానికో, తాగడానికో, జీవితాన్ని ఆస్వాదించడానికో, కాలకృత్యాలు తీర్చుకోవడానికో కాదనీ, దైవసన్నిధానాన్ని అనుభూతి చెందడానికేననే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకొని ప్రవర్తించాలి. ఆయా అవసరాలు ఎలా తీఱినా ఫర్వాలేదన్నట్లు మసలుకోవాలి. దైవానుభూతికి మినహా ఇంకా దేనికీ ప్రాధాన్యం ఇవ్వకూడదు.   

11. తీర్థగమ్యాన్ని చేఱుకున్నాక ముందు చేయాల్సిన పని స్నానాదులు ముగించి ఎంతో కొంత ఆహారంగా తీసుకోవడం. సుప్రసిద్ధ క్షేత్రాలైతే దైవదర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టవచ్చు. తినడం ఆలస్యమయ్యే కొద్దీ, వరుసలో నిలబడ్డా మనసు దేవుడి మీదికి కాక తిండి మీదికే పోతూంటుంది. కనుక ఖాళీకడుపుతో దైవదర్శనం చేయలేం.

12. దైవదర్శనానికి వెళ్ళే దారిలో ఎన్ని ఆకర్షక విషయాలూ, వస్తువులూ ఉన్నా ఆగకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. భారీ బ్యాగులూ, పెట్టెలూ మొదలైన సరంజామాతో వెళ్ళడం చాలా అసౌకర్యం. అలా తీసుకెళ్తే చిత్తం దేవుడి మీద కాక వాటి మీదే లగ్నమై ఉంటుంది.

13. కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవతం కాక మఱో దేవుడో, దేవతో వేంచేసి ఉంటారు. ముందు వారిని దర్శించుకున్నాకనే ప్రధాన దైవతాన్ని దర్శించాలనే సంప్రదాయం ఉంటుంది. దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ఉదాహరణకి – తిరుమలలో శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నాకనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. అలాగే శ్రీస్వామి వారిని దర్శించాక తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.

14. “రిక్తహస్తేన నోపేయాద్ రాజానం దైవతమ్ గురుమ్” అన్నారు పెద్దలు. కనుక దైవ దర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందులోనూ సమాజంలో కాస్తో కూస్తో స్థితిమంతులనిపించు కుంటున్నవారు దేవుడి దగ్గఱికి చేతులూపుకుంటూ వెళ్ళనేకూడదు. పూలదండలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణద్రవ్యం, క్రొత్తవస్త్రాలూ, ఏదైనా వెండి/ బంగారు వస్తువూ – వీటిల్లో ఏదో ఒకటి గానీ, కొన్ని గానీ, అన్నీ గానీ సమర్పణగా తీసుకెళ్ళాలి. కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవతానికి కొన్ని ప్రత్యేక సమర్పణ లంటే ప్రీతి కనుక అవేంటో కనుక్కుని అవి కూడా తీసుకెళ్ళాలి.

15. దేవుడికి సమర్పించిన పూలదండల్నీ, తినుబండారాల్ని, వస్త్రాల్నీ ఆయన ప్రసాదంగా వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఆయనకు సమర్పించిన డబ్బునీ, వెండి/ బంగారు ఆభరణాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు. 

అలా చేస్తే  అమ్మ వార్లు చాలా బాధపడతారు. మనకు జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది. ఈ సంగతి తెలీక చాలామంది ఆడవాళ్ళు అమ్మవార్ల దర్శనానికి వెళ్ళినప్పుడు నగలతో వారిని అలంకరింపజేసి ఆ తరువాత మళ్లీ వాటిని వెంట తీసుకెళుతున్నారు. “దేవుడికి ఇంత ఇవ్వాలి” అని మనసులో అనుకుని, లేదా ఆ మాట పైకి అనేసి ఆ తరువాత మనసు మార్చుకోవడం కూడా మహాదోషం.

