Wednesday, January 26, 2022

కాణిపాకం విశిష్టత, విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు.

వర సిద్ధి వినాయకుడు
ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడుకట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.ఈ ఆలయం లోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.

చరిత్ర - కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారి పోయింది. 

మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు గా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోప తండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరినీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

కాణిపాకం ఆలయ సమూహము: కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

Sunday, January 23, 2022

Birth circle of Kumbha Karna, Ravanasura

We all know that Kumbha Karna and Ravanasura are brothers. But most people do not know the secret of their birth and why they became monsters.


Let us now find out why these devotees of Vishnu actually turned into demons.

Sri Maha Vishnu had two gate rulers named Jaya Vijayalu. Once Sanath's sons came to see Lord Vishnu. They think they are small children and Jaya Vijay stops them. Prevent from being sent in. The sons of Sanath, enraged at the work of Jaya Vijaya, the ruler of the gate. They are cursed to be born into the earth. Jaya Vijaya, the ruler of the gate, realizes the matter and asks Sri Maha Vishnu for absolution.


For this, Lord Vishnu says that if seven births are born as Vaishnava devotees or if three births are born with enmity with Lord Vishnu, the curse will be absolved.

Thus both the victors of Jaya want to have a feud with Lord Vishnu in three births. Thus they became Hiranyakshuda and Hiranya Kashyapudi in the Krishna era. Ravanasura as Kumbha Karnu in the third age. Born in the Dwapa era as a babysitter and dentist. After that, Lord Vishnu is cursed and reaches Vaikuntha. The Daya Vijayas of today were born in the age of Treta as Ravanasura and Kumbha Karnudila and were killed by Rama.

హనుమాన్ చాలీసా మహత్యం

ఉత్తరభారతదేశంలో క్రీ||శ||16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసుని సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోకతమయేవి.

ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు.

తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా పిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇది ఇలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్టు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టు కోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది.

స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకోన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి ‘దీర్ఘసుమంగళీభవః’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ ‘తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!’ అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభాక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీ కి వెళ్ళి బాదుషాకు స్వయముగా వవరించి తగిన చర్య తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు.

విచారణ ఇలా సాగింది:

పాదుషా: తులసీదాస్ జీ! మీరు రామనామం అన్నింటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట!

తులసీదాస్: అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా: అలాగా! రామానామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా?

తులసీదాస్: అవును ప్రభూ! రామనామానికి మించినదేమి లేదు.

పాదుషా: సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్: క్షమించండి ప్రభూ! ప్రతి జీవి జనన మనరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుతుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా: తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సుభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి!

తులసీదాస్: క్షమించండి! నేను చెప్పేది నిజం!

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్ధించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే! ఇక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హాటాత్ సంఘటనతో అదరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్త్రోతంతో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ! నీ స్త్రోత్రంతో మాకు చాల ఆనందమైంది. ఏమీకావాలో కోరుకో!’ అన్నాడు. అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నా కేమి కావాలి! నేను చేసిన నీ స్త్రోత్రం లోక క్షేమం కొఱకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్త్రోతంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకున్నాడు.

ఆమాటలతో మరింతప్రీతిచెందిన హనుమంతుడు ‘తులసీ! ఈస్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేం వహిస్తాము’ అని వాగ్దానం చేశారు.


అప్పట్నుండి ఇప్పటివరకు ‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.




వట్టివేరు గణపతి

వట్టివేరు వినాయకుడిని గృహంలో ఉంచడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఎరుపు చందన మాల.

వట్టివేరు గణపతి: వట్టివేరు అనేది గడ్డి జాతికి చెందిన మొక్క. అనేక ఔషధ విలువలు కలిగి ఉన్న ఈ వట్టివేరును ప్రాచీన కాలం నుండి అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు.

వట్టివేరు నుండి వచ్చే సుగంధం వలన ఇది ప్రత్యేకమైనది, సువాసన భరితమైనది. అనేక సౌందర్య సాధనాలలో కూడా ఈ వట్టివేరును ఉపయోగిస్తారు. వట్టివేరును ఆయుర్వేదంలో వైద్యానికి ఉపయోగిస్తారు.

