Sunday, January 23, 2022

స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం - బంజారాహిల్స్


తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ పట్టణంలోని, రోడ్ నెం. 12లోని బంజారా హిల్స్ లో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని అతి ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. 

ఈ ఆలయంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పాంచ జన్య ఈశ్వరునిగా ప్రసిద్ధిచెందిన శివుని విగ్రహాలు కలవు. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇచ్చట నిలబడి భక్తులను ఆశీర్వదించుట ఈ ఆలయంలోని ప్రత్యేకత.

ఇస్కాన్ సంస్థ వారు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకొని, ఆలయ పునరుద్దరణను, మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం సాయంకాల సమయంలో భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 

ఇచ్చట నిత్యపూజలతో పాటు, పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

Saturday, January 22, 2022

మంత్రాలయ రాఘవేంద్రస్వామి విశిష్టత

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ |
భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనవే ||

స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు వేంకటేశ్వరుని భక్తులు కావడంతో తమ కుమారునికి వెంకటనాథుడు అని పేరు పెట్టారు. 

వేంకటనాథుడు అక్షరాభ్యాసం నుంచే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టసాగాడు.నాలుగు వేదాలతో సహా ఆధ్మాత్మిక లోకంలో వినుతి కెక్కిన సకల గ్రంథాల మీదా అతను పట్టు సాధించాడు. యుక్తవయసు వచ్చేసరికి తానే పదిమందికీ బోధించే స్థాయిలో జ్ఞానాన్ని సాధించాడు.

వెంకటనాథుడు తన విద్యను ముగించుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి ఆయనకు సరస్వతీబాయితో వివాహం జరిపించారు. వారికి ఓ చక్కని కుమారుడు కూడా జన్మించాడు. అయితే వేంకటనాథడు ఆధ్మాత్మిక గ్రంథాలని కేవలం చదవలేదు. వాటిని మనసారా ఆకళింపు చేసుకున్నాడు. వాటిలో నిత్యం వినిపించే మోక్షమనే పదమే తన లక్ష్యం కావాలనుకున్నాడు. 

అందుకే కుంబకోణానికి చేరుకుని అక్కడ సుధీంద్ర తీర్థులు అనే పీఠాధిపతి వద్ద శిష్యరికం సాగించాడు. వేంకటనాథుని జ్ఞానం, వాదనాపటిమ చూసిన సుధీంద్ర తీర్థులు ముగ్థులైపోయారు. ఒకానొక సందర్భంలో ఆయన కూడా రాయలేకపోయిన ఒక ఘట్టాన్ని వేంకటనాథుడు పూరించాడట.

ఆ సందర్భంగా గురువుగారు ఆయనకు 'పరిమళాచార్య' అన్న బిరుదుని అందించారట. ఇక సుధీంద్ర తీర్థునికి అవసాన దశ రాగానే. తన వారసునిగా వేంకటనాథుడు తప్ప మరో పేరే స్ఫురించలేదు. గురువుగారి వారసత్వాన్ని కొనసాగించేందుకు, వేంకటనాథడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. 

తన ఇష్టదైవమైన రాముని పేరుమీదుగా 'రాఘవేంద్ర తీర్థులు' గా మారి గురువుగారి శ్రీమఠం బాధ్యతలను తలకెత్తుకున్నాడు.

స్వామివారు చాలా ఏళ్లు కుంబకోణలోని శ్రీమఠాన్ని నిర్వహించారు. పిదప ధర్మప్రచారం చేస్తూ ఉత్తర దిక్కుగా బయల్దేరారు. స్వామి ఒకో ఊరు దాటుతూ. తన ఉపన్యాసాలతోనూ, తర్కంతోనూ ప్రజలందరినీ భక్తి మార్గానికి మరలిస్తూ సాగారు. ఆ సందర్భంగా ఆయనకు 'గురుసార్వభౌమ' అన్న బిరుదు వరించింది. 

ఇలా సాగుతున్న స్వామివారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖికి చేరుకున్నారు. అక్కడ 12 సంవత్సరాల పాటు పంచముఖి ఆంజనేయుని ఉపాసించారట. ఆయన దీక్షకు మెచ్చి ఆ స్వామివారు పంచముఖి రూపంలోనే దర్శనమిచ్చారట.

అక్కడి నుంచి స్వామి ఆదోనికి చేరుకున్నాడు. అప్పట్లో మసూద్ఖాన్ అనే ముస్లిం రాజు అదోనిని పాలించేవాడు. స్వామివారి మహిమలకు ముగ్ధుడైన మసూద్ఖాన్, తన రాజ్యంలో స్వామివారికి ఎలాంటి లోటూ ఉండదని హామీ ఇచ్చాడు. స్వామివారు సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుని అవతారం అని భక్తులు విశ్వాసం. అందుకు తగినట్లుగానే ప్రహ్లాదుని రాజ్యంలోని భాగమని చెప్పబడుతున్న మాంచాల అనే గ్రామానికి చేరుకున్నారు రాఘవేంద్రులు. అక్కడే తాను జీవసమాధి చెందబోతున్నట్లు ప్రకటించారు.

1671 శ్రావణ బహుళ విదియనాడు స్వామివారు సాలగ్రామాల తో, వేదమంత్రాల సాక్షిగా. సజీవంగా మాంచాల గ్రామంలోని బృందావనంలోకి ప్రవేశించారు. అదే ఇప్పుడు మంత్రాలయం అన్న పేరుతో పిలవబడుతోంది. తాను బృందావనంలోకి ప్రవేశించినప్పటికీ, 700 ఏళ్లపాటు జీవించే ఉంటానని ఆయన చెప్పారట. 

అందుకు సాక్ష్యంగా ఇప్పటికీ స్వామివారు పలుభక్తులకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. బ్రటిష్వారు పాలించే సమయంలో కర్నూలు కలెక్టరుగా విధులు నిర్వహించిన సర్ థామస్ మన్రోకు సైతం స్వామివారు కనిపించినట్లు తెలుస్తోంది.

మధ్వాచార్యులు స్థాపించిన ద్వైతమత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలోనే రాఘవేంద్రులు తన జీవితాన్ని గడిపేశారు. కేవలం ప్రవనచాల ద్వారానే కాకుండా సుధాపరిమళం వంటి అనేక గ్రంథాలను రచించడం ద్వారా మధ్వ సిద్ధాంతాన్ని బలపరిచారు. 