16. అలాగే దేవుడి కోసం బయటికి తీసిన డబ్బుని యథాతథంగా సమర్పించేయాలే తప్ప, “ఈ నోటు తీసుకుని ఇంత చిల్లఱ నాకు వెనక్కివ్వండి” అని అడక్కూడదు. మనం అక్కడికి వెళ్ళినది దేవుణ్ణి శరణాగతి వేడడానికే తప్ప ఆయనతో బేరసారాలూ, వ్యాపారమూ, నగదుమార్పిడి చేయడానికి వెళ్ళలేదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.

17. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడి స్థానిక ఆచార వ్యవహారాలన్నింటినీ వినయ విధేయతలతో పాటించాలే తప్ప “ఇవన్నీ నిజమా ? వీటి వల్ల ఏమైనా ప్రయోజనముందా ? దీనివల్ల గుడి సిబ్బందికేమైనా లబ్ధి చేకూఱుతోందేమో ? మమ్మల్ని ఎందుకింత కష్టపెడుతున్నారు ? ఫలానా గుళ్ళో ఇలా లేదే ? ఇక్కడెందుకు ఇలా ఉంది ?” అని వితండవాదాలూ, విమర్శలూ, తర్కాలూ చేయకూడదు. పుణ్యక్షేత్రాల్లో అశ్లీలాలూ, అవాచ్యాలూ పలకరాదు.

18. పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలూ, క్రీడలూ, సినిమాలూ, పెట్టుబడివ్యాపారాలూ, విద్యా-ఉద్యోగావకాశాలూ, లోకాభిరామాయణమూ మాట్లాడరాదు. వారపత్రికలూ, వార్తాపత్రికలూ, కథలూ, నవలలూ చదవరాదు. భార్యతో గానీ, ప్రియురాలితో గానీ సరసాలాడరాదు. భగవంతుడికి తప్ప ఇంకెవఱికీ జై కొట్టరాదు, పొగడరాదు. పరనింద, ఎగతాళి చేయరాదు.

19. ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా వివర్జించాలి.  

20. కొంతమంది పుణ్యక్షేత్రాల్లో చనిపోతే సద్గతి లభిస్తుందనుకుని అక్కడికెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిచోట్ల కాలిక మరణం, లేదా సాధారణ మరణం పొందితేనే సద్గతి. ఆత్మహత్య చేసుకుంటే మటుకూ దుర్గతే. ఆత్మహత్య చేసుకోవడమంటే భవిష్యత్తు మీదా, తద్ద్వారా భగవంతుడి మీదా నమ్మకం లేదని ఆచరణాత్మకంగా, బహిరంగంగా ప్రదర్శించడమే. అది దైవవిశ్వాసానికి ఎంతమాత్రమూ ప్రతీక కాదు. అలా చనిపోయేవారికి పిశాచ, బ్రహ్మరాక్షస జన్మలే గతి.   

21. ఒకానొక పుణ్యక్షేత్రంలో మనుషులూ, స్థలాలూ మనకు నచ్చకపోయినా విమర్శించకూడదు. ఆ విమర్శలు నేరుగా అక్కడి దేవుడికే తగుల్తాయి. పుణ్యక్షేత్రమైనా, కాకపోయినా అందఱిలోనూ భగవంతుడే ఉన్నాడు గనుక ఎక్కడైనా సరే, పరనిందా, భగవన్నిందా రెండూ వేఱు కాదు.    

22. కొన్నికొన్ని క్షేత్రాలలో స్థలమహాత్మ్యమూ, భగవద్వరప్రసాదమూ మూలంగా కొన్నికొన్ని రకాల విశేష సాధనలు చేస్తే త్వరగా కోరికలు తీఱతాయి. అవేంటో అక్కడ జనాన్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారంగా అనుష్ఠించాలి.