వట్టివేరు గణపతి గృహంలో ఉంచడం వలన చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వట్టివేరుకు ఉన్న సుగంధం వలన మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

వ్యాపార ప్రదేశంలో ఈ వట్టివేరు గణపతిని ఉంచడం వలన అలంకరగానే కాక ఆ గణపతి అనుగ్రహంతో వ్యాపార వృద్ధి జరుగుతుంది. మీ గృహానికి నూతన శోభను తెస్తుంది.

చందన మాల - ఎరుపు - 108పూసలు ఎర్రచందనం మాల ధరించడం వల్ల భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. 

ఎర్రచందనం మాల వినాయకుడికి అనుకూలం. మరియు ఇది శక్తివంతమైనది సానుకూల శక్తిని ఇస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఈ ఎరుపు చందనమాల ఉపయోగపడుతుంది.

ఎర్రచందనం మాల ఒకరిని మానసికంగా దృఢంగా చేస్తుంది. అంతర్గత బలం మరియు సంకల్ప శక్తిని పెంచుతుంది.  ఈ మాలను పూజ మందిరంలో ఉంచవచ్చు. మిలో సానుకూలతను పెంచడంలో ఈ చందన మాల ఎంతగానో సహాయపడుతుంది. మిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సంకల్పశక్తిని పెంచుతుంది. చందన పరిమళం ఇంద్రియాలను మేల్కొల్పుతుంది. 

ఈ మాల ధారణ వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవ అనుగ్రహం కలుగుతుంది. ఈ మాల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు అజీర్ణం, తక్కువ రోగ నిరోధక శక్తి మరియు జ్వరాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

Swayambhu Sri Lakshmi Narasimhaswamy

Swayambhu Sri Lakshmi Narasimhaswamy Temple is located in the 12th Banjara Hills. The temple is one of the oldest shrines in Hyderabad.

The temple has idols of Sri Lakshmi Narasimha swamy, who is self-sufficient, and Lord Shiva, popularly known as Pancha Janya Ishwar. The specialty of this temple is that Sri Lakshmi Narasimha swamy, who is said to be self-sufficient in the temple, stands here and blesses the devotees.

The ISKCON organization has adopted the temple and is carrying out temple restoration and development activities. The temple is always crowded with devotees and delights the devotees during the evenings.

In addition to the daily pujas, special pujas and festivals are held during the festival. The crowd of devotees is high in those days.

స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం - బంజారాహిల్స్


తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ పట్టణంలోని, రోడ్ నెం. 12లోని బంజారా హిల్స్ లో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని అతి ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. 

ఈ ఆలయంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పాంచ జన్య ఈశ్వరునిగా ప్రసిద్ధిచెందిన శివుని విగ్రహాలు కలవు. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇచ్చట నిలబడి భక్తులను ఆశీర్వదించుట ఈ ఆలయంలోని ప్రత్యేకత.

ఇస్కాన్ సంస్థ వారు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకొని, ఆలయ పునరుద్దరణను, మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం సాయంకాల సమయంలో భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 

ఇచ్చట నిత్యపూజలతో పాటు, పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

Saturday, January 22, 2022

మంత్రాలయ రాఘవేంద్రస్వామి విశిష్టత

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ |
భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనవే ||

స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు వేంకటేశ్వరుని భక్తులు కావడంతో తమ కుమారునికి వెంకటనాథుడు అని పేరు పెట్టారు. 

వేంకటనాథుడు అక్షరాభ్యాసం నుంచే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టసాగాడు.నాలుగు వేదాలతో సహా ఆధ్మాత్మిక లోకంలో వినుతి కెక్కిన సకల గ్రంథాల మీదా అతను పట్టు సాధించాడు. యుక్తవయసు వచ్చేసరికి తానే పదిమందికీ బోధించే స్థాయిలో జ్ఞానాన్ని సాధించాడు.

వెంకటనాథుడు తన విద్యను ముగించుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి ఆయనకు సరస్వతీబాయితో వివాహం జరిపించారు. వారికి ఓ చక్కని కుమారుడు కూడా జన్మించాడు. అయితే వేంకటనాథడు ఆధ్మాత్మిక గ్రంథాలని కేవలం చదవలేదు. వాటిని మనసారా ఆకళింపు చేసుకున్నాడు. వాటిలో నిత్యం వినిపించే మోక్షమనే పదమే తన లక్ష్యం కావాలనుకున్నాడు. 