జ్ఞానాన్ని పలికించడంలోనే కాదు, సరిగమలు వినిపించడంలోనూ స్వామివారు దిట్ట. ఆయన వీణ మోగిస్తుంటే అలౌకికమైన అనుభూతి కలిగేదట. ఇప్పటికీ మంత్రాలయంలోని ఆయన సన్నిధికి చేరుకున్న ప్రతిఒక్కరికీ ఇదే అనుభూతి కలుగుతూ ఉంటుంది.

జై భీమ్ సినిమా తరహాలో చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం

#జైభీమ్ #సినిమా తరహాలో చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం. దొంగతనం పేరుతో చిత్ర హింసలు

తిరుపతి: దొంగతనం పేరుతో ఓ మహిళను పోలీసులు చిత్ర హింసలు చేసిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని లక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది.

వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరి నీ ప్రశ్నించారు. నగదు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు. ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియా ప్రతినిధుల కు తెలిపారు.

అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్ కు పిలిచి ఒక మగ, మరొక మహిళా కానిస్టేబుల్స్ తన కాళ్ళు చేతులు కట్టి వేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు.

అనంతరం CI దగ్గర నన్ను హాజరుపరచగా ఆయన నాకు చెప్పిన మాట, నీ వేలు ముద్రలు మ్యాచ్ కాలేదు, ఈ దొంగతనం తో నీకు సంబంధం లేదు మాకు తెలిసింది, నిన్ను వదిలి పెడతాము, నిన్ను కొట్టినట్లు ఎవరికీ చెప్పొద్దు, ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను, చెప్పినారు, మళ్లీ సిఐ ఎదురుగా నన్ను కొట్టి తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని ఆమె మీడియాకు వివరించింది.

తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త దీన, తల్లి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ కులానికి చెందిన తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు.

Friday, January 21, 2022

దురాశ - భీముడు సంతోషిస్తూ ఆ మణి తీసుకుని ఇంటికి వెళ్ళాడు

దురాశ: శ్రీరంగం అనే గ్రామంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్ళి చెట్లు నరికి, వాటివల్ల లభించే కట్టెలను ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అమ్ముకొని జీవించేవాడు. ఒకరోజు భీమయ్య ఎప్పటిలాగే ఒక పెద్ద చెట్టు ఎంచుకుని దాన్ని నరకడం మొదలు పెట్టాడు. 

ఆ చెట్టుకింద పుట్టలో ఒక పాము ఉంది. అది భీమయ్య గొడ్డలి శబ్దానికి బయటకు వచ్చింది. “అయ్యో, ఈ చెట్టు నా నివాసం దీన్ని కూలదోయకు” అని ప్రార్థించింది పాము. “నిజమే! కాని ఇదే నా జీవనాధారం. ఈ చెట్టు కట్టెలు అమ్ముకుని నాలుగు డబ్బులు వస్తే కాని నా కడుపు నిండదు” అని చెప్పాడు భీమయ్య. “ఈ చెట్టును కొట్టి కట్టెలమ్మినంత మాత్రాన నీకు ఈ రోజు గడుస్తుందే కాని నీ పేదరికం తీరదు. ఈ చెట్టును నువ్వు కొట్టకుండా వదిలేస్తే నీకో బహుమతి ఇస్తాను” అంది పాము.

పాము మాటలతో చెట్టును కొట్టే ప్రయత్నం మానుకున్నాడు భీమయ్య. పాము తన పుట్టలోనికి వెళ్ళి ఒక మణిని తెచ్చి భీమయ్యకు ఆ మణి ఇస్తూ "ఇది చాలా విలువైనది. దీనిని అమ్ముకుంటే నీకెంతో డబ్బు వస్తుంది. ఆ డబ్బు అయిపోయాక మళ్ళీ రా! నీకు మణులిస్తాను” అని చెప్పింది.

భీముడు సంతోషిస్తూ ఆ మణి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పాము చెప్పినట్టే దానిని అమ్ముకుంటే చాలా ధనం వచ్చింది. ఆ ధనంతో అతడు కొంతకాలం సుఖంగా కాలం గడిపాడు. ధనం అయిపోయాక మళ్ళీ పాము దగ్గరకు వెళ్ళి మరొక మణి తెచ్చుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజు అతని మనసులో ఒక దురాలోచన వచ్చింది. వెంటనే పాము దగ్గరకు వెళ్ళి "అస్తమాను నీ దగ్గరకు రావడం విసుగ్గా ఉంది. ఒక బస్తా నిండా రత్నాలు ఇస్తే ఇక ఇక్కడికి రాను” అని అడిగాడు.

పాము భీమయ్య అత్యాశకు ఆశ్చర్యపోతూ.. “మానవుడా! నేను అన్నీ ఒకసారే ఇవ్వలేను. అంత శక్తి నాకు లేదు. ఒక మణి ఇచ్చిన కొన్ని రోజులకు గాని మరొక మణిని ఇవ్వలేను” అని చెప్పింది. పాము సమాధానం విని బీమయ్యకి కోపం వచ్చింది. ఎలాగైనా పామును చంపి, పుట్టని తవ్వి మణులన్నీ ఒక్కసారే తీసుకోవాలనుకున్నాడు.

ఒకరోజు పాముపుట్ట దగ్గరకు కొంత గడ్డి తీసుకొచ్చి, అలికిడి చేయకుండా పాము పుట్టలో ఆ గడ్డిని దూర్చి నిప్పు పెట్టాడు. నిప్పు ఆరిపోయాక పుట్టని తవ్వాడు. అతని పథకం ప్రకారం పాము లోపలే మాడి చచ్చిపోవాలి. కాని మణులు కాదు కదా చచ్చినపాము కూడా అతని కంటికి కనబడలేదు. అవాక్కయ్యాడు భీమయ్య. మణుల జాడ లేదు. పాము జాడ లేదు. భీమయ్య నిరాశతో దుఃఖిస్తూ ఇంటిదారి పట్టాడు.

ఇదంతా దూరంగా ఒక పొదచాటునుండి గమనించింది పాము. 'ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించి నేను ముందు జాగ్రత్తపడడం మంచిదయ్యింది. అమ్మో, ఈ మానవులను నమ్మకూడదు' అనుకుంటూ మరొక నివాస ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్ళిపోయింది పాము.