23. దర్శనం కాగానే “హమ్మయ్య” అనుకుని బయటపడొద్దు. గుళ్ళోనో, గుడి బయట అరుగు మీదనో, చెట్టు కిందనో కూర్చుని భగవంతుడి స్తోత్రాలు చదువుకుని, లేదా జపధ్యానాదుల్లాంటివి చేసుకుని ఆ తరువాతే లేవాలి. ఇలా చేసేటప్పుడు వట్టి నేలమీద కాకుండా ఏదైనా ఓ ఆసనం (చిట్టిచాప, వస్త్రం, తెల్ల కాయితం లాంటివి) వేసుకుని చేయాలి. అలా కాక వట్టి నేలమీద కూర్చుని చేసే ఉపాసనల ఫలం భూదేవికీ, తద్ద్వారా బలి చక్రవర్తికీ చెందుతుంది.

24. అక్కడ ఎవఱైనా చేయి చాపితే మనకు తోచినంత, మనం ఓపినంత దానం చేయాలి. పుణ్యక్షేత్రంలో చేస్తున్న దానం కనుక దానికి విశేష ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇవ్వనక్కఱలేదు. కానీ యాచకుల్ని విసుక్కోవడం, కసురుకోవడం, దూషించడం, బుద్ధి చెప్పడం లాంటివి మంచివి కావు. ఇష్టం లేకపోతే మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.

25. ఈ రోజుల్లో లౌకిక ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలాన పుణ్యక్షేత్రాలున్న ఊళ్లల్లో సినిమా హాళ్ళూ, వ్యభిచార గృహాలూ కూడా చొఱబడ్డాయి. “దర్శనమైపోయింది గదా” అని చెప్పి వాటికేసి దృష్టిసారించరాదు. పెద్దలేమన్నారంటే-

శ్లో|| అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |

పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ||

తాత్పర్యం – ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం సిమెంటులా పట్టుకుంటుంది.

26. తీర్థయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడి వస్తువుల్నీ, విగ్రహాల్నీ, స్థలపురాణ గ్రంథాల్నీ తప్పనిసరిగా కొనాలి. వీలైతే కొన్ని ఎక్కువ పుస్తకాలే కొనాలి. ఇంటికి వెళ్ళాక వాటిని ఇతరులకిచ్చి చదివిస్తే వారికీ ఆ తీర్థయాత్ర చేయాలనే కోరిక కలుగుతుంది. పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రసాదాల్ని కేవలం తామారగించడమే కాకుండా తమ బంధుమిత్రులకీ, ఇఱుగు పొఱుగు వారికీ కూడా పంచాలి.

27. యాత్రలో పొందిన మధురానుభవాల్ని మాత్రమే ఇతరులతో చెప్పాలి. “ఓయమ్మో, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం” అని వాపోకూడదు. అది భగవంతుణ్ణి విమర్శించడమే అవుతుంది. అదే విధంగా ఇంటికెళ్ళేటప్పుడు/ వెళ్ళాక  “యాత్రకంతా కలిపి మొత్తం ఎంత ఖర్చయింది ?” అని లెక్కలు వేయకూడదు. అలాంటివి యాత్రకి బయల్దేఱక ముందే వేసుకోవాలి.

మొత్తమ్మీద తీర్థయాత్రకి వెళ్ళి సాధ్యమైనంత పుణ్యధనాన్ని మూటగట్టుకు రావాలి, పాపాల్ని కాదు.

చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి. 

 *తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

సర్వేజనా సుఖినోభవంతు 

వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా


రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం  చేరుకొని ఇప్పుడు  నేలకోని ఉన్న దక్షిణామూర్తి  ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని  బోధి చెట్టు  క్రింద సేద తీర్చుకొన్నాడు  ఉధయమునే స్నానమాచ రించుటకు  ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది.  చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో  సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర  కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా  వ్యాధి దూరమైంది ఎలా? నా  సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వలముకి బహుముకి ...... దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. ఓ.కే నా నమ్మలేదు కాదు ఇప్పటి కి గుండం లో నీరు తిసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి మిత్రులారా ..... ఇకనుంచి ఇచరిత్ర నలుగురి తో పంచుకుని ఆధారాలతో కనిపించే  పుష్కరణి పవిత్రతను కాపాడుతారని ఆశిస్తూ................వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా ?


రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం  చేరుకొని ఇప్పుడు  నేలకోని ఉన్న దక్షిణామూర్తి  ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని  బోధి చెట్టు  క్రింద సేద తీర్చుకొన్నాడు  ఉధయమునే స్నానమాచ రించుటకు  ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది.  చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో  సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర  కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా  వ్యాధి దూరమైంది ఎలా? నా  సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వాలాముఖి బహుముకి దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.

ఆదిశంకరాచార్యుల జయంతి - 16 మే, 2021

1) కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో 

2) స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. 

3) ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. 

4) ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. 

5) విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. 

6) అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి

7) మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో 

8) ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్బములో 

9) ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు.

10) చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు 

11) ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. 

12) పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు

హర హర శంకర !!  జయ జయ శంకర !!

Saturday, April 24, 2021

Postmortem Findings - Covid 19 Patients in Italian Patients - Telugu

ప్రపంచంలోని పెద్ద వార్తలు, చనిపోయిన కరోనా రోగిని ఇటలీ పోస్ట్ మార్టం చేసింది, కోవిడ్ -19 మృతదేహంపై శవపరీక్ష (పోస్ట్‌మార్టం) చేసిన మొట్టమొదటి దేశంగా ఇటలీ నిలిచింది. మరియు కోవిడ్ -19 వైరస్ ఉనికిలో లేదని విస్తృతమైన దర్యాప్తులో తేలింది, బదులుగా ఇది చాలా పెద్ద గ్లోబల్ స్కామ్. "యాంప్లిఫైడ్ గ్లోబల్ 5 జి (Amplified Global 5G) (Electro Magnetic Radiation) విద్యుదయస్కాంత వికిరణం (పాయిజన్)" కారణంగా ప్రజలు చనిపోతున్నారు. కరోనా వైరస్ తో మరణించే వ్యక్తుల మృతదేహాలపై శవపరీక్షలు (పోస్టుమార్టం) అనుమతించని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చట్టాన్ని ఇటలీలోని వైద్యులు ఉల్లంఘించారు, తద్వారా కొంత శాస్త్రీయ ఆవిష్కరణ మరియు పరిశోధన తరువాత, అది వైరస్ కాదు, మరణానికి కారణమయ్యే బాక్టీరియం, సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల, అంటే ఈ బ్యాక్టీరియా వల్ల రక్తం సిరలు, నరాలలో పేరుకుపోతుంది మరియు ఇది రోగి మరణానికి కారణం అవుతు మరియు "డిఫ్యూస్-ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ (థ్రోంబోసిస్) (Defuse Intravascular Coagulation Thrombosis)తప్ప మరొకటి లేదు" అని పేర్కొంది మరియు దీనిని ఎదుర్కునే పద్ధతి ఆస్పిరిన్ తీసుకోవడం ద్వారా ఇది నయమవుతుంది. ప్రపంచానికి ఈ సంచలనాత్మక వార్తలను ఇటాలియన్ వైద్యులు కోవిడ్ -19 వైరస్ యొక్క చనిపోయిన శవాల శవపరీక్షలు (పోస్టుమార్టం) తో తయారు చేశారు, ఈ వ్యాధిని నయం చేయడం సాధ్యమని సూచిస్తుంది. మరికొందరు ఇటాలియన్ శాస్త్రవేత్తల ప్రకారం, వెంటిలేటర్లు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసియు) ఎప్పుడూ అవసరం లేదు. ఇందుకోసం ఇప్పుడు ఇటలీలో కొత్త మొలాసిస్ ప్రోటోకాల్స్ జారీ చేయబడ్డాయి. చైనాకు దాని గురించి ముందే తెలుసు కానీ తన నివేదికను ఎవరికీ బహిరంగపరచలేదు. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబం, పొరుగువారు, నిపుణులు, స్నేహితులు, సహోద్యోగులందరితో పంచుకోండి, తద్వారా వారు కోవిడ్ -19 భయం నుండి బయటపడగలరు మరియు ఇది వైరస్ కాదని వారు అర్థం చేసుకోగలరు. అయితే ఇది కేవలం 5జి రేడియేషన్ ఉన్న బ్యాక్టీరియం. రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్న ప్రజలకు హాని చేస్తుంది. ఇది రేడియేషన్ (Radiation) ఇన్ఫ్రాక్షన్ (Infraction)మరియు హైపోక్సియాను (hypoxia) కూడా ఉత్పత్తి చేస్తుంది. పై లక్షణాలు ఉన్నట్లయుతే వారు ఆస్ప్రిన్ -100 ఎంజి మరియు అప్రోనికస్ లేదా పారాసెటమాల్ 650 ఎంజి తీసుకోవాలి. ఎందుకు… ??? .... మరియు శ్వాస లేకపోవడం వల్ల, ఒక వ్యక్తి వేగంగా మరణిస్తాడు.
ఇటలీలోని వైద్యులు డబ్ల్యూహెచ్‌ఓ ప్రోటోకాల్‌ను పాటించలేదు మరియు కోవిడ్ -19 కారణంగా మరణించిన శవాలను శవపరీక్ష చేశారు. శరీరంలోని చేతులు, కాళ్ళు మరియు ఇతర భాగాలను తెరిచి పరిశీలించిన తరువాత, రక్త నాళాలు విడదీయబడి, సిరలు త్రోంబితో నిండి ఉన్నాయని గ్రహించారు, ఇది సాధారణంగా రక్తం ప్రవహించకుండా నిరోధిస్తుంది మరియు శరీరానికి ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది దీనివల్ల రోగి చనిపోతాడు. ఈ పరిశోధన తరువాత, ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే కోవిడ్ -19 ను ఇచ్చే చికిత్స ప్రోటోకాల్ మార్చబడింది మరియు వారి సానుకూల రోగులకు ఆస్పిరిన్(Aspirin) 100 ఎంజి మరియు ఆప్రోనికస్(Apronicus) ఇవ్వడం ప్రారంభించింది. దీనివల్ల రోగులు కోలుకోవడం ప్రారంభించారు మరియు వారి ఆరోగ్యం మెరుగుపడింది. ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒకే రోజులో 14000 మంది రోగులను డిశ్చార్జ్ చేసి వారి ఇళ్లకు పంపింది.- Health Ministry of Italy.