అందుకే కుంబకోణానికి చేరుకుని అక్కడ సుధీంద్ర తీర్థులు అనే పీఠాధిపతి వద్ద శిష్యరికం సాగించాడు. వేంకటనాథుని జ్ఞానం, వాదనాపటిమ చూసిన సుధీంద్ర తీర్థులు ముగ్థులైపోయారు. ఒకానొక సందర్భంలో ఆయన కూడా రాయలేకపోయిన ఒక ఘట్టాన్ని వేంకటనాథుడు పూరించాడట.

ఆ సందర్భంగా గురువుగారు ఆయనకు 'పరిమళాచార్య' అన్న బిరుదుని అందించారట. ఇక సుధీంద్ర తీర్థునికి అవసాన దశ రాగానే. తన వారసునిగా వేంకటనాథుడు తప్ప మరో పేరే స్ఫురించలేదు. గురువుగారి వారసత్వాన్ని కొనసాగించేందుకు, వేంకటనాథడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. 

తన ఇష్టదైవమైన రాముని పేరుమీదుగా 'రాఘవేంద్ర తీర్థులు' గా మారి గురువుగారి శ్రీమఠం బాధ్యతలను తలకెత్తుకున్నాడు.

స్వామివారు చాలా ఏళ్లు కుంబకోణలోని శ్రీమఠాన్ని నిర్వహించారు. పిదప ధర్మప్రచారం చేస్తూ ఉత్తర దిక్కుగా బయల్దేరారు. స్వామి ఒకో ఊరు దాటుతూ. తన ఉపన్యాసాలతోనూ, తర్కంతోనూ ప్రజలందరినీ భక్తి మార్గానికి మరలిస్తూ సాగారు. ఆ సందర్భంగా ఆయనకు 'గురుసార్వభౌమ' అన్న బిరుదు వరించింది. 

ఇలా సాగుతున్న స్వామివారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖికి చేరుకున్నారు. అక్కడ 12 సంవత్సరాల పాటు పంచముఖి ఆంజనేయుని ఉపాసించారట. ఆయన దీక్షకు మెచ్చి ఆ స్వామివారు పంచముఖి రూపంలోనే దర్శనమిచ్చారట.

అక్కడి నుంచి స్వామి ఆదోనికి చేరుకున్నాడు. అప్పట్లో మసూద్ఖాన్ అనే ముస్లిం రాజు అదోనిని పాలించేవాడు. స్వామివారి మహిమలకు ముగ్ధుడైన మసూద్ఖాన్, తన రాజ్యంలో స్వామివారికి ఎలాంటి లోటూ ఉండదని హామీ ఇచ్చాడు. స్వామివారు సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుని అవతారం అని భక్తులు విశ్వాసం. అందుకు తగినట్లుగానే ప్రహ్లాదుని రాజ్యంలోని భాగమని చెప్పబడుతున్న మాంచాల అనే గ్రామానికి చేరుకున్నారు రాఘవేంద్రులు. అక్కడే తాను జీవసమాధి చెందబోతున్నట్లు ప్రకటించారు.

1671 శ్రావణ బహుళ విదియనాడు స్వామివారు సాలగ్రామాల తో, వేదమంత్రాల సాక్షిగా. సజీవంగా మాంచాల గ్రామంలోని బృందావనంలోకి ప్రవేశించారు. అదే ఇప్పుడు మంత్రాలయం అన్న పేరుతో పిలవబడుతోంది. తాను బృందావనంలోకి ప్రవేశించినప్పటికీ, 700 ఏళ్లపాటు జీవించే ఉంటానని ఆయన చెప్పారట. 

అందుకు సాక్ష్యంగా ఇప్పటికీ స్వామివారు పలుభక్తులకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. బ్రటిష్వారు పాలించే సమయంలో కర్నూలు కలెక్టరుగా విధులు నిర్వహించిన సర్ థామస్ మన్రోకు సైతం స్వామివారు కనిపించినట్లు తెలుస్తోంది.