శ్రీ చింతపూర్ణి దేవి ఆలయం, ఉనా, హిమాచల్ ప్రదేశ్

శ్రీ చింతపూర్ణి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోని ఉనా గ్రామంలో ఉన్న ఒక పురాతన భారతీయ ఆలయం. ఈ ఆలయాన్ని చిన్నమాస్తా ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం రెండు భారతీయ రాష్ట్రాల సరిహద్దులో ఉంది: పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్.

చింతపూర్ణి ఆలయం 51 సిద్ధపీఠాలలో ఒకటి మరియు ఏడు ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. భారతదేశం మరియు విదేశాల నుండి భక్తులు ప్రధానంగా నవరాత్రాల సమయంలో ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. చింతాపూర్ణి ఆలయాన్ని సరస్వత్ భ్రాహ్మిన్ అయిన పిటి మాయి దాస్ స్థాపించారని నమ్ముతారు. నేటికీ, అతని వారసులు ఉనాలో ఉండి దేవాలయంలో దేవతను ఆరాధిస్తారు.

పురాణాల ప్రకారం, దేవి సతి తన తండ్రి రాజు దక్షేశ్వర నిర్వహించిన యజ్ఞం యొక్క మంటల్లోకి దూకి తన జీవితాన్ని అర్పించ్చింది. శివుడు సతీదేవి మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకొని విశ్వం చుట్టూ తిరుగుతున్నప్పుడు, విష్ణువు తన శరీరాన్ని 51 భాగాలుగా తన సుదర్శన్ చక్రం ఉపయోగించి కత్తిరించాడు. 51 భాగాలలో దేవి సతీ నుదిటి ఈ ప్రదేశంలో పడిందని చెపుతారు.

చిన్నమాస్తా దేవి ఆలయాన్ని రుద్ర మహాదేవుడు నాలుగు వైపుల నుండి రక్షించాడని కూడా అంటారు. ఈ ఆలయం చుట్టూ నాలుగు దిశలలో శివుడి ఆలయాలు ఉన్నాయి. కైలాశ్వర్ మహాదేవ ఆలయం చింతపూర్ణి ఆలయానికి తూర్పు దిశలో ఉంది. పశ్చిమాన నారాయణ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ఖండ్ మహాదేవ ఆలయం, దక్షిణాన శివ బాడి ఆలయం ఉన్నాయి.

మార్కండేయ పురాణం ప్రకారం, దేవి చండి యుద్ధంలో అందరు రాక్షసులను ఓడించింది ఆ తరువాత జయ మరియు విజయ అనే ఇద్దరు దేవి దేవి చండి నుండి ఉద్భవించారు. వారుకూడా ఎంతోమంది రాక్షసులతో పోరాడి వారిరక్తం తాగిన వారికి ఇంకా రక్తదాహం తీరలేదు వారి దాహాన్ని తీర్చడానికి, దేవి చండి ఆమె తల కత్తిరించారు.

చాలా చిత్రాలలో, దేవి చండి ఆమె తలని ఆమె చేతుల్లో పట్టుకున్నట్లు చూపబడింది మరియు దేవి జయ మరియు విజయ వారి దాహం తీర్చడానికి ఆమె గొంతు నుండి వచ్చే రక్తాన్ని తాగుతాగి వారి రక్తదాహం తీర్చుకున్నారు ఈ ఆలయంలో నిష్టతో పూజలు చేసి భక్తితో మొక్కుకున్నవారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

నర్మదా లింగాన్ని చూసినంతమాత్రాన్నే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సమస్త పాపాలు నశించును.

సమస్త బోగభాగ్యాలు పొందుటకు లక్ష్మీ నారాయణ సాలిగ్రామం.

నర్మదా శివలింగం బానలింగం మరియు ఇత్తడి పానపట్టం
బాణలింగాలు ఎక్కువుగా నర్మదా నది తిరప్రాంతాలలోనే ఎక్కువుగా లభిస్తాయి.

బాణలింగాన్ని పూజించినంతనే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

బంగారం, వెండి, మట్టి వంటి తదితర శివలింగాలను పూజించడం కలిగే పుణ్యఫలం ఒక్క నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన కలుగుతాయి.

ఈ బాణలింగాన్ని పూజించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి.

బాణలింగాలకు అభిషేకం చేసిన జలం సేవించిన వారికి కాలసర్ప దోషం ఉండదు.అభిషేక జలం త్రిదోషహరం, ఆరోగ్యకరం.

నర్మదా లింగాన్ని చూసినంతమాత్రాన్నే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సమస్త పాపాలు నశించునని పురాణాలు తెలుపుతున్నాయి.

శ్రీ లక్ష్మీ నారాయణ సాలిగ్రామ మాల సాలిగ్రామాన్ని రోజూ పూజించేవారు. ఆరోగ్యంతో అలాగే సంపదతో తులతూగుతారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఇందులో కొలువై ఉంటారు. 

నేపాల్లోని గండకి నది వద్ద శాలిగ్రామాలు విస్తృతంగా లభిస్తాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితంనుంచి ఈ ప్రాంతంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని నమ్మకం. 

పురాణాలలో శాలిగ్రామ శిల ప్రాముఖ్యత గురించి దానిని పూజించడం వెనుక గల ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది.ఈ సాలిగ్రామాలు అధిక శక్తివంతమైనవి, అద్భుతమైనవి.

నియమ నిష్ఠలతో ఈ సాలిగ్రామాలను పూజించడం వలన సకల సంపదలు కలిగి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.

ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు.సాలగ్రామానికి చేసిన అభిషేక తీర్ధం నిత్యం సేవించడం వలన సర్వదేవతానుగ్రహం లభిస్తుంది.

ఆ లక్ష్మీ నారాయణుల పరిపూర్ణ కటాక్షంతో భోగభాగ్యాలు అనుభవించి ముక్తి పొందుతారు.సర్వరోగాల నుండి విముక్తికి సాలగ్రామ మాల.

Thursday, January 20, 2022

పురుషర్షభ అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు

భగవద్గీత
రెండవ అధ్యాయం

నిన్న 
ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. అటువంటప్పుడు ఇక విచారం దేనికి? అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఈ విషయాన్నే అక్కడ సంజయుడు దృతరాష్ట్రునికి చెప్తున్నాడు.