Thursday, April 22, 2021

COVID-19 CRUCIAL INFORMATION

◉ Due to the collapse of the health system, we, the health professionals, have prepared this message for the people, in case you do not want to risk going to the hospital immediately;
  __________
  ◉ Symptoms appear from the third day after infection (viral symptoms).
   
➙ 1st phase;
  ◉ Body pain
  ◉ Eye pain
  ◉ Headache
  ◉ vomiting
  ◉ Diarrhea 
  ◉ Runny nose or nasal congestion
  ◉ Decomposition
  ◉ Burning eyes
  ◉ Burning when urinating
  ◉ Feeling feverish
  ◉ Scuffed throat (sore throat)
  
➙ It is very important to count the days of symptoms: 1st, 2nd, 3rd.
  ◉ Take action before the onset of fever.
  ◉ Be careful, it is very important to drink plenty of fluids, especially purified water. Drink plenty of water to keep your throat moist and to help clear your lungs.
  __________
  
➙ 2nd phase; (from 4th to 8th day) inflammatory.
  ◉ Loss of taste and / or smell
  ◉ Fatigue with minimal effort
  ◉ Chest pain (rib cage)
  ◉ Tightening of the chest
  ◉ Pain in the lower back (in the kidney area)
  __________
  
➙ The virus attacks nerve endings;
  ◉ The difference between fatigue and shortness of breath:
  • Lack of air is when the person is sitting - without making any effort - and is out of breath;
  • Fatigue is when the person moves around to do something simple and feels tired.
  __________
  
➙ It takes a lot of hydration and vitamin C.
  __________
  
Covid-19 binds oxygen, so the quality of the blood is poor, with less oxygen.
  __________
   
➙ 3rd phase - healing;
  ◉ On day 9, the healing phase begins, which can last until day 14 (Convalescence).
  ◉ Do not delay treatment, the sooner the better!
  __________
  
➙ Good luck everyone!
  It is better to keep these recommendations, prevention is never too much!
  • Sit in the sun for 15-20 minutes
  • Rest and sleep for at least 7-8 hours.
  • Drink 1 and a half liters of water per day
  • All food should be hot (not cold).
  