మధ్వాచార్యులు స్థాపించిన ద్వైతమత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలోనే రాఘవేంద్రులు తన జీవితాన్ని గడిపేశారు. కేవలం ప్రవనచాల ద్వారానే కాకుండా సుధాపరిమళం వంటి అనేక గ్రంథాలను రచించడం ద్వారా మధ్వ సిద్ధాంతాన్ని బలపరిచారు. 

జ్ఞానాన్ని పలికించడంలోనే కాదు, సరిగమలు వినిపించడంలోనూ స్వామివారు దిట్ట. ఆయన వీణ మోగిస్తుంటే అలౌకికమైన అనుభూతి కలిగేదట. ఇప్పటికీ మంత్రాలయంలోని ఆయన సన్నిధికి చేరుకున్న ప్రతిఒక్కరికీ ఇదే అనుభూతి కలుగుతూ ఉంటుంది.

జై భీమ్ సినిమా తరహాలో చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం

#జైభీమ్ #సినిమా తరహాలో చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం. దొంగతనం పేరుతో చిత్ర హింసలు

తిరుపతి: దొంగతనం పేరుతో ఓ మహిళను పోలీసులు చిత్ర హింసలు చేసిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని లక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది.

వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరి నీ ప్రశ్నించారు. నగదు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు. ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియా ప్రతినిధుల కు తెలిపారు.

అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్ కు పిలిచి ఒక మగ, మరొక మహిళా కానిస్టేబుల్స్ తన కాళ్ళు చేతులు కట్టి వేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు.

అనంతరం CI దగ్గర నన్ను హాజరుపరచగా ఆయన నాకు చెప్పిన మాట, నీ వేలు ముద్రలు మ్యాచ్ కాలేదు, ఈ దొంగతనం తో నీకు సంబంధం లేదు మాకు తెలిసింది, నిన్ను వదిలి పెడతాము, నిన్ను కొట్టినట్లు ఎవరికీ చెప్పొద్దు, ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను, చెప్పినారు, మళ్లీ సిఐ ఎదురుగా నన్ను కొట్టి తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని ఆమె మీడియాకు వివరించింది.

తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త దీన, తల్లి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ కులానికి చెందిన తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు.

Friday, January 21, 2022

దురాశ - భీముడు సంతోషిస్తూ ఆ మణి తీసుకుని ఇంటికి వెళ్ళాడు

దురాశ: శ్రీరంగం అనే గ్రామంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్ళి చెట్లు నరికి, వాటివల్ల లభించే కట్టెలను ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అమ్ముకొని జీవించేవాడు. ఒకరోజు భీమయ్య ఎప్పటిలాగే ఒక పెద్ద చెట్టు ఎంచుకుని దాన్ని నరకడం మొదలు పెట్టాడు. 

ఆ చెట్టుకింద పుట్టలో ఒక పాము ఉంది. అది భీమయ్య గొడ్డలి శబ్దానికి బయటకు వచ్చింది. “అయ్యో, ఈ చెట్టు నా నివాసం దీన్ని కూలదోయకు” అని ప్రార్థించింది పాము. “నిజమే! కాని ఇదే నా జీవనాధారం. ఈ చెట్టు కట్టెలు అమ్ముకుని నాలుగు డబ్బులు వస్తే కాని నా కడుపు నిండదు” అని చెప్పాడు భీమయ్య. “ఈ చెట్టును కొట్టి కట్టెలమ్మినంత మాత్రాన నీకు ఈ రోజు గడుస్తుందే కాని నీ పేదరికం తీరదు. ఈ చెట్టును నువ్వు కొట్టకుండా వదిలేస్తే నీకో బహుమతి ఇస్తాను” అంది పాము.

పాము మాటలతో చెట్టును కొట్టే ప్రయత్నం మానుకున్నాడు భీమయ్య. పాము తన పుట్టలోనికి వెళ్ళి ఒక మణిని తెచ్చి భీమయ్యకు ఆ మణి ఇస్తూ "ఇది చాలా విలువైనది. దీనిని అమ్ముకుంటే నీకెంతో డబ్బు వస్తుంది. ఆ డబ్బు అయిపోయాక మళ్ళీ రా! నీకు మణులిస్తాను” అని చెప్పింది.