ఈరోజు
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినోஉనిత్యాః
తాంస్తితిక్షస్వ భారత 14

తాత్పర్యం: ఓ కౌంతేయా! ఇంద్రియాలకు సంబంధించిన ఎండాకాలం, చలికాలం, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తాయి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి తాత్కాలికంగా జరుగుతూ ఉంటాయి. ఓ భారతా! వాటిని సహించ వలసిందే.

వ్యాఖ్యానం: అర్జునుడు కుంతీ పుత్రుడు కాబట్టి కౌంతేయ అని పిలువబడ్డాడు. భరత వంశస్థుడు కాబట్టి భారతా అని పిలవబడ్డాడు.

చలి, ఎండ, సుఖం, దుఃఖం ఇవి తాత్కాలికంగా వస్తుంటాయి, పోతుంటాయి. వీటికి మనం అలవాటు పడాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు విచారించడం బుద్ధిమంతుల లక్షణం కాదు. వీటిని మనం అలవాటుగా చేసుకోవాలి.

యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం
సోஉమృతత్వాయ కల్పతే 15

తాత్పర్యం: ఓ పురుష శ్రేష్టుడా! అర్జునా! ఎవరైతే చలికి గాని, వేడికి గాని తట్టుకుంటారో, ఎవరైతే సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా చూస్తారో, వారు మోక్షానికి అర్హులు.

వ్యాఖ్యానం: పురుషర్షభ అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు.అంటే పురుషులలో శ్రేష్ఠుడు అని అర్థం. శీతోష్ణాలను, సుఖదుఃఖాలను ఎవరైతే సమానంగా చూస్తారో వారిని పురుషులలో శ్రేష్ఠుడు గా భావించవచ్చు. అర్జునుడు అలాంటి గుణాలను కలిగి ఉన్నాడని శ్రీకృష్ణుడి భావం కావచ్చు. అప్పుడు అర్జునుడు మోక్షానికి కూడా అర్హత సాధించినట్లే.

మనకు ఆ అర్హత ఉందా అని మీరు బాగా ఆలోచించండి. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తాం. కష్టం వచ్చినప్పుడు కుమిలిపోతాం. వ్యాపారం చేసినప్పుడు లాభం వస్తే సంతోషిస్తాం. నష్టం వస్తే ఏడుస్తాం. అలా కాకుండా దానికి కారణాలు తెలుసుకుని, మరలా ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి.

అదే విధంగా విద్యార్థులు పరీక్షల్లో పాసయితే పార్టీ ఇస్తారు. ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. అలా కాకుండా ఎక్కడ ఫెయిలయ్యారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే మార్గం చూసుకోవాలి. ఏ విషయంలోనైనా సరే అంతే. ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కాదు.

మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్జునుడే. మనందరికీ ఉపదేశం చేయబోయేది ఆ శ్రీకృష్ణపరమాత్మే.

Wednesday, January 19, 2022

గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా?

శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తుందని చెబుతారు. 
అంతే కాదు #శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, #శడగోప్యం అని అంటారు. శఠగోపం అంటే త్యంత గోప్యమైనది అని అర్థం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.

శఠగోపం విశేషాలు:
శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు.

అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.

శఠగోపం వలన కలిగే ఫలితం:
శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.

శ్రీ #మహాభారతం - #శాంతిపర్వం. #శారిక - #బ్రహ్మదత్తుల #సంవాదం

మహాభారతం - శాంతి పర్వం -39(2) - ముఖ్యంగా అయిదు రీతుల పగ పుడుతుంది.

బ్రహ్మదత్తుడు: ఓ పూజనీ! ‘నీవన్నది నిజమే! ఈ విషయంలో నీ దోషమేమీలేదు. కానీ నీవు వెళ్లి పోతే మాత్రం నామనసుకు కష్టంగా వుంటుంది,కనుక ఇక్కడే వుండు’మన్నాడు.

శారిక : రాజా! ఒకరి నొకరం నొప్పించుకొన్నాము. దీని వలన మనసులో చల్లారని పెద్ద పగ ఏర్పడింది. అయినా నీ తియ్యని మాటలకు మోసపోయి మళ్ళీ కలిసి మెలసి వుండడం కుదరద'ని చెప్పింది.

బ్రహ్మదత్తుడు: నాబిడ్డ చేసిన దానికి నీవు ప్రతీకారంగా గుడ్లు పీకేశావు. అంతటితో పగ తీరి పోతుంది. ఎటువంటి నీచులైనా దగ్గరకు చేరిన బుద్దిమంతులను వారు చేసిన మేలును మరచి నింద మోపరు కదా! 

శారిక: రాజా! స్నేహం చెడిపోయినా, తియ్యని మాటల మాయలో పడిపోయి ఆ పగను మరచి పోవచ్చు కానీ ... దాని వలన చావు సంభవించవచ్చు. కలత పుట్టవచ్చు. కీడు పొందవచ్చు. అంతేగానీ మంచి మాత్రం జరుగదు. 

'వినుము! నేల దోఁచికొనినను దాయాదులైన మాట మాటకేని నాఁడు వారి యెడను గీడు వారక చేసినఁ బగ జనించు నిట్లు భంగులైదు'

ఓ రాజా! ముఖ్యంగా అయిదు రీతుల పగ పుడుతుంది. భూమి దురాక్రమణవలన, దాయాదుల వలన, ఆడవారి వలన, మాటామాటా పెరిగి నందువలన, అడ్డూ ఆపూ లేని చెడు తలపెట్టడం వలన పగ పుడుతుంది. పగ పుట్టిన తరువాత ఒక పట్టాన పోదు. అది చెట్టులో దాగిన నిప్పువలె మనసులో దాగి వుంటుంది. కాబట్టి నమ్మితే మాత్రం ఎప్పుడైనా చెడిపోతాడు. అంతేకాదు కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను, కన్న సంతానాన్ని,స్నేహితులను కూడా నమ్మవద్దని నీతి శాస్త్రం చేతున్నది. కనుక మనసు నిండా పగ పూనిన వాళ్ళను ఏవిధంగా నమ్మాలి? ఇక నీ చతురోక్తులు చాలించు.

