I am UNIQUE, AMAZING, ORIGINAL, STRONG, KIND & I'm who I am. REAL and SIMPLE. :-) MoSt Of AlL My LiFe Is SiMpLe AnD CoLoRfUl...
Saturday, April 24, 2021
Postmortem Findings - Covid 19 Patients in Italian Patients - Telugu
Thursday, April 22, 2021
COVID-19 CRUCIAL INFORMATION
Wednesday, April 21, 2021
శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత చాలా మంది ఆ తప్పు చేస్తారంట.! కానీ అది చేయద్దు. ఎందుకో తెలుసా
గోదాదేవి అసలు కథ
కార్తీక పురాణం - 27 వ అధ్యాయము
శ్రీ శివ మహాపురాణం - 27 వ అధ్యాయం
2021 wedding dates according to the Hindu Calendar
శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు?
రామ రెండక్షరాలు శక్తి శరాలు
Karnavedha samskaras (Piercing the earlobe)
Monday, April 19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగము
తెలుగు సంవత్సరాల పేర్లు. వాటి అర్థాలు
ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?
శుభకార్యాల్లో ఆడవాళ్ళ గొంతుకి గంధం రాసేదెందుకు?
అక్షరాల అధిదేవతలు
తథాస్థు దేవతలు అంటే
కాలసర్ప దోషం (నాగదోషం)
రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
Saturday, April 17, 2021
జీవితాన్ని ఎలా గడపాలి?
Thursday, April 15, 2021
కాశీలోని కొన్ని వింతలు విశేషాలు
Wednesday, April 14, 2021
India, Hindu Rashtra!
Interesting article from a Pakistani Muslim. Omer Khalid Asks: “What Is Wrong In Bharat Becoming A Hindu Rashtra?”
Monday, April 12, 2021
మనం చేసే పూజలు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి ?
Wednesday, April 7, 2021
నరకం లోని శిక్షలు
ఈ లోకంలో మనుష్యులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు ఉద్భోదిస్తున్నాయి . ఈ భోగదేహం రెండు రకాలు..
ఒకటి సూక్ష్మ శరీరం. ఇది మనిషి ఆచరించన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్థ్వ లోకాలకు చేరుతుంది.
రెండవది యాతన దేహము. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను నానా విధాలుగా అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తర్వాత వెంటనే కొత్త హేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవు మనోమయ ప్రాణమయ హేహంచేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవిచవలసి వస్తుంది..
చాగంటి వారి అద్భుత ప్రవచనం
శ్రీ మద్భాగావతంలో యాతనాదేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణన వున్నది.
వాటి సంక్షిప్త వివరణ ఇది.
1. తామిస్ర నరకం
పరుల యోక్క ధనాన్ని అపహరించ్చిన , పరస్త్రీలతో వ్యభిచరించినా ఈ శిక్ష ను పొందుతారు, ఇక్కడ అంధకారమైన(చీకటి) బంధురమున(గదిలొ) పడవేసి కాల్చిన ఇనుప కఱ్ఱలచే బాదుదురు.
2. అంధతామిస్ర నరకం
స్త్రీలను మోసగించి ధనమును తీసుకున్న వారు, తన కంటే పెద్దవారిని గౌరవించని వారు ఈ శిక్షను పొందుతారు ఇక్కడ చిమ్మ చీకటి గదిలో పాముల మద్య నరికిన చెట్ల వలె పడవేయుదురు.
3. రౌరవము
మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపిన వారికి ఈ శిక్ష అమలు చేయుదురు ఇక్కడ రురువులు (పాముల కన్న ఘోరమైనవి అతి భయంకరమైనవి)చే హింసించును.
4. మహారౌరవం
మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపి తన శరీరాన్ని పోషించుకునేవారు , మూగ జీవులను భందించే వారును ఈ నరకంలోకి వస్తారు ఇక్కడ పచ్చి మాంసము తిను రురువులచే హింసించును.
5. కుంభీపాకము
సజీవంగా వున్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఇక్కడు కు చేరుతాడు ఇక్కడ సలసల కాగే నూనెలో పడవేయుదురు.
6. కాలసూత్ర నరకం
తల్లిదండ్రులను, సద్భ్రాహ్మణులను, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకాన్ని చూస్తారు ఇక్కడ రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు మాడ్చి వేయచుండును.
7. అసిపత్ర వనము
తల్లిదండ్రులను , వేదములను, గురువులను, ధిక్కరించిన వారు ఇక్కడికి వస్తారు ఇక్కడ కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచూ, సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుచేయును..
8. సూకర ముఖము
దండించ దగని వారిని దండిచిన రాజులకు మరియూ న్యాయమూర్తులనూ చెరకు గడలవలే గానుగలలో పెట్టి తిప్పుదురు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జపం
9. అంధకూపము
నల్లులు మున్నగు వాటిని చంపిన వారిని పాములు,నల్లులు,దోమలు,చీమలు చే హింసించును.