భీముడు సంతోషిస్తూ ఆ మణి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పాము చెప్పినట్టే దానిని అమ్ముకుంటే చాలా ధనం వచ్చింది. ఆ ధనంతో అతడు కొంతకాలం సుఖంగా కాలం గడిపాడు. ధనం అయిపోయాక మళ్ళీ పాము దగ్గరకు వెళ్ళి మరొక మణి తెచ్చుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజు అతని మనసులో ఒక దురాలోచన వచ్చింది. వెంటనే పాము దగ్గరకు వెళ్ళి "అస్తమాను నీ దగ్గరకు రావడం విసుగ్గా ఉంది. ఒక బస్తా నిండా రత్నాలు ఇస్తే ఇక ఇక్కడికి రాను” అని అడిగాడు.

పాము భీమయ్య అత్యాశకు ఆశ్చర్యపోతూ.. “మానవుడా! నేను అన్నీ ఒకసారే ఇవ్వలేను. అంత శక్తి నాకు లేదు. ఒక మణి ఇచ్చిన కొన్ని రోజులకు గాని మరొక మణిని ఇవ్వలేను” అని చెప్పింది. పాము సమాధానం విని బీమయ్యకి కోపం వచ్చింది. ఎలాగైనా పామును చంపి, పుట్టని తవ్వి మణులన్నీ ఒక్కసారే తీసుకోవాలనుకున్నాడు.

ఒకరోజు పాముపుట్ట దగ్గరకు కొంత గడ్డి తీసుకొచ్చి, అలికిడి చేయకుండా పాము పుట్టలో ఆ గడ్డిని దూర్చి నిప్పు పెట్టాడు. నిప్పు ఆరిపోయాక పుట్టని తవ్వాడు. అతని పథకం ప్రకారం పాము లోపలే మాడి చచ్చిపోవాలి. కాని మణులు కాదు కదా చచ్చినపాము కూడా అతని కంటికి కనబడలేదు. అవాక్కయ్యాడు భీమయ్య. మణుల జాడ లేదు. పాము జాడ లేదు. భీమయ్య నిరాశతో దుఃఖిస్తూ ఇంటిదారి పట్టాడు.

ఇదంతా దూరంగా ఒక పొదచాటునుండి గమనించింది పాము. 'ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించి నేను ముందు జాగ్రత్తపడడం మంచిదయ్యింది. అమ్మో, ఈ మానవులను నమ్మకూడదు' అనుకుంటూ మరొక నివాస ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్ళిపోయింది పాము.

శ్రీ చింతపూర్ణి దేవి ఆలయం, ఉనా, హిమాచల్ ప్రదేశ్

శ్రీ చింతపూర్ణి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోని ఉనా గ్రామంలో ఉన్న ఒక పురాతన భారతీయ ఆలయం. ఈ ఆలయాన్ని చిన్నమాస్తా ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం రెండు భారతీయ రాష్ట్రాల సరిహద్దులో ఉంది: పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్.

చింతపూర్ణి ఆలయం 51 సిద్ధపీఠాలలో ఒకటి మరియు ఏడు ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. భారతదేశం మరియు విదేశాల నుండి భక్తులు ప్రధానంగా నవరాత్రాల సమయంలో ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. చింతాపూర్ణి ఆలయాన్ని సరస్వత్ భ్రాహ్మిన్ అయిన పిటి మాయి దాస్ స్థాపించారని నమ్ముతారు. నేటికీ, అతని వారసులు ఉనాలో ఉండి దేవాలయంలో దేవతను ఆరాధిస్తారు.

పురాణాల ప్రకారం, దేవి సతి తన తండ్రి రాజు దక్షేశ్వర నిర్వహించిన యజ్ఞం యొక్క మంటల్లోకి దూకి తన జీవితాన్ని అర్పించ్చింది. శివుడు సతీదేవి మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకొని విశ్వం చుట్టూ తిరుగుతున్నప్పుడు, విష్ణువు తన శరీరాన్ని 51 భాగాలుగా తన సుదర్శన్ చక్రం ఉపయోగించి కత్తిరించాడు. 51 భాగాలలో దేవి సతీ నుదిటి ఈ ప్రదేశంలో పడిందని చెపుతారు.