➙ Keep in mind that the pH of the Coronavirus ranges from 5.5 to 8.5.
  
So all we have to do to eliminate the virus is to eat more alkaline foods, above the acid level of the virus. As;

  ◉ Bananas, Lime → 9.9 pH
  ◉ Yellow Lemon → 8.2 pH
  ◉ Avocado - pH 15.6
  ◉ Garlic - pH 13.2
  ◉ Mango - pH 8.7
  ◉ Mandarin - pH 8.5
  ◉ Pineapple - 12.7 pH
  ◉ Watercress - 22.7 pH
  ◉ Oranges - 9.2 pH
  __________
  
➙ How do you know you have Covid-19 ?!

  ◉ Itchy Throat
  ◉ Dry Throat
  ◉ Dry Cough
  ◉ High Temperature
  ◉ Difficulty Breathing
  ◉ Loss of Smell and Taste
  __________

DO NOT keep this information just for yourself, give it to all your family and friends.
Y O U  C A R E

Important Message for all
The hot water you drink is good for your throat. But this corona virus is hidden behind the paranasal sinus of your nose for 3 to 4 days. The hot water we drink does not reach there. After 4 to 5 days this virus that was hidden behind the paranasal sinus reaches your lungs. Then you have trouble breathing.

That's why it is very important to take steam, which reaches the back of your paranasal sinus. You have to kill this virus in the nose with steam.
At 50°C, this virus becomes disabled i.e. paralyzed. At 60°C this virus becomes so weak that any human immunity system can fight against it. At 70°C this virus dies completely.
This is what steam does. The entire public health department knows this. But everyone wants to take advantage of this pandemic. So they don't share this information openly.

One who stays at home should take steam once a day. If you go to the market to buy vegetables, take it twice a day. 

Anyone who meets some people or goes to office should take steam 3 times a day.                               

Steam Week
According to doctors, Covid -19 can be killed by inhaling steam from the nose and mouth, eliminating the Coronavirus.  

*If WE all start a Steam Drive Campaign for a week, the Pandemic will soon END.

So here is a suggestion: 

* Start the process for a week morning and evening, for just 5 minutes each time, to inhale steam. If all adopt this practice for a week the deadly Covid-19 will be erased.

This practice has no side effects either.

          

Wednesday, April 21, 2021

Can you Define Happiness which Stays Long?

శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత చాలా మంది ఆ తప్పు చేస్తారంట.! కానీ అది చేయద్దు. ఎందుకో తెలుసా


తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్నఅన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళుతుంటారు. పాపనాశనం.. కాణీపాకం.. చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెపుతారు.. 

అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి.. శ్రీకాళహస్తి దేవాలయాన్నే ఎందుకు చివరగా దర్శించుకోవాలి.. శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు.. వెళితే ఏమవుతుంది. నేరుగా ఇంటికే ఎందుకే వెళ్లాలి.? తెలుసుకుందాం.

పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం.

గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం.

అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం.....

రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది.
ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెపుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదనేది అక్కడి పూజరులు చెపుతున్నారు. గ్రహణాలు..
శని బాధలు.. పరమశివుడుకి ఉండవని. మిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం.. గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.

దీనికి మరోక ఆధారం..

 చంద్రగ్రహణం

ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు.
కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. 

అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవం దర్శనం అవసరం లేదన్నది నీతి.

గోదాదేవి అసలు కథ

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.
ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది.

అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

కార్తీక పురాణం - 27 వ అధ్యాయము


దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున , అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును"

అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.


సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.

సృష్టి రహస్య విశేషాలు సృష్టి  ఎలా  ఏర్పడ్డది సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి ( సృష్ఠి )  ఆవిర్బావము  1  ముంద...