బ్రహ్మదత్తుడు: శారికా! కాలాన్ని బట్టి జనానికి మంచి చెడులు కలుగుతూ వుంటాయి. వాటిని దాటి ముందుకు పోవడం మన వశమౌతుందా? అంతెందుకు? నిన్ను వదులు కోవడానికి నేనేమైన వెఱ్రి వాడనా?

శారిక: (బ్రహ్మ దత్తుని వైపు తీక్షణంగా చూసి) రాజా నీ చల్లని మాటల మాటున దాగిన కోపం సముద్రంలో దాగిన బడబాగ్ని వంటిది' అని పలికి రాజుపై తనకు గల అపనమ్మకాన్ని బైట పడనీకుండానే పూజని తనకు అనువైన చోటుకు ఎగిరి పోయింది. అందువలన ధర్మజా! ప్రజలెవ్వరినీ రాజు గుడ్డిగా నమ్మరాదు. అప్పుడే తననూ, తన సంపత్తినీ రక్షించు కోగలుగుతాడు. భారద్వాజ వంశసంభవుడు ‘కణికుడు’ సౌవీర రాజు శత్రుంజయుడికి ఉపదేశించిన నీతి వాక్యాలు విను. (ఆది పర్వంలో ఒక కణికుడు దుర్యోధనుడికి దుర్బోధ చేశాడు. అతను వేరు. అతడు శకునికి మంత్రి).

జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.


Image #TheQuint

చివరి శ్వాసను విడుస్తున్న, జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. 

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 

"జాగ్రత్త! ఓ మృత్యువా! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! 

మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. 

అదే సమయంలో, జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. 

జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.

Saturday, December 11, 2021

తిరుమల - టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం.

జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది.

కోవిడ్ నిభందనలు సడలిస్తే, పండుగ తరువాత సర్వదర్శనం పెంపు.

ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం.

11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్స నిర్వహించారు.

చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం.

పాలకమండలి సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు.

500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులకు కేటాయిస్తాం.

హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తాం. 

నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మిస్తాం.

భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చడానికి నిర్ణయం.

హిందు ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు.

వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తాం.

ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం.

2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు.

శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తాం.

తాళ్లపత్ర గ్రంధాలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తాం.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పిస్తాం.

భక్తులకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తాం.

కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాం.

3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు.

10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం.

12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం.

వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ

Tuesday, November 30, 2021

సహధర్మచారిణి

సనాతన ధర్మంలో భార్య అన్న పదానికి ఉన్న అనేక పదాలలో 'సహధర్మచారిణి' అన్నది విశిష్ట మైనది. 

ధర్మయుతమైన భర్త మార్గాన్ని అన్నివిధాలా తాను అనుసరించి అనుగమించేది అని అర్థంచెప్పుకోవచ్చు. పెళ్లి నాటి ప్రమాణాలు ప్రకారం ధర్మేచ ,అర్థేచ, కామేచ భార్యాభర్తలదిద్దరిదీ ఒకే మార్గం అయితే ఆ దాంపత్యం అన్యోన్య సుఖదాయకంగా ఉంటుంది. ఈ ఆదర్శాన్ని చాటి చెప్పడానికే బ్రహ్మాది దేవతలు తమ సతీమణులకు సగౌరవ స్ధానాలిచ్చి ఆదర్శమూర్తులయ్యారు. తన చతుర్ముఖాలలో  సరస్వతిని నిలిపాడు బ్రహ్మ దేవుడు.అంటే  విధాత రసనాగ్రసీమను (బ్రహ్మ నాలుకనే వేదికగా చేసుకొని) వాణి వేదవాణిగా లాస్యమాడింది. ఇక విష్ణుమూర్తి తన వక్షస్థలం పై లక్ష్మీ దేవిని నిలుపుకొని ఆమెకు హృదయస్థానాన్ని ఇచ్చాడు. దీనర్థం స్వామిది సంకల్పం అయితే అమ్మ సిద్ధిదాత్రి అన్నమాట. వీరిద్దరినీ మించి తన మేనిలో సగభాగమిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు జగదీశ్వరుడు. అంటే తామిద్దరమూ అభిన్నమని విడదీయరానంతగా కలిసి ఉన్నామని తెలపడమే అర్ధనారీశ్వర తత్త్వ పరమార్ధం.

దీన్నే కాళిదాసు మహాకవి రఘువంశంలో

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

'జగత్తుకు తల్లిదండ్రులు ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులు వాక్కు అర్థాలలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. వారు ఈ నా కావ్య రచనకు  అర్థవంతములైన మంచి వాక్కులను ప్రసాదింతురుగాక!' అని నుతిస్తాడు. మాటను అనుసరించే అర్థం వచ్చినట్లుగా సతిపతులిద్దరూ ఒకరిననుసరించి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే సంసారంలో ఆనంద సరాగాలు వెల్లివిరుస్తాయి.

లక్ష్మీ నారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, అరుంధతీ వసిష్ఠులు, సీతారాములు, రాధాకృష్ణులు అని భార్యలతో కలిపి భర్తల పేర్లు స్మరించడం లోకంలో పరిపాటి. కానీ ఒక్క పరమశివుణ్ణి మాత్రం  సాంబశివుడని పిలిస్తే చాలు. స+ అంబ శివుడు అంటే అమ్మతో కూడిన అయ్య . పార్వతీ పరమేశ్వరుల రూపం లాగానే వారి పేర్లు కూడా ఒకటిగా కలిసి పోయాయి. తల్లి జగన్మాత - శివుడు జగదీశ్వరుడు అంటే ఆమె శక్తి - స్వామి శక్తి మంతుడు. దీనికర్థం ఏమిటంటే అమ్మవారి అండ లేనిదే పరమేశ్వరుడు కనీసం కదలను కూడా కదలలేదు. అందుకే సౌందర్య లహరిలో  ఆదిశంకరులు అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించి త్రిమూర్తులకు సైతం వారి వారి శక్తి లేకపోతే చలనమే ఉండదు అని చెప్తారు.

సహధర్మచారిణి స్ధానాన్ని మించిన పదవి ధర్మపత్నికి లభించిందన్నమాట. ఇలా ఒక్కోసారి ఇల్లాలివల్లే ఇంటాయన గౌరవం కూడా పెరుగుతుందని ప్రాచీన స్తోత్రవాఙ్మయం నిరూపిస్తుంది.

"చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో

జటాధారీ కంఠేభుజగపతిహారీ పశుపతిః

కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం

భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదమ్"

"చితిలో బూడిదను భస్మంగా ధరిస్తాడు.విషాన్ని ఆహారంగా స్వీకరిస్తాడు.దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దిగంబరుడు, జటలు కట్టిన వెంట్రుకలు గలవాడు, మెడలో విషసర్పాన్నే ఆభరణంగా ధరించినవాడు, కపాలాన్ని చేతదాల్చినవాడు, భూతాధిపతి,పశుపతి అన్నపేరున్నవాడు శివుడు. కానీ ఓ భవానీ! నిన్ను వివాహమాడి నందువల్లనే ఈశుడు జగదీశుడనే గొప్ప పదవిని పొందాడు" అని అంటారు ఆదిశంకర భగవత్పాదులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో. యమునితో పోరాడి పతిప్రాణాలను దక్కించుకున్న సతీసావిత్రి, త్రిమూర్తులనే పసిబిడ్డలు గా చేసి లాలించిన సతీ అనసూయ వంటి పతివ్రతా శిరోమణులకు నిలయం మన భారతదేశం.

శ్రీమద్రామాయణంలో అశోకవనంలో శోకిస్తున్న  సీతామాతను గురించి చెబుతూ ఆదికవి వాల్మీకి పరమాత్మ కోసం పరితపించే జీవాత్మ లాగా సీతమ్మ ఉంది అంటాడు. జీవాత్మ పరమాత్మ బంధాన్నే దాంపత్య బంధంగా ఆదికావ్యం  రామాయణం నిరూపిస్తుంది.

ఇలా భర్తలను ఆరాధించి, అనుసరించి, అనుగమించి జీవితాంతం సాహచర్యం అందించిన భారతీయ మహిళలు సర్వదా సమాదరణీయలు.

దైవం మానుషరూపేణ

ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు. అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు. తాను దారి తప్పి పోయాడని. అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి. ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు.

ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని,తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు. పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు.  తనకు తెలియకుండానే 'భగవంతుడా. నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు.

వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??' అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు.

వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి, తన మనసులో 'శివయ్య. నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు.' అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు.

ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు. 
అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది! మీరేమైనా చూసారా?" అని అడిగాడు  అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కల కూర్చున్నా. ఈ వైపు ఏ కుందేలు రాలేదు." అన్నాడు. 

ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది! ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈ రోజు వేట వృథా అయినట్టే." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. 

వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్న.  నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా". అంటూ కొంచం ధీనంగా అడిగాడు. అందుకు, ఆ వేటగాడు-ఆ నాస్తికున్ని తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. 

నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి" అన్నాడు. 

ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి" ఏందయ్యా సామి? దేవుడు లేడంటావా?మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు, అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను, అలాంటిది, ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని,పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది. అంతా శివ లీల" అన్నాడు.

దానికి నాస్తికుడు "అంతా శివ లీలనా??ఇదంతా ఆ శివుడు చేయించే బదులు,శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా." అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే,అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా." అంటూ... ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి,తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి, కొంత డబ్బు తీసి, ఆ వేటగానికి ఇవ్వబోయాడు.

అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని,నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా నన్ను బయట పడేసావు! నీవు శివుడివో? శివుడు పంపిన దూతవో నీకే తెలుసు శివయ్య! ఇదంతా నిజంగా నీ లీలనే!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు.

ఇంతకీ ఆ నాస్తికుని పేరు చెప్పలేదు కదు.

అతని పేరు "శివ కేశవ"!

తండ్రి ఆశీర్వాదం

తండ్రి ఆశీర్వాదం

అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 

కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 
ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 

తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.

ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  

త్వరలోనే  నగరంలోని సంపన్నులలో, ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 

నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు.

ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  

ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 

నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. 

ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 

వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 

అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 

సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా, వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 

అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. 

ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.

అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

"లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 
అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”
ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*,  అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా, చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు!” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, "ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.
కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.

తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

Monday, November 29, 2021

త్రిచక్ర యాప్ - 3 Chakra Project

తిరుపతి అర్బన్ జిల్లా:




  • తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు.
  • త్రిచక్ర యాప్ ద్వారా ఆటో యొక్క వివరాలన్నీ నమోదు.
  • ఆటో ప్రయాణికులకు ప్రత్యేక రక్షణ.
  • తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్. 
  • నగరంలోని ఆటోలకు త్రిచక్ర యాప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు.
  • నగరములోని ఆటోల యజమానులు త్రిచక్ర యాప్ ను ప్లే స్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ప్రతి ఆటో దారుడు తప్పకుండా పూర్తి వివరాలతో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • నకిలీ వాహనాలను సులభంగా గుర్తించే అవకాశం.
  • ప్రయాణికులకు పూర్తిస్థాయిలో భద్రత.
  • ప్రయాణికులు ఉన్నచోట నుండి యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం.
  • ప్రయాణికులు పయనించు మార్గాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • దీని వల్ల ఆటో యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
  • ప్రతి ఆటోకు ఒక QR కోడ్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా ప్రయాణికులతో నేరుగా సంప్రదించవచ్చు.
  • ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు, పోలీసులకు అనుసందానమై ఉపయోగకరంగా ఉంటుంది.
  • ప్రయానికుల భద్రతే ముఖ్యం. దిశా యాప్ వలే పనిచేయడం వలన పూర్తి స్థాయిలో భద్రత.
  • ఆపదలో ఉన్నప్పుడు QR కోడ్ ఒక రక్షణ.
నగరంలో ఆటో ప్రయానికుల భద్రత దృష్ట్యా త్రిచక్ర యాప్ ను ప్రారంబించి ఆటోలకు గుర్తింపు నంబర్లను ఆటోలకు అతికించిన జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు. ఈ కార్యక్రమం ఈ రోజు బాలాజీ కాలనీ, లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగింది.   

జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ తిరుపతి నగరం మహా పుణ్యక్షేత్రం. ఇక్కడ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా నగరంలో ఎక్కువ భాగం ప్రజలు, మహిళలు, యువత ఆటోల పైనే ఆధారపడుతారు. భద్రత దృష్ట్యా నగరములో ఉన్న ఆటోలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరియు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉండాలనే ఈ త్రిచక్ర యాప్ ను తయారు చేయడం జరిగింది. 