చిన్నమాస్తా దేవి ఆలయాన్ని రుద్ర మహాదేవుడు నాలుగు వైపుల నుండి రక్షించాడని కూడా అంటారు. ఈ ఆలయం చుట్టూ నాలుగు దిశలలో శివుడి ఆలయాలు ఉన్నాయి. కైలాశ్వర్ మహాదేవ ఆలయం చింతపూర్ణి ఆలయానికి తూర్పు దిశలో ఉంది. పశ్చిమాన నారాయణ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ఖండ్ మహాదేవ ఆలయం, దక్షిణాన శివ బాడి ఆలయం ఉన్నాయి.

మార్కండేయ పురాణం ప్రకారం, దేవి చండి యుద్ధంలో అందరు రాక్షసులను ఓడించింది ఆ తరువాత జయ మరియు విజయ అనే ఇద్దరు దేవి దేవి చండి నుండి ఉద్భవించారు. వారుకూడా ఎంతోమంది రాక్షసులతో పోరాడి వారిరక్తం తాగిన వారికి ఇంకా రక్తదాహం తీరలేదు వారి దాహాన్ని తీర్చడానికి, దేవి చండి ఆమె తల కత్తిరించారు.

చాలా చిత్రాలలో, దేవి చండి ఆమె తలని ఆమె చేతుల్లో పట్టుకున్నట్లు చూపబడింది మరియు దేవి జయ మరియు విజయ వారి దాహం తీర్చడానికి ఆమె గొంతు నుండి వచ్చే రక్తాన్ని తాగుతాగి వారి రక్తదాహం తీర్చుకున్నారు ఈ ఆలయంలో నిష్టతో పూజలు చేసి భక్తితో మొక్కుకున్నవారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

నర్మదా లింగాన్ని చూసినంతమాత్రాన్నే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సమస్త పాపాలు నశించును.

సమస్త బోగభాగ్యాలు పొందుటకు లక్ష్మీ నారాయణ సాలిగ్రామం.

నర్మదా శివలింగం బానలింగం మరియు ఇత్తడి పానపట్టం
బాణలింగాలు ఎక్కువుగా నర్మదా నది తిరప్రాంతాలలోనే ఎక్కువుగా లభిస్తాయి.

బాణలింగాన్ని పూజించినంతనే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

బంగారం, వెండి, మట్టి వంటి తదితర శివలింగాలను పూజించడం కలిగే పుణ్యఫలం ఒక్క నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన కలుగుతాయి.

ఈ బాణలింగాన్ని పూజించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి.

బాణలింగాలకు అభిషేకం చేసిన జలం సేవించిన వారికి కాలసర్ప దోషం ఉండదు.అభిషేక జలం త్రిదోషహరం, ఆరోగ్యకరం.

నర్మదా లింగాన్ని చూసినంతమాత్రాన్నే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సమస్త పాపాలు నశించునని పురాణాలు తెలుపుతున్నాయి.

శ్రీ లక్ష్మీ నారాయణ సాలిగ్రామ మాల సాలిగ్రామాన్ని రోజూ పూజించేవారు. ఆరోగ్యంతో అలాగే సంపదతో తులతూగుతారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఇందులో కొలువై ఉంటారు. 

నేపాల్లోని గండకి నది వద్ద శాలిగ్రామాలు విస్తృతంగా లభిస్తాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితంనుంచి ఈ ప్రాంతంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని నమ్మకం. 

పురాణాలలో శాలిగ్రామ శిల ప్రాముఖ్యత గురించి దానిని పూజించడం వెనుక గల ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది.ఈ సాలిగ్రామాలు అధిక శక్తివంతమైనవి, అద్భుతమైనవి.

నియమ నిష్ఠలతో ఈ సాలిగ్రామాలను పూజించడం వలన సకల సంపదలు కలిగి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.

ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు.సాలగ్రామానికి చేసిన అభిషేక తీర్ధం నిత్యం సేవించడం వలన సర్వదేవతానుగ్రహం లభిస్తుంది.