10. క్రిమి భోజనము
అతిధులకు అభ్యాగతులకు సరియైన అన్నం పెట్టక తన పొట్ట నింపుకొను వాడు క్రిములతో నిండిన సలసలగాకు లక్షయోజనముల కుండలో పడవేయబడును.
11. సంధశన
బ్రాహ్మణుల ధనము,ఇతరుల బంగారము,రత్నములు దోచుకున్న వారిని మండుతున్న కడ్డీలతో పొడుచుట మరియూ పటకారతో చర్మము పీకుట వంటి శిక్షలు వేయును.
12. తప్తసూర్మి
సంభోగించరాని పర స్ర్తీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన ఆడవారు ఈ శిక్షను అనుబవించును ఇందులో మండుతున్న ఇనుప చువ్వలతో శిక్షించును మరియూ మర్మాంగములను ఇనుప రంపముతో కోయును.
13. వజ్రకంటక శాల్మిలి
పశువులతో సంభోగించిన వాడు ముళ్ళున్న బూరుగు చెట్టు మీదికి ఎక్కించి కిందకు లాగి వేయును..
14. వైతరణి
కులమర్యాద పాటించని పురుషులు, రాజు లేక రాజోద్యోగి చీము, నెత్తురు, తలవెంట్రుకలు, గోళ్ళచే నిండి ఉండు నదిలో త్రోయ బడును.
15. పూయదన
శౌచము, ఆచారము పాటించని బ్రాహ్మణులను మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేయుదురు.
16. ప్రాణరోధ
కుక్కలను, గాడిదలను, పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న వారిని ఆంపకోలలచే వేటాడుదురు.
17. వైశాన
దంభ యజ్ఞములు చేసి పశువులను హింసించిన వారు ప్రాణాంతకమైన రకరకాల యాతనలను అనుభవింతురు
18. లాలాభీక్ష
భార్యలను భయపెట్టి హింసించికుల సుఖించే వారిచే మూత్ర పీనము చేయింతురు.
19. సారమేయోదనము
ఇండ్లు తగుల పెట్టుట, విషము పెట్టుట అట్టి వారిని మరియూ దొంగ జీవితము అనుబవించు వారిని వజ్రములవలే కరకుగా వున్న కోరలు గల ఏడువందల జాగిలములు పీక్కొని తినును.
20. అవిచి మంత
అబద్ద సాక్ష్యాలను చెప్పిన వారు,లావాదేవీల లో బొంకిన వారు వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడును.
21. అయఃపానము
వ్రతనిష్టతో వుండి మద్యపానము చేసిన వారు, సోమపానము చేసిన వారు కరిగిన ఇనుమును త్రాగింతురు.
22. క్షారకర్దమ
తన కన్న అధికులను, పెద్దవారిని తిరస్కరించువారు తలక్రిందులగా పడద్రోసి నానా బాధలు పెట్టుదురు.
23. రక్షో గణబోధన
నరమేధములు చేయువారిని, పశువుల మాంసము తిను వారిని ముక్కలు ముక్కలుగా కొయును.
24. శూల ప్రోతము
జంతువులను, మూగజీవులను పొడిచి చంపినవారిని శూలములచే పొడువబడి,ఉరి కంబములను ఎక్కింపబడును.
25. దండసూకర
ఆడవారిని , పిల్లలకు భయము కలిగించు వారిని అయిదు తలలపాములు ఏడు తలల పాములచే క్రూరముగా హింసించెదరు.
26. అవధినిరోధన
తల్లితండ్రులను, భార్యాపిల్లలను బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పేట్టి ఉక్కిరి బిక్కిరి చేయును.
27. పర్యావర్తన
అతిధులను, అభ్యాగతులను గద్దించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు.
28. సూచిముఖి
ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూచిన వాని శరీరమును సూదులతో బొంతను వలే కుట్టుదురు.
పూజారి -- కానుకలు..
పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNFUZ0LboKxprC4OtkHRRpqtIZ6tCGP20b0uakyQylS3ued_FupoeG8TEMT-drLbYHyam3Q6mNkdyJ2TOsIkYyzOj8fiZJGWRqTIbtuToquh0R1vyn94SGBy_LtqS8oh2bRdZFwRAwKvg/s1600/1678099779495601-0.png)
-
కచ్చబేశ్వరర్ ఆలయము, తిరుకచ్చుర్, తమిళ్నాడు: తిరుకచ్చుర్ మరైమలైనగర్ నుండి 6కి.మీ, సింగపెరుమాళ్ కోయిల్ నుండి 2 కి.మీ దూరములో చెన్నై చెంగల్పట్...
-
The Ekadashi that falls in the month of Magha is called Bhishma Ekadashi. Bhishma Ekadashi is the holiest day on which Bhishma, who was woun...