భద్రత విషయంలో ఈ యాప్ దిశా యాప్ వలే భద్రతను కల్పిస్తుంది. ప్రయాణికులు, మహిళలు ఆటో లో ప్రయాణించినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైతే ఈ QR కోడ్ స్కాన్ ద్వారా రక్షణ పొందవచ్చు. చేయవలసినదంతా ఒక్కటే, ప్రతి ఆటోకు ఆటో ముందు బాగం, లోపల, బయట QR కోడ్ స్టిక్కర్లు అంటించబడి ఉంటుంది. అది గమనించి అత్యవసరమైనప్పుడు సమాచారాన్ని పోలీస్ వారికి తెలుపవచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితి, అనుమానం ఉన్నా వెంటనే ఆటోలోని QR కోడ్ ను స్కాన్ చేయగానే ఆటో యొక్క పూర్తి వివరాలు, డ్రైవర్/ఓనర్, ఆటో నంబర్, లొకేషన్ అన్ని తెలుస్తుంది. మీరు పోలీస్ వారికి, తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఆటో యొక్క వివరములను షేర్ చేయవచ్చును.   
 
నగరంలో ఉన్న ఆటో దారులందరు తప్పకుండా ఆటో మరియు డ్రైవర్/యజమాని యొక్క పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా పొందుపరిచి ఉంటుంది. ఆటో కావాలసిన ప్రయాణికులు వారు ఉన్న చోట నుండే యాప్ ద్వారా సులభంగా వారి వద్దకు ఆటో ను రప్పించుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు ప్రయాణించే మార్గాలను మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ యాప్ పోలీస్ స్టేషన్ నందు అనుసందానమై ఉన్నందున ఆటో ఎక్కడికి వెళుతున్నది, ఎక్కడ ఆగినది అనే పూర్తి వివరాలు పోలీసులకు సమాచారం తెలుస్తుంది. దీని వలన ప్రయాణికులు పూర్తి భద్రతతో సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరవచ్చు. అనుకోని సంఘటనలు జరిగినప్పడు QR కోడ్ వివరాల ద్వారా క్షణంలో పోలీస్ వారు మీ ముందు ఉంటారు.
 
నకిలీ ఆటోలను మరియు కొత్త వ్యక్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. ప్రతి ఒక ఆటో కు QR కోడ్ ఉన్నందున అనుకోని సంగటనలు జరిగినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాత్రికులు, ప్రజలు, మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, అందరు సురక్షిత భద్రత పొందాలని అలాగే ఆటో డ్రైవర్లు, యజమానులు ఇందుకు సహకరించి విజయవంతం చేసి తిరుపతికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాననని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు.

యాప్ యొక్క వివరాలు:

ప్రజలు:
 
1. ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర సిటిజెన్ అప్ ని డౌన్లోడ్ చేసుకోవలెను.

2. మీ పేరు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

3. రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వవలెను.

4. Nearby బటన్ మీరు click చేస్తే మీకు దగ్గర లో ఉన్న ఆటో ల వివరాలు వాటి ఫోన్ నెంబర్ లతో పాటు మీరు స్క్రీన్ పైన చూడవచ్చును. మీకు నచ్చినటువంటి ఆటో డ్రైవర్ కి ఫోన్ చేసి మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళవచ్చు.

QR స్కాన్ విధానం:

5. Dashboard నందు QR స్కానర్ ని ఉపయోగించి మీరు ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్న QR కోడ్ ను స్కాన్ చేసుకోవలెను.

6. QR స్కాన్ విధానం ద్వారా మీరు ప్రయాణిస్తున్న ఆటో వివరాలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ ప్రయాణం లో మీ లొకేషన్ తో పాటు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు.

7. ఆపద సమయంలో పోలీస్ వారికీ కూడా మీ లొకేషన్ ని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన తరువాత మీ సురక్షణ కోసం పోలీస్ వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు.

ఆటో యాజమాని:

1. ఆటో డ్రైవర్లు ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర అనే ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరు మీ మొబైల్ నెంబర్ డిస్ట్రిక్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను.

2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.

3. లాగిన్ అయిన తర్వాత మీ ఆటో యొక్క వివరాలు(ఆటో నెంబర్, ఆటో ఫోటో మొ.), ఆటో ఓనర్ యొక్క వివరాల(ఓనర్ ఫోటో, ఫోన్ నెంబర్, లైసెన్స్ ఫోటో మొ.) డాక్యూమెంట్లను ఆప్ లో అప్లోడ్ చేయాలి.

4. మీరు అప్లోడ్ చేసిన డాకుమెంట్స్ ని మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇచ్చిన తరువాత మీకు పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అయిన తరువాత మీకు QR కోడ్ ఉన్న స్టికర్ ఇవ్వటం జరుగుతుంది. .

5. మీకు స్క్రీన్ పైన ఒక Online/Offline అనే ఒక బటన్ ఉంటుంది. ఆన్లైన్ గ్రీన్ కలర్ లో పెట్టుకుంటే మీకు దగ్గర లో ఉన్న ప్రజలు మీకు ఫోన్ చేయటం ద్వారా మీకు బాడుగలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
 
పోలీస్:
 
1. ప్లే స్టోర్ నుంచి త్రిచక్ర ఆప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పోలీస్ అధికారి తన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు.

2. లాగిన్ అయిన తరువాత QR స్కానర్ ద్వారా ఆటో మరియు ఆటో డ్రైవర్ యొక్క వివరాలను పరీక్షించవచ్చును.

3. ఆటో యొక్క వివరాలని ఆటో డ్రైవర్ మొబైల్ నెంబర్ (లేదా) ఆటో నెంబర్ (లేదా) పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా కూడా ఆటో వివరాలను పరీక్షించవచ్చును.

4. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారికి వారి స్టేషన్ పరిధిలో ఉన్నటు వంటి ఆటోల యొక్క వివరాలు చూసి వాటికీ అప్రూవల్ ఇచ్చిన తరువాత పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అవుతుంది.
 
          ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు ట్రాఫిక్ I మల్లికార్జున, ట్రాఫిక్ II కాటమరాజు, వెస్ట్ నరసప్ప, సి.ఐ లు ఈస్ట్ శివప్రసాద్, ట్రాఫిక్ రామ సుబ్బయ్య, 3చక్ర యాప్ డెవలపర్ రియాజ్, ఆటో డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు.

Thursday, November 25, 2021

Chanting Vishnu Sahasranama

Vishnu Sahasranama was first composed & recited by Bhishma when he was on his deathbed. Lord Krishna went to see Bhishma because he was breathing his last. When Bhishma had darshan of Lord Krishna, he started reciting Vishnu Sahasranama immediately. Vishnu Sahasranama means, the rosary of thousand names of Lord Vishnu.

He started reciting Vishnu Sahasranama in the order he saw the lord's form continuously and successively.

Vishnu Sahasranama is found in Mahabharata, the great epic of India.

If confers all the mundane transcendental benefits to the person who chants it. There are so many Sahasranamas of Vishnu, but among them, this happens to be the most cardinal and important one because right from Sankaracharyalu there are so many Sages and Saints who have recited and commented in their own way. Even today, it is recited with fervor and gaiety in all the temples of Lord Vishnu.

The Chanting of the following names of Lord Vishnu immensely helps us in overcoming the obstacles in our daily life.

1. "Om Vashatkaaraaya Namaha" : For Success in Business.

2. "Om Aksharaaya Namaha": For Success in Studies.

3. "Om Bhuthabhavanaya Namaha": For Good Health.

4. "Om Paramaathmane Namaha": For Self Confidence.

Wednesday, November 24, 2021

బ‌ల్లిశాస్త్రం చెప్పే నిజాలు

బల్లి శరీరంపై పడితే మనలో చాలా మంది ఆందోళన పడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి. 

మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది. 

కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం. 

వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు. 

ఇక స్త్రీలపై బల్లి పడితే: తలపై పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి. 

స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు. 

ఇక బల్లి ఎవరిపైనా అయినా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. 

బల్లి పై పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి. 

బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష నిపుణులు మరియు శాస్త్ర వివరణ.

Monday, November 22, 2021

మన పండుగల గొప్పతనం 




సంక్రాంతి: మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహాశివరాత్రి: కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

హోలీ: వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ఉగాది: కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

శ్రీరామ నవమి: భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

అక్షయ తృతీయ: విలువైన వాటిని కూడబెట్టుకోమని.

వ్యాస (గురు) పౌర్ణమి : జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

నాగుల చవితి: ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం: నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి: తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

వినాయక చవితి ( నవరాత్రులు ): ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

పితృ అమావాస్య: చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

దసరా ( ఆయుధ పూజ): ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి: పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

కార్తీక పౌర్ణమి: చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

గోదాదేవి ఎవరు

గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.

తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.

పాశురాల పరమార్ధం: తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.

తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.

చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.


Wednesday, October 20, 2021

Direction priority in Hinduism

We have eight directions. We call them 'octagons'. Those who rule them are called 'Directors'. Directions: East, West, North and South are called 'Directions'.

 Directions: In addition to these four directions, there are also four directions: Northeast, Southeast, Southwest and Northwest. All together we call it octagons.

 1) East: The ruler of the east, Indra is the presiding deity. Sachidevi, wife of Indra. His vehicle is an elephant. The town where he lives is 'Amravati.' The weapon worn by Indra was the diamond weapon. He is a male fertility factor. The giver of power. This directional error, which is preferred by the solar system, can lead to health problems and official misery.

 2) Southeast Source: The ruler of the southeast, Agnihotra, the presiding deity. Agni wife Swahadevi. Vehicle trunks. Tejovati is the town where Agnihotra lives. Wearable weapon power. He is the giver of anger and pride. Southeast Venus takes precedence. The direction of southeast cooking. Cooking is for women so this directional error can make women sick.

 3) South: The ruler of the south is Yamadharmaraju, the presiding deity. He is also known as Dandapani. Shyamaladevi, the wife of Yamuna. The vehicle of Yamuna is Mahishamu (Dunnapothu). The town where he lives is restrained. The weapon worn by Yamudu is the wand. He is also known as 'Dandapani' as he has a weapon as a weapon. Yamudu is the destroyer, the giver of disease. The Mars-dominated southern hemisphere often causes traffic accidents and fires.

 4) Southwest Source: The ruler of the southwest, a demon called Nivruti, the presiding deity. His wife is Deerghadevi. Vehicle Narrow. The town where he lives is Krishnangana. The weapon worn by the southwest is the spear. Genocide Southwest. Southwest direction Rahugraha is preferred so this directional error always causes more mental annoyance in the family.

 5) West: The ruler of the west, the presiding deity Varuna. Kalikadevi, the wife of Varuna. Vehicle Capricorn (crocodile). The town where he lives is Shraddhavati. The weapon worn is a noose. Giver of all good fortune. Due to Saturn's predominance in the west, this directional error will cause delays.

 6) Northwest Source: The ruler of the northwest, the presiding deity is the wind. I.e. the god of air. His wife is Anjanadevi. No vehicle. Gandhavati is the town where he lives. The weapon worn is the flag. The Son is the giver of offspring. The northwest direction is dominated by the moon, which causes fluctuations in this direction.

 7) North: The ruler of the north, Kubera, the presiding deity. His wife Chitralekha. The vehicle is a horse. Alakapuri is the town where Kubera lives. The weapon that Kubera wears is the sword. Education, income, children, reputable giver. Due to Mercury's dominance in the north, this directional error can lead to problems in business and education.

 8) Northeast Source: Lord Shiva, the ruling deity of the Northeast. Parvati Devi, the wife of Shiva. The vehicle of Shiva is the bull. Place of residence Kailasam. The weapon worn by Lord Shiva is the trident. Gangadhar is the giver of Ashtaishwaryas, devotional knowledge and higher jobs to Lord Shiva. Jupiter dominates the northeast. If there is a defect in the northeast, there will be difficulties in procreation.

 In this way there are eight compasses in the eight directions and they always protect the human beings.

 Sri Maha Vishnu is also the dictator of the Dikpalakas. Appointing them to the eight directions, the one who commands the rituals, the rules, the dharmas, the one who guides, the supreme (husband) Sri Maha Vishnu is the emperor of all the gods.

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...