ఆ లక్ష్మీ నారాయణుల పరిపూర్ణ కటాక్షంతో భోగభాగ్యాలు అనుభవించి ముక్తి పొందుతారు.సర్వరోగాల నుండి విముక్తికి సాలగ్రామ మాల.

Thursday, January 20, 2022

పురుషర్షభ అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు

భగవద్గీత
రెండవ అధ్యాయం

నిన్న 
ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. అటువంటప్పుడు ఇక విచారం దేనికి? అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఈ విషయాన్నే అక్కడ సంజయుడు దృతరాష్ట్రునికి చెప్తున్నాడు.

ఈరోజు
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినోஉనిత్యాః
తాంస్తితిక్షస్వ భారత 14

తాత్పర్యం: ఓ కౌంతేయా! ఇంద్రియాలకు సంబంధించిన ఎండాకాలం, చలికాలం, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తాయి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి తాత్కాలికంగా జరుగుతూ ఉంటాయి. ఓ భారతా! వాటిని సహించ వలసిందే.

వ్యాఖ్యానం: అర్జునుడు కుంతీ పుత్రుడు కాబట్టి కౌంతేయ అని పిలువబడ్డాడు. భరత వంశస్థుడు కాబట్టి భారతా అని పిలవబడ్డాడు.

చలి, ఎండ, సుఖం, దుఃఖం ఇవి తాత్కాలికంగా వస్తుంటాయి, పోతుంటాయి. వీటికి మనం అలవాటు పడాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు విచారించడం బుద్ధిమంతుల లక్షణం కాదు. వీటిని మనం అలవాటుగా చేసుకోవాలి.

యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం
సోஉమృతత్వాయ కల్పతే 15

తాత్పర్యం: ఓ పురుష శ్రేష్టుడా! అర్జునా! ఎవరైతే చలికి గాని, వేడికి గాని తట్టుకుంటారో, ఎవరైతే సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా చూస్తారో, వారు మోక్షానికి అర్హులు.

వ్యాఖ్యానం: పురుషర్షభ అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు.అంటే పురుషులలో శ్రేష్ఠుడు అని అర్థం. శీతోష్ణాలను, సుఖదుఃఖాలను ఎవరైతే సమానంగా చూస్తారో వారిని పురుషులలో శ్రేష్ఠుడు గా భావించవచ్చు. అర్జునుడు అలాంటి గుణాలను కలిగి ఉన్నాడని శ్రీకృష్ణుడి భావం కావచ్చు. అప్పుడు అర్జునుడు మోక్షానికి కూడా అర్హత సాధించినట్లే.

మనకు ఆ అర్హత ఉందా అని మీరు బాగా ఆలోచించండి. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తాం. కష్టం వచ్చినప్పుడు కుమిలిపోతాం. వ్యాపారం చేసినప్పుడు లాభం వస్తే సంతోషిస్తాం. నష్టం వస్తే ఏడుస్తాం. అలా కాకుండా దానికి కారణాలు తెలుసుకుని, మరలా ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి.

అదే విధంగా విద్యార్థులు పరీక్షల్లో పాసయితే పార్టీ ఇస్తారు. ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. అలా కాకుండా ఎక్కడ ఫెయిలయ్యారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే మార్గం చూసుకోవాలి. ఏ విషయంలోనైనా సరే అంతే. ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కాదు.

మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్జునుడే. మనందరికీ ఉపదేశం చేయబోయేది ఆ శ్రీకృష్ణపరమాత్మే.

Wednesday, January 19, 2022

గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా?

శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తుందని చెబుతారు. 
అంతే కాదు #శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, #శడగోప్యం అని అంటారు. శఠగోపం అంటే త్యంత గోప్యమైనది అని అర్థం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.

శఠగోపం విశేషాలు:
శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు.

అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.

శఠగోపం వలన కలిగే ఫలితం:
శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.

శ్రీ #మహాభారతం - #శాంతిపర్వం. #శారిక - #బ్రహ్మదత్తుల #సంవాదం

మహాభారతం - శాంతి పర్వం -39(2) - ముఖ్యంగా అయిదు రీతుల పగ పుడుతుంది.

బ్రహ్మదత్తుడు: ఓ పూజనీ! ‘నీవన్నది నిజమే! ఈ విషయంలో నీ దోషమేమీలేదు. కానీ నీవు వెళ్లి పోతే మాత్రం నామనసుకు కష్టంగా వుంటుంది,కనుక ఇక్కడే వుండు’మన్నాడు.

శారిక : రాజా! ఒకరి నొకరం నొప్పించుకొన్నాము. దీని వలన మనసులో చల్లారని పెద్ద పగ ఏర్పడింది. అయినా నీ తియ్యని మాటలకు మోసపోయి మళ్ళీ కలిసి మెలసి వుండడం కుదరద'ని చెప్పింది.

బ్రహ్మదత్తుడు: నాబిడ్డ చేసిన దానికి నీవు ప్రతీకారంగా గుడ్లు పీకేశావు. అంతటితో పగ తీరి పోతుంది. ఎటువంటి నీచులైనా దగ్గరకు చేరిన బుద్దిమంతులను వారు చేసిన మేలును మరచి నింద మోపరు కదా! 

శారిక: రాజా! స్నేహం చెడిపోయినా, తియ్యని మాటల మాయలో పడిపోయి ఆ పగను మరచి పోవచ్చు కానీ ... దాని వలన చావు సంభవించవచ్చు. కలత పుట్టవచ్చు. కీడు పొందవచ్చు. అంతేగానీ మంచి మాత్రం జరుగదు. 

'వినుము! నేల దోఁచికొనినను దాయాదులైన మాట మాటకేని నాఁడు వారి యెడను గీడు వారక చేసినఁ బగ జనించు నిట్లు భంగులైదు'

ఓ రాజా! ముఖ్యంగా అయిదు రీతుల పగ పుడుతుంది. భూమి దురాక్రమణవలన, దాయాదుల వలన, ఆడవారి వలన, మాటామాటా పెరిగి నందువలన, అడ్డూ ఆపూ లేని చెడు తలపెట్టడం వలన పగ పుడుతుంది. పగ పుట్టిన తరువాత ఒక పట్టాన పోదు. అది చెట్టులో దాగిన నిప్పువలె మనసులో దాగి వుంటుంది. కాబట్టి నమ్మితే మాత్రం ఎప్పుడైనా చెడిపోతాడు. అంతేకాదు కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను, కన్న సంతానాన్ని,స్నేహితులను కూడా నమ్మవద్దని నీతి శాస్త్రం చేతున్నది. కనుక మనసు నిండా పగ పూనిన వాళ్ళను ఏవిధంగా నమ్మాలి? ఇక నీ చతురోక్తులు చాలించు.

బ్రహ్మదత్తుడు: శారికా! కాలాన్ని బట్టి జనానికి మంచి చెడులు కలుగుతూ వుంటాయి. వాటిని దాటి ముందుకు పోవడం మన వశమౌతుందా? అంతెందుకు? నిన్ను వదులు కోవడానికి నేనేమైన వెఱ్రి వాడనా?

శారిక: (బ్రహ్మ దత్తుని వైపు తీక్షణంగా చూసి) రాజా నీ చల్లని మాటల మాటున దాగిన కోపం సముద్రంలో దాగిన బడబాగ్ని వంటిది' అని పలికి రాజుపై తనకు గల అపనమ్మకాన్ని బైట పడనీకుండానే పూజని తనకు అనువైన చోటుకు ఎగిరి పోయింది. అందువలన ధర్మజా! ప్రజలెవ్వరినీ రాజు గుడ్డిగా నమ్మరాదు. అప్పుడే తననూ, తన సంపత్తినీ రక్షించు కోగలుగుతాడు. భారద్వాజ వంశసంభవుడు ‘కణికుడు’ సౌవీర రాజు శత్రుంజయుడికి ఉపదేశించిన నీతి వాక్యాలు విను. (ఆది పర్వంలో ఒక కణికుడు దుర్యోధనుడికి దుర్బోధ చేశాడు. అతను వేరు. అతడు శకునికి మంత్రి).

జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.


Image #TheQuint

చివరి శ్వాసను విడుస్తున్న, జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. 

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 

"జాగ్రత్త! ఓ మృత్యువా! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! 

మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. 

అదే సమయంలో, జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. 

